స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2,446 పోలింగ్ కేంద్రాలున్నట్టు పంచాయతీరాజ్ శాఖాధికారులు ఆదివారం ప్రకటించారు.
మండలానికి చెందిన అటవీశాఖ రేంజ్ కార్యాలయాలు ఇతర జిల్లాల్లో కొనసాగుతుండడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండడంతో ఆదివారం ఆరవ గేటును ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మన్యంలో కాఫీ బెర్రీ బోరర్ కీటకాన్ని నియంత్రించేందుకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కీటకాన్ని తొలిదశలోనే గుర్తించేందుకు యాభై ప్రత్యేక బృందాలతో కాఫీ తోటల్లో సర్వే చేపడుతున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగల్లం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ ఆదివారం కుప్పకూలింది. అందులో సెంట్రింగ్ మేస్త్రి చిక్కుకుపోయాడు.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయం ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం సందడిగా సాగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్-కేంద్ర పారిశ్రామిక భదత్రాదళం) తాజాగా నోటీసు జారీ చేసింది.
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ పాల్గొన్న కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.
నగరంలో బ్రిక్స్ దేశాల క్రీడా, యువజన మంత్రుల సమావేశాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.