సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జీవీఎంసీ మూడేళ్ల కిందట రూ.11 కోట్లతో కృష్ణాపురం, ముడసర్లోవ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానళ్లు మూలకుచేరాయి.
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఏడు గంటలైనా వడగాడ్పులు తగ్గడం లేదు.
గాజువాక మండలం యాదవజగ్గరాజు పేట, దువ్వాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, గెడ్డవాగులు ఆక్రమణకు గురవుతున్నాయి.
వేసవి ఎండల ప్రభావంతో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవి ప్రారంభానికి ముందున్న వినియోగంతో పోల్చితే ఇప్పుడు 15 శాతం వరకు పెరిగింది.
జాతీయ రహదారిపై మండలంలోని పోతిరెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో లారీ డ్రైవర్ ఒకరు సొంత సోదరుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనకు స్థలానికి వెళ్లి పరిశీలించారు.
భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాడ్పులతో జనం విలవిలలాడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ మండిపోతున్నది. పది గంటల తరువాత జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఒకింత ఉపశమనం చెందారు.
మండలంలోని దుప్పితూరులోగల భావనారుషి దేవస్థానానికి చెందిన భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా ఏపీఐఐసీ అధికారులు ప్రహరీగోడ నిర్మిస్తుండడం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గోడ నిర్మిస్తున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్లే...
పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.