• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

రూ.5 కోట్లతో బీచ్‌ పరిశుభ్రత

రూ.5 కోట్లతో బీచ్‌ పరిశుభ్రత

బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో యంత్రాలతో ఇసుకను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.

సవాల్‌గా మారిన సర్‌ ప్రక్రియ

సవాల్‌గా మారిన సర్‌ ప్రక్రియ

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ బీఎల్‌వోలు, అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. సాంకేతిక సమస్యలు, బూత్‌ పరిధి ఓటర్లు వేర్వేరు గ్రామాల్లో ఉండడం, పేర్లలో అక్షర దోషాలు, ఇంటర్నెట్‌ సమస్యతో ఈ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. దీంతో జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ సర్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి పురోగతి కనిపించడం లేదు.

అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయం

అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయం

అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయంగా ఉంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ఘాట్‌రోడ్డులో గోతులను పూడ్చారు. ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే తిరిగి గోతులు ఏర్పడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పాణిరంగిని- బెంజిపూర్‌ మార్గంలో ప్రస్తుతం అడుగడుగునా గోతులు కనిపిస్తున్నాయి.

గరిష్ఠస్థాయికి డుడుమ నీటిమట్టం

గరిష్ఠస్థాయికి డుడుమ నీటిమట్టం

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం

జిల్లాలో తొలిసారిగా ఉద్యానశాఖ అధికారులు రాంబుటాన్‌ మొక్కలను పరిచయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 328.092 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ సాగు చేపట్టేందుకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లపాటు రైతులకు సాగు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఈ ఉద్యాన పంటల ద్వారా గిరిజన రైతులు సుస్థిరమైన ఆదాయం పొందనున్నారు.

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. అవి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేదు.

షార్ట్‌ సర్క్యూట్‌తో వ్యాన్‌ దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో వ్యాన్‌ దగ్ధం

ఐషర్‌ వ్యాన్‌ క్యాబిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని ఆపి, కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల ప్లాట్‌ ఫారాలు కిటకిటలాడాయి. విశాఖపట్నం, విజయనగరంతోపాటు అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం అధిక సమయం నిరీక్షించాల్సి వచ్చింది.

ఆర్‌అండ్‌బీ వంతెనలకు మోక్షం

ఆర్‌అండ్‌బీ వంతెనలకు మోక్షం

జిల్లాలో చాలా ఏళ్ల నుంచి అసంపూర్తిగా వున్న ఆర్‌అండ్‌బీ వంతెనల అప్రోచ్‌ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో ఎలమంచిలి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన నాలుగు అప్రోచ్‌ రోడ్లు వున్నాయి.

నిధులున్నా.. మొదలుకాని పనులు

నిధులున్నా.. మొదలుకాని పనులు

మండలంలోని భోగాపురం సమీపంలో తగరంపూడి గ్రోయిన్‌ వద్ద శారదా నది గట్టు పునర్మిర్మాణ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. గత ఏడాది మొంథా తుఫాన్‌ సమయంలో శారదా నది వరద ఉధృతితో ఇక్కడ గట్టు భారీగా కోతకు గురైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి