జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో ఉద్యోగి ధార సింహాచల పాత్రో (57) అలియాస్ ధారబాబు పాత్రో శనివారం ఉదయం జెన్కో కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతున్నది.
జిల్లాలో పది వేల మందికి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందనున్నాయి.
మన్యంలో శనివారం ఎండ తీవ్రంగా కాసింది. దీంతో ఏజెన్సీ వాసులు అల్లాడిపోయారు.
మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ఘటన కలకలం రేపింది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఊహించని విధంగా వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్లో సాంకేతిక సమస్య ఏర్పడి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యాధికారులు అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు చికిత్స అందించి రికార్డు సృష్టించారు.
అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
విశాఖ నగరంలో చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా విశాఖ క్రైమ్ విభాగం పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన ఏప్రిల్ నెల ‘రికవరీ మేళా’లో రికార్డు స్థాయిలో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు.
ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్పుల్లో మౌలిక వసతుల కల్పన ‘పనులు’ తమకు కావలసిన వారికి దక్కేలా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) అధికారులు నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు, మూడు రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది.