భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి.నిషాంతి హెచ్చరించారు.
సీలేరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలోని మాదిమళ్లు వంతెన అప్రోచ్ రోడ్డు తాజాగా కురుస్తున్న వర్షాలకు బురదమయమైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల-1ను సోమవారం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సందర్శించారు. విద్యా ప్రమాణాలు, వసతి గృహ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు.
మన్యంలో ప్రస్తుతం ఖరీఫ్ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమవుతున్న దృశ్యాలు, నీటితో నిండిన పంట పొలాలు, భూములను దున్నుతున్న రైతులు, నాట్లు వేస్తున్న మహిళలు కనిపిస్తున్నారు.
స్థానిక అదనపు ఎస్పీ నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్డీ(అడ్మిన్)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతే రాజధాని అని గతంలో జగన్తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు.
మత్స్యకార కుటుంబాల్లో ఆదివారం తీవ్ర అలజడి రేపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తాపడి ఆరుగురి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
స్మార్ట్సిటీగా గుర్తింపుపొందిన విశాఖలో సైక్లింగ్ను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో జీవీఎంసీ ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఓటర్ల జాబితాను సంస్కరించేందుకు ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది.
మండలంలోని మాడగడ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్బీ జోషి పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి మాడగడ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 244ను సందర్శించి, ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటా సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ నమోదు ప్రక్రియ, బీఎల్వోల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి సర్ ప్రక్రియ సమర్థంగా జరగడానికి అవసరమైన పలు సూచనలు చేశారు.