నగరానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్కల్యాణ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
స్టీల్ ప్లాంటులో ముడి పదార్థాలు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్లు తరచూ తెగిపోతుండడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
జిల్లాలో గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా పాఠశాలల్లో నిర్మాణం చేపట్టిన అదనపు భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన పేరుతో నాడు-నేడు పథకాన్ని అమలు చేసిన వైసీపీ పాలకులు.. ఆయా పనులు చేపట్టిన పాఠశాలల కమిటీలకు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో అర్ధంతరంగా పనులు ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ‘మన బడి-మన భవిష్యత్తు’ పథకం కింద అసంపూర్తిగా వున్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడుగు మందుకు పడడంలేదు.
ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఆయుర్వేద ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో వసతి సదుపాయాలను కల్పించడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమించి, సకాలంలో మందులను సరఫరా చేస్తున్నది. దీంతో ఆయుర్వే ఆస్పత్రులకు క్రమేపీ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ కమిషనర్ దినేశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇటీవల అన్ని ఆస్పత్రులకు మందులను సరఫరా చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లాపై తుఫాన్ ప్రభావం అంతగా వుండనప్పటికీ.. వాతావరణం మారిపోవడంతో రైతులు.. ముఖ్యంగా వరి సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేపట్టగా, ఇంతవరకు సగానికిపైగా విస్తీర్ణంలో వరి కోతలు పూర్తయ్యాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఇంకా కుప్పలు వేయలేదు.
ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే వణ్య ప్రాణుల గణన డిసెంబరు ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మాంసాహార జంతువులు.. అంటే పులులు, చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఎలుగుబంట్లు వంటి వాటిని లెక్కిస్తారు. అటవీ శాఖ అధికారులు రోజూ ఉదయం ఆరు గంటలకు వణ్యప్రాణుల గణనను మొదలుపెడతారు. అటవీ ప్రాంతంలో రోజుకు ఐదు కిలోమీటర్ల చొప్పునతిరుగుతారు. ఈ సందర్భంగా ఆయా జంతువుల పాదముద్రలు, మలవిసర్జన వ్యర్థాలు, చెట్ల మీద ఉన్న గోర్లు గుర్తులు వంటి వాటి ద్వారా ఆయా జంతువులను గుర్తిస్తారు. మూడు రోజులపాటు సేకరించిన వివరాలను 4, 5 తేదీల్లో ఆన్లైన్లో పొందుపరుస్తారు.
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
మండలంలోని కొండపాలెం, కేపీ అగ్రహారం, ఐతంపూడి, పి.భీమవరం గ్రామాల్లో కోతులు, అడవి పందులతో పాటు నత్తల బెడద ఎక్కువైంది.
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) నిర్వహణలో ఉన్న ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నారు.
మండలంలోని వంజంగి మేఘాల కొండకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది.