• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

నేవీ రిహార్సల్స్‌ అదుర్స్‌

నేవీ రిహార్సల్స్‌ అదుర్స్‌

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఇవి అరగంటపాటు కొనసాగాయి. తొలుత హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని, నౌకాదళం పతకాలను రెపరెపలాడిస్తూ ముందుకుసాగాయి. ఆ తరువాత చేతక్‌ హెలికాప్టర్లు, వాటి వెనుక జెట్‌ స్పీడ్‌తో మిగ్‌ 29కే యుద్ధ విమానాలు దూసుకువెళ్లాయి.

పోర్టులో కార్గో మాఫియా

పోర్టులో కార్గో మాఫియా

విశాఖపట్నం పోర్టులో కార్గో మాఫియా వెర్రితలలు వేస్తోంది. పోర్టు ఇచ్చిన బిడ్‌ మొత్తం కంటే 99 శాతం తక్కువకు రెండు కంపెనీలు టెండర్లు వేయడం అటు పోర్టు యాజమాన్యంతో పాటు ఇటు వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై  స్పీడ్‌ లేజర్‌గన్‌

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై స్పీడ్‌ లేజర్‌గన్‌

నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యతోపాటు నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ ఏఐ డ్రైవెన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏప్రిల్‌ ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించినా, అనివార్య కారణాలతో ఆ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. దానికి ప్రత్యామ్నాయంగా స్పీడ్‌ లేజర్‌గన్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి వాటిని పది చోట్ల ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు.

హాస్టళ్లకు  సొంత భవనాలు

హాస్టళ్లకు సొంత భవనాలు

రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటికీ అధునాతన వసతులతో సొంత భవ నాలు నిర్మించనున్నామని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆయన మంగళవారం దసపల్లా హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

గూగుల్‌కు  భూసేకరణ పూర్తి

గూగుల్‌కు భూసేకరణ పూర్తి

ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు భూసేకరణ మంగళవారంతో పూర్తయింది. ఇప్పటివరకు భూమి ఇవ్వని దివ్యాంగుడైన రైతు గణేశ్‌ కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మంగళవారం తన అంగీకార పత్రాలను మండల రెవెన్యూ అధికారులకు సమర్పించారు.

మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తిని ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందారు.

తగ్గని చలి తీవ్రత

తగ్గని చలి తీవ్రత

మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం కూడా పొగమంచు దట్టంగా కమ్మేసింది.

హైవేపై ప్రయాణమంటే హడల్‌

హైవేపై ప్రయాణమంటే హడల్‌

జాతీయ రహదారి 516-ఈపై ప్రయాణమంటే వాహనచోదకులు హడలిపోతున్నారు. ముఖ్యంగా మండలంలోని అంత్రిగుడ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం

నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం

ఆరోగ్య సమస్యలు సృష్టించే నులిపురుగుల నివారణ ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి