భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోయారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. క్రమేపీ ఎండ తీవ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు మొదలయ్యాయి. పది గంటల తరువాత పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. అధిక ఎండకుతోడు ఉక్కపోతతో ఇళ్లల్లో ఉన్న వారు సైతం చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో దాదాపు సగం మండలాల్లో వరుసగా ఐదో రోజు కూడా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గం నిప్పుల కొలిమిలా మారింది. నర్సీపట్నంలో రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మన్యంలో ఆదివారం ఎండ తీవ్రంగా కాసింది. ఈ ఏడాదిలో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి తీవ్రమైంది. దీంతో మధ్యాహ్నం బయట సంచరించలేని పరిస్థితి కొనసాగింది.
మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగుడ గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అందంగా తయారైంది. దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో భవనాల ఆధునికీకరణ, మౌలిక వసతులు కల్పించారు.
భారీ అగ్నిప్రమాదంతో నిలిచిపోయిన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శనివారం నాటి ప్రమాద సంఘటనపై ఆదివారం సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్(సీఈ) కేవీ రాజారావు ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి బృందంతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
ప్రొలాంగ్ స్టాండింగ్ జాబ్...ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా, ఎంతోమంది చేస్తున్న ఉద్యోగాలు ఇవే.
దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
విశాఖపట్నం నుంచి జూలై ఎనిమిదో తేదీ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి విమాన టికెట్లు తీసుకునే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ఎం.శ్రీభరత్ సూచించారు.