విశాఖ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ను దారిమళ్లించారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ఎట్టకేలకు జిల్లాలో జోరందుకుంది. జూన్ 15న మొదలైన సర్ ప్రక్రియను ఈ నెల 14 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే అనివార్య కారణాలతో జిల్లాలో మూడు రోజుల క్రితం వరకు కేవలం 44 శాతం మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది.
అసలే అధ్వాన రహదారి.. దానికి తోడు ఇరువైపులా ఆక్రమించిన తుప్పలు. దీంతో రాకపోకలకు వాహనచోదకులకు తప్పని తిప్పలు.. ఇదీ మండలంలోని చింతలపూడి- చోద్యం రోడ్డు దుస్థితి. ఈ రహదారి నిర్మించి సుమారు 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో గోతులమయమై 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం.. పలు ప్రాథమిక పాఠశాలల్లో కనీసస్థాయిలో కూడా విద్యార్థులు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించడంలేదు. సుమారు నెల రోజులపాటు ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అశించిన మేర విద్యార్థులు చేరలేదు. నూతన విద్యా విదానంలో భాగంగా చాలా వరకు ప్రాథమిక పాఠశాలలను ఒకటి, రెండు తరగతులకే పరిమితం చేయడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ఎస్ (ఎం)గా పనిచేస్తున్న జీకే పుష్పరాజ్ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేశారు. తాజాగా మూడు ఆస్పత్రుల్లో మందులు, ల్యాబ్, సర్జికల్ సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్ల త్రైమాసిక నిధులను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విడుదల చేసింది.
ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయే అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పీఎం పసల్ బీమా యోజనను మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేసిన పంటల బీమాను 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి జలగలమదుం జంక్షన్ నుంచి పాయకరావుపేట వద్ద తాండవ వంతెన వరకు పలు జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆరు నెలల కాలంలో జాతీయ రహదారిపై మొత్తం 129 ప్రమాదాలు జరిగాయి.
అనకాపల్లి- సోలాపూర్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది.
విశాఖపట్నానికి చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.