తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు వారికి నాణ్యమైన పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మెన్ చార్జీలను పది శాతం పెంచాలని నిర్ణయించింది.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)లో ఇటీవల నిధుల దుబారా అధికమైంది. అవసరం లేని ఖర్చులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైనా ఖర్చు చేయాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు ప్రతిపాదించడం, ఖర్చు చేయడం, బిల్లులు చెల్లించడం...ఇదే నడుస్తోంది.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) తయారుచేసిన మాస్టర్ ప్లాన్-2041ను ఆమోదిస్తూ దానిని అమలులోకి తీసుకువస్తున్నట్టు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీఓ జారీచేసింది. వాస్తవానికి ఈ మాస్టర్ ప్లాన్ వైసీపీ హయాంలోనే తయారైంది.
జీవీఎంసీ ఉద్యానవన (హార్టికల్చర్) విభాగం అవినీతికి కేంద్రంగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది...కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయిపోయారు. ఆ విషయాన్ని అలా ఉంచితే నిబంధనలను అతిక్రమించి చెట్లు తొలగించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఎక్కడైనా ఇంటికి లేదా దుకాణానికి చెట్టు అడ్డుగా ఉందని దానిని తొలగించేయాలనుకుంటే చట్టం అనుమతించదు.
బీచ్లో ప్రైవేటు ఫొటోగ్రాఫర్లకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్టు త్రీటౌన్ సీఐ జె.అప్పలనాయుడు తెలిపారు. ఆర్కే బీచ్లో సందర్శకులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఫొటోగ్రాఫర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సందర్శకులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలోకి తీసుకువచ్చే ‘ప్రాజెక్టు సారథి’తో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ అభిప్రాయపడ్డారు.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించి తిరిగి వెళుతున్న గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్రను బుధవారం మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు.
స్నేహితుడితో కలిసి బీచ్కు వెళ్లి సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ తిరుగు ప్రయాణమైన విద్యార్థినిని లారీ చిదిమేసింది. కొద్ది నిమిషాల్లో గమ్యం చేరుకుంటుందనగా మృత్యువు కబళించింది. ఈ విషాదకర సంఘటన పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి...
బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఆభరణాలపై ఇచ్చే రుణ మొత్తాన్ని తగ్గించాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ఒక దశలో రూ.16 వేలు దాటింది. ఆ సమయంలో ఆభరణాలపై గ్రాముకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు రుణంగా ఇచ్చారు.
ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశా మల్కన్గిరి జిల్లా బలమెల జలవిద్యుత్ కేంద్రంలో సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల నీటి వినియోగంపై సమీక్షించారు.