మండలంలోని సుజనకోట, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు, లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల పరిధిలో మత్స్యగెడ్డ వెలవెలబోతున్నది. సుమారు నెలన్నర క్రితం వరకు మత్స్యగెడ్డ నిండు కుండను తలపించింది. అయితే రెండు నెలల నుంచి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, మరోవైపు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తుండడంతో మత్స్యగెడ్డలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లకు తరలించి భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు కృషి చేశారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి చదివిస్తున్నారు.
జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్ కనీస నిబంధనలు పాటించడంలేదు. దీంతో వర్షాకాలంలో బురదతో, ఇతర రోజుల్లో దుమ్ము, ధూళితో రహదారి పక్కనున్న గ్రామాల ప్రజలతోపాటు ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో గురువారం నిర్వహించిన నీతి ఆయోగ్ ప్రాజెక్టు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన అల్లూరి జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు.
విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో భాగంగా ఆర్కే బీచ్లో బుధవారం సాయంత్రం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్ అబ్బురపరిచాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్కల్యాణ్ కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది.
సాగర తీర నగరమైన విశాఖపట్నంలో పెరుగుతున్న యువతకు భారత నౌకాదళమే స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
పేదల ఇళ్ల నిర్మాణంలో ‘రాక్ట్రీ’ ఏజెన్సీస్ అనేక ఉల్లంఘనలకు పాల్పడినా ఏమీ పట్టనట్టు వ్యవహరించిన ఎనిమిది మంది హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
రోలుగుంట మండలం జానకిరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సీఈవోగా పనిచేసిన బీవీవీవీఎస్ఆర్జీ రామకృష్ణను విధుల నుంచి తొలగిస్తూ సొసైటీ పర్సన్ ఇన్చార్జి ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘానికి చెందిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై వేటు వేశారు.