నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. ప్రముఖ టైర్ల ఉత్పత్తిదారు అయిన ‘సియట్ టైర్స్’ రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 737లో 200 ఎకరాలు అవసరమని దరఖాస్తు చేసుకుంది. దీంతో మంగళవారం ఏపీఐఐసీ అధికారులు, సియట్ టైర్స్ కంపెనీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను, మ్యాపులను పరిశీలించారు.
పశ్చిమాసియాలో ఐదు వారాల నుంచి జరుగుతున్న యుద్ధం ప్రభావం వంట గ్యాస్ సరఫరాపై పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గోబర్ గ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నామమాత్రపు ఖర్చుతో వంట గ్యాస్ ఉత్పత్తి అవుతుండడంతో పశు పెంపకందారులు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయగా.. అటు పిమ్మట వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. తొలుత ఏజెన్సీని ఆనుకొని వున్న మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం మండలాల్లో ఈదురుగాలులతో వర్షం మొదలైంది.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు, అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో పనిచేయడానికి రైల్వే ఉద్యోగులు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ బుధవారం నగరానికి రానున్నారు.
జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఏటా పెరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి మించి పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యలు, టూనాలు ఫిషింగ్ హార్బర్కు చేరుతున్నాయి.
కొలంబో డాక్యార్డ్ పీఎల్సీతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) మంగళవారం కీలక ఒప్పందం చేసుకుంది.
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
మన్యంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది.