విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:57 PM
విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జరిగిన ఓ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ( Rayapati Sailaja) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల వయసున్న పసికందుపై జరిగిన లైంగిక దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు నాగరిక సమాజానికి మచ్చ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రాయపాటి శైలజ విశాఖపట్నం పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు.
ఈ కేసు దర్యాప్తు పురోగతిని, నిందితుల వివరాలను రాయపాటి శైలజ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. చిన్నారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో నిందితులకు చట్టప్రకారం అత్యంత కఠిన శిక్షపడేలా.. మహిళా కమిషన్ పక్షాన పర్యవేక్షిస్తామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News