ఆనందపురం మండలం శొంఠ్యాం సర్వేనంబరు 347లో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి గ్రామానికి చెందిన కొందరు స్కెచ్ వేశారు.
ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
‘‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. రెండు నెలలపాటు మా ఉపాధ్యాయుల బోధనను పరిశీలించండి. చదువు బాగోలేదని అనిపిస్తే.. మీ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించుకోండి’’ అని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత ్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మండలంలోని ఆర్.భీమవరంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష-2026 ప్రశాంతంగా ముగి సింది.
ఇంధన వనరులను ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో (వర్చువల్గా) నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిల్లో మహానాడు సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
భారీ గ్రానైట్ శిలలు తరలించే ట్రాలర్ లారీలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు రహదారులు, వంతెనలకు ముప్పు పొంచివుంది. ముఖ్యంగా బీఎన్ రోడ్డులో శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, వంతెనలు కూలిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన సామర్థ్యంకన్నా రెట్టింపు బరువుతో గ్రానెట్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆర్అండ్బీ, పోలీసు, రవాణా శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.
నగరంలోని రామకృష్ణా బీచ్ శని, ఆదివారాల్లో వారపుసంతను తలపిస్తోంది.
జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో ఒక నాయకుడి వ్యవహారశైలి తీవ్రవివాదాస్పదమవుతోంది.
భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోయారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. క్రమేపీ ఎండ తీవ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు మొదలయ్యాయి. పది గంటల తరువాత పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. అధిక ఎండకుతోడు ఉక్కపోతతో ఇళ్లల్లో ఉన్న వారు సైతం చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో దాదాపు సగం మండలాల్లో వరుసగా ఐదో రోజు కూడా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గం నిప్పుల కొలిమిలా మారింది. నర్సీపట్నంలో రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.