ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అటెండెన్స్ నమోదుకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నగరంలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్కు ఘన స్వాగతం లభించింది.
ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు...
జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కోడూరులో పార్కు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. దాదాపు 70 శాతం ప్లాట్లను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాల్లో భూ సేకరణ దశల్లో వున్నాయి. ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో గత టీడీపీ హయాంలోనే ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసింది.
అచ్యుతాపురం, రాంబిల్లిల మండలాల పరిధిలోని ఫార్మా కంపెనీల నుంచి శుద్ధిచేయని వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో సమీపంలోని ఉప్పరి గెడ్డలో నీరు నల్లగా మారిపోయింది. ఇందులోని చేపలు మృత్యువాతపడ్డాయి. ఫార్మా వ్యర్థాలను గెడ్డలోకి విడుదలచేయడంపై చుట్టుపక్కల గ్రామాల రైతులు, పూడిమడక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో మేజర్ శారదా నది నుంచి ఉప్పరి గెడ్డ విడిపోయి కృష్ణంపాలెం, లాలంకోడూరు, ఎరకన్నపాలెం, చాటమెట్ట, పూడిమడక ఉప్పు గళ్లీల పక్కనుంచి ఉప్పుటేరులో కలుస్తుంది.
మండలంలోని కొత్త కొండెంపూడిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. వెండి పట్టీలు చోరీ చేసినట్టు అభియోగం మోపడంతో మనస్తాపం చెందిన బాలుడు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కొండెంపూడికి చెందిన తలారి మంగపతి, భవానీ దంపతుల రెండో కుమారుడు కృష్ణ (15) వడ్డాదిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ, వచ్చే నెలలో జరిగే పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తకొండెంపూడికి చెందిన దొండా సాయి, మణి దంపతుల ఇంటిలో వెండి పట్టీలు పోయాయి.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కల్యాణపులోవ, ధారమఠం, పుణ్యగిరి ప్రాంతాలకు రెండు రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడం ద్వారా రూ.28 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో ప్రవీణ చెప్పారు.
స్థానిక బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు హాస్టల్ కోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం ఎనిమిది నెలలైనా వినియోగంలోకి రాలేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు పాత భవనాల్లో, ఇరుకు వసతితో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.