• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఎల్ నినో కంటే పెద్ద విపత్తు వైఎస్ జగన్ అని ఆయన పేర్కొన్నారు.

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్

విశాఖపట్నంలోని షీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌నూ మల్కాపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

స్తంభించిన జల్‌ జీవన్‌

స్తంభించిన జల్‌ జీవన్‌

ఇంటింటికీ కొళాయి ద్వారా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పనులు జిల్లాలో మందగించాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యం కారణంగా సుమారు నాలుగు నెలల నుంచి పనులు ఆగినట్టు సమాచారం. కొత్తగా చేపట్టాల్సిన పనులపై కాంటాక్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.

నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు స్థానిక నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, వేదపండితులతో స్వాగతం పలికారు.

మెట్ట రైతుకు కష్టకాలం

మెట్ట రైతుకు కష్టకాలం

ఎల్‌నినో ప్రభావం జిల్లాలో వర్షాధార మెట్ట భూముల్లో ఖరీఫ్‌ సాగుపై తీవ్రంగా పడింది. అడపాదడపా జల్లులు, మోస్తరు వర్షం మాత్రమే పడుతుండడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్షాధార భూములను ఇంతవరకు కనీసం దుక్కి కూడా దున్నలేదు. కొన్నిచోట్ల చెదురుమదురుగా కురిసిన వర్షాలతో రైతులు మడులను తయారు చేసుకొని వరి విత్తనాలు చల్లారు. మొలకలు వచ్చిన తరువాత కనీసస్థాయిలో కూడా వర్షం పడకపోవడం, ఎక్కడా నీరు అందుబాటులో లేకపోవడంతో వరి నారు ఎండిపోయింది. నైరుతి సీజన్‌ మొదలై మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు గెడ్డలు, వాగులు, నదుల్లో నీటి ప్రవాహం లేదు. చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. అసలు పొలాల నుంచి వర్షం నీరు బయటకు వెళ్లిన దాఖలాలే లేవు. వరి కాకుండా పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేసే భూములను సైతం ఖాళీగా వదిలేశారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రి రెండు నెలల్లో రెడీ

ఈఎస్‌ఐ ఆస్పత్రి రెండు నెలల్లో రెడీ

పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో రెండు నెలల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది. ఇంతవరకు ఆస్పత్రి ప్రధాన భవనం, సిబ్బంది గృహ సముదాయాల నిర్మాణం పూర్తయ్యింది.

అంతా మా ఇష్టం!

అంతా మా ఇష్టం!

మండలంలోని ధర్మవరం అగ్రహారంలో జాతీయ రహదారిని ఆనుకొని వున్న సినిమా థియేటర్‌ వద్ద ప్రమాదం పొంచివుంది. సినిమా ప్రదర్శన పూర్తయిన పిమ్మట బయటకు వచ్చే ప్రేక్షకులకు, తదుపరి ఆట చూడడానికి థియేటర్‌ వద్దకు వచ్చే ప్రేక్షకులకు ఒకేదారి వుండడంతో జాతీయ రహదారిపై వచ్చేస్తున్నారు.

వందే భారత్‌ భవన్‌

వందే భారత్‌ భవన్‌

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోచ్‌ల నిర్వహణకు విశాఖపట్నంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లోనే ఈ పనులు జరిగేవి.

లారీ డ్రైవర్‌పై దాడి కేసులో  రవాణా అధికారి కారు డ్రైవర్‌ అరెస్టు

లారీ డ్రైవర్‌పై దాడి కేసులో రవాణా అధికారి కారు డ్రైవర్‌ అరెస్టు

మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ సాహూపై దాడి కేసులో విశాఖపట్నం అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పార్వతి కారు డ్రైవర్‌ శ్రీనివాస్‌ను బుధవారం సాయంత్రం మల్కాపురం పోలీసులు అరెస్టు చేశారు.

యాలాలొ యాలాలొ ఎన్నెన్ని అందాలో..

యాలాలొ యాలాలొ ఎన్నెన్ని అందాలో..

సహజసిద్ధ ప్రకృతి అందాలకు నిలయం సీలేరు. ఎత్తైన పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, రిజర్వాయర్లు, జల విద్యుత్‌ కేంద్రాలు.. ఇలా ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం సీలేరులో సినిమా షూటింగ్‌లకు అనువైన ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి