ఆనందపురం మండలం తర్లువాడలో ఈనెల 28వ తేదీన జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు భారీఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతున్నారు.
విలువలతో కూడిన విద్యార్థులను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పర్యాటకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కారవాన్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వాటి కోసం ముందుగా కారవాన్ పార్కులు నిర్మించి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఆ పార్కుల కోసం బుధవారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. వాటికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, వారికి పనులు అప్పగించి, అవి పూర్తయిన తరువాత తాపీగా కారవాన్లు విశాఖపట్నం వస్తాయి. అంతవరకు వేచి ఉండక తప్పదు.
జిల్లా బీసీ సంక్షేమ శాఖలో ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయు లకు ప్రయోజనం చేకూర్చేందుకు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాల విభజన జరిగి సుమారు నాలుగేళ్లు కావస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో యంత్రాంగం ఉంది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సదరు అధికారి నియామకాలు, పదోన్నతులు చేపడుతూ ఆయా జిల్లాల్లోని ఉన్నతాధికారు లకు తెలియపరచకపోవడం గమనార్హం. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగోతంది. వివరాల్లోకి వెళితే...
కొలతల్లో తేడాలతో పాటు శ్రామికుల మస్తర్లు దిద్దుబాట్లు చేసి అవినీతికి పాల్పడినట్టు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది.
ఏజెన్సీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు అల్లాడుతున్నారు.
మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే సరైన సమయమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు.
ఏజెన్సీలో కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల అవినీతి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ శానిటేషన్ బిల్లుకు పాస్ ఆర్డర్ వేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడంతో పంచాయతీ కార్యదర్శుల అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
మండలంలోని బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి కండ్రేగుల లక్ష్మీనారాయణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.