Home » Andhra Pradesh » Visakhapatnam
మద్యం విక్రయాల్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘జగనన్న విద్యాదీవెన’ డబ్బులు కొంతమందికే జమ అవుతుండడంతో మిగిలిన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రధానంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింస, అవాంఛనీయ ఘటనల ప్రభావం ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగనున్న మోదకొండమ్మ ఉత్సవాలపై పడింది. దీంతో ఉత్సవాలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోని తాజా ఘటనల నేపథ్యం, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున మోదకొండమ్మ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేమని కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా తేల్చి చెప్పారు.
మన బడి నాడు- నేడు పథకంలోని రెండవ విడత పనుల్లో జాప్యం చేస్తున్నారనే నెపంతో 227 మంది హెచ్ఎంలకు డీఈవో వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేయడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయి ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం సముద్ర తీరాలు ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందడంతో ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఐదు టూరిజం రిసార్టులను ఆధునికీకరిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రమణ తెలిపారు. అరకులోయలోని మయూరి హిల్ రిసార్టులో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
మండలంలోని కొమరవోలు గ్రామంలో జరిగిన కొమరవోలు తల్లి జాతర మహోత్సవాన్ని గురువారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ వేడుక నిర్వహణకు సంబంధించిన అనుమతి కోసం ఉత్సవ కమిటీ ముందుగా పోలీసు శాఖకు చాలానా తీసింది. అనంతరం భారీ ఏర్పాట్లు చేపట్టింది.
మండలంలోని ఎ.అగ్రహారం- బైలపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంత్రి పేరు చెప్పి అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు పంట కోల్పోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కినా ఇప్పటికీ పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. పంట నష్టపరిహారం ఎప్పుడు అందుతుందా? అని రైతులు ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
మండలంలోని బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని సికిల్సెల్ ఎనీమియాతో కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక(18) పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీఎస్సీ చదువుతోంది.