కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాసోహమంటోం దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు.
కూరగాయల పంటల సాగుపై రైతాంగం ఆసక్తి కనబరుస్తున్నది. తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ కష్టపడితే కూరగాయల సాగు సిరులు కురిపిస్తోందని రైతులు చెబుతున్నారు.
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 6న దక్షిణాఫ్రికాతో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సీప్లేన్ నడపడానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాహనచోదకుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో కొందరు పోలీసుల అలసత్వం, కొన్నిచోట్ల సిగ్నల్స్ పనిచేయకపోవడం...ఇందుకు ప్రధాన కారణాలు.
మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో 246 మంది రైతులకు సంబంధించి 186.14 ఎకరాల జిరాయితీ భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించామని, ఆయా రైతులకు త్వరలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పుస్తకాలు జారీ చేస్తారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అల్యూమినియం కంపెనీ కోసం 2012లో ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించిన రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు.
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి గురువారం విశాఖపట్నం వస్తున్నారు.
జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఆర్ఏఆర్ఎస్లో జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1 నుంచి 28.5 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.3 నుంచి 22.2 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం వుందన్నారు. ఈ సందర్భంగా రబీలో సాగుచేసే వరి, అపరాలు, మొక్కజొన్న, రాగి, కూరగాయ పంటల గురించి ఆయన పలు వివరాలను వెల్లడించారు.
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లలో వాటర్ కండక్టర్ సిస్టం ఏర్పాటు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో రెండు ఎన్కౌంటర్ల ప్రభావం ఇంకా సద్దుమణగ లేదు.