జీవీఎంసీ గతనెలలో నిర్వహించిన వేసవిక్రీడా శిబిరా ల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందించాల్సిన టీషర్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రుషికొండ ఐటీ హిల్ నంబరు -2లో ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ కార్యాలయం 300 మంది ఉద్యోగులతో గురువారం ప్రారంభమయింది.
విశాఖపట్నం/ గోపాలపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయాన్ని భవిష్యత్తులో రీజనల్ ఏవియేషన్, నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్ (ఎంఆర్ఓ), కార్గో కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
తల్లిదండ్రులకు దూరంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మెస్ (డైట్) చార్జీలను పది శాతం పెంచాలని బుధవారం అమరావతిలో జరిగిన సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, అల్పాహారం అందే అవకాశం వుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
మండలంలో భారీ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్ బ్యాంకు భూములకు వంద అడుగుల రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపయ్యపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ‘ల్యాండ్ బ్యాంకు’ కింద గుర్తించారు.
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిగుడ జలపాతం వద్ద నిర్వహణ లోపం పర్యాటకులకు శాపంగా మారింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరుత్సాహానికి గురవుతున్నారు.
గిరిజన ప్రాంతంలో విరివిగా లభించే నయాపైసా మొక్క పచ్చిరొట్ట తరహాలో పంటలకు ఎన్నో పోషకాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అధ్యయనంలో రుజువైంది.
ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (సర్)ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలు పూరించిన ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ వేగవంతంగా జరగాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తీగలవలస సచివాలయ పరిధిలోని కామయ్యపేట గెడ్డ నుంచి కొందరు వ్యాపారులు రేయింబవళ్లు అక్రమంగా ఇసుక తవ్వి తరలించేస్తున్నారు.
ఏజెన్సీలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.