వాతావరణంలో మార్పులతో మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఏజెన్సీలో శనివారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. తె
మన్యంలో ప్రస్తుతం రాగులు(చోడి) పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వరి పంటకు ముందుగానే గిరిజనులు రాగులను కోస్తారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎటు చూసినా రాగుల కోతలు చేపడుతున్న గిరి మహిళలే కనిపిస్తున్నారు.
ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్ నిర్వహిస్తున్న స్థానిక ఎకో పల్పింగ్ యూనిట్లో కాఫీ పండ్ల పల్పింగ్ను జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఫరీణ్ శనివారం ప్రారంభించారు.
మారేడుమిల్లిలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ఈ నెల 23న నిరసన దినం పాటించాలని మావోయిస్టులు ప్రకటించడంతో జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.
డివిజన్ నీటి తీరువా బకాయిలు కొండలా పేరుకుపోయాయి. రైతుల నుంచి నీటి తీరువా ద్వారా వసూలు చేసిన నిధులు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధికి, మరమ్మతులకు ఉపయోగిస్తారు. అయితే 2007 నుంచి నీటి పన్ను వసూళ్లలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రూ.17 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి పన్ను బకాయిలు భారీగా పెరిగాయి.
రాష్ట్రంలో రెండో విడత జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రీ సర్వే డిప్యూటీ డైరెక్టర్(అమరావతి) కె.రమణమూర్తి ఆదేశించారు. మండలంలోని ఆరిపాక గ్రామంలో శనివారం జరిగిన రీ సర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అదపురెడ్డి పైడింనాయుడు అనే రైతుకు సంబంధించిన సర్వే కొలతలను మరోసారి ఆయన తీయించారు.
నక్కపల్లి, కోటవురట్ల మండలాల్లో ఎక్కడైనా 8 ఎకరాల స్థలం ఉంటే వెంటనే హాకీ అకాడమీని మంజూరు చేయిస్తానని, ఇప్పటికే శాప్ చైర్మన్, క్రీడా మంత్రితో మాట్లాడానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లి బీఎస్ హాకీ క్లబ్ మైదానంలో రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ -19 హాకీ పోటీలకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందన్నారు.
పట్టణంలో శుక్రవారం సాయంత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దూకుడుగా కారు నడిపి అలజడి సృష్టించిన రాజస్థాన్కు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి శనివారం తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా బీఎన్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆర్అండ్బీ ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ సాంబశివరావులు శనివారం జిల్లా కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. బీఎన్ రహదారి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, తదితరులు జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్అండ్బీ చీఫ్ సెక్రటరీ తరఫున విచారణకు హాజరైన ఆర్అండ్బీ ఉన్నతాధికారులు ఈ మేరకు జిల్లా జడ్జికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.