ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి మంగళవారం ఉత్తరద్వారంలో వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు ఆరోపించారు.
గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వాస్తవానికి సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29న నామినేషన్ల స్వీకరణ, 30న నామినేషన్ల ఉపసంహరణ, జనవరి 4న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
సొవ్వా పంచాయతీ మారుమూల సాగరివలస గ్రామానికి దశాబ్దాల నాటి కల నెరవేరింది. ఎట్టకేలకు రహదారి నిర్మాణం జరుగుతోంది. దీని వలన 13 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో: 517 జారీ చేసింది.
వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు సైతం దట్టంగా కమ్మేస్తున్నది.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న డీజిల్ ఏజెన్సీలోని అంబులెన్స్లకు 15 రోజులకే సరిపోతుందని, మిగిలిన 15 రోజుల పరిస్థితి ఏమిటని అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని ప్రశ్నించారు.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలు ఆంక్షలు విధించినట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.
జిల్లాలో ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖరారైంది.
మునిసిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దులు ద్వారా రూ.34,34,43,000 ఆదాయం వస్తుందని, రూ.42,30,40,500 ఖర్చు అవుతుందని అంచనా వేశామని కమిషనర్ జంపా సరేంద్ర తెలిపారు.