గాలి నాణ్యత క్షీణతలో విశాఖ నగరం దేశ రాజధాని ఢిల్లీ కంటే దారుణమైన స్థితిలో ఉంది.
పర్యాటకులతో గురువారం నగరం పోటెత్తింది.
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ బూమ్ మళ్లీ మొదలైంది.
స్టీల్ ప్లాంటు మరోసారి వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను బుధవారం ప్రకటించింది. ప్లాంటులో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, సమర్థ వినియోగం, వ్యయాలను నియంత్రించి ఉత్పత్తి పెంచుకోవాలనే ఆలోచనతో వీఆర్ఎస్ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు 1,146 మంది సంస్థ ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడు, నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు (55) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ది సంస్థ (వీఎంఆర్డీఏ)...వాటిని అమలు చేసే విషయంలో వెనుకబడుతోంది.
నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనేక చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 21 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.54 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈఓ ఎన్.సుజాత పర్యవేక్షణలో సిబ్బంది బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.
భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి బుధవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఆహ్వానం పలికారు. క్రికెటర్ గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలుచేశారు.
విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక వర్గానికి తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో కలిపి 41 మందికి కమిటీలో చోటు కల్పించింది.