హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులోని బూర్జ పంచాయతీ దండేసిగుడ (మల్లుంగుమ్మి) జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందడంతో వారి స్వగ్రామం జంబువలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జాతీయ రహదారి 516-ఈ నుంచి చింతపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకుండా పనులు చేపడుతున్నారు.
పన్నులు, పన్నుయేతర వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కె.పూర్ణచంద్రశేఖర్ తెలిపారు.
అరుదైన విదేశీ కూరగాయల పంట జుక్కినీకి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.70 ధర పలుకుతోంది.
ప్రస్తుతం మన్యంలో ఇటుకల పండుగ సందడి నెలకొంది. ఏజెన్సీలో ప్రతి ఏడాది చైౖత్ర మాసంలో గిరిజనులు ఇటుకల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సచివాలయ ఏఎన్ఎంపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హెల్త్ సూపర్వైజర్పై పోలీసు కేసు నమోదైనప్పటికీ వైద్య ఆరోగ్యశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఖండించడానికి తాను మీడియా ముందుకు రాలేదన్నారు.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు యువతులు అందులో పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందారు.
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు లేక వెలవెలబోయింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్’లో వ్యాఖ్యలను వెనక్కితీసుకోవడంతోపాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ప్రధాన కార్యాలయాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం నేతలను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మశీ విభాగంలో ఇంటర్నషిప్ చేస్తున్న సాల్మాజ్ మొహ్మది, జీనాబ్ మొహ్మది అనే ఇద్దరు ఇరాన్ మహిళలు తమ సొంత దేశం వెళ్లేందుకు సహాయపడాలని జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు.