Home » Andhra Pradesh » Visakhapatnam
అరకులోయలో అభివృద్ధి నిలిచిపోయింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పర్యాటక ప్రాజెక్టులు పడకేశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి.
జిల్లాలో ఆదివారం 1,222 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి. కలెక్టర్ ఎం.విజయసునీత పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారులు భావనా వశిష్ఠ, వి.అభిషేక్, ప్రశాంత్కుమార్లు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
జిల్లాలోని తాళ్లపాలెంలో జాతీయ రహదారికి సమీపంలో గల లేఅవుట్లో సోమవారం నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ఈ ఎన్నికల ప్రచార సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు జలాశయం దిగువ ప్రాంతంలో నాటు పడవ బోల్తా పడి ఒడిశాకు చెందిన గిరిజనుడు మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరగగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో శనివారం బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని కూటమి శ్రేణులు ఖండించాయి. ఆదివారం పలు చోట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
పాడేరు- విశాఖ ఘాట్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం తుంపాడ పంచాయతీ గడ్డంపుట్టు గ్రామానికి చెందిన ముడువ సింహాచలం(29), నీలయ్యదొర వెంకటతేజ(19), పాంగి జీవన్కుమార్(18)లు పాడేరు ఘాట్ మార్గంలోని కాఫీ తోటల పరిసర ప్రాంతాల్లో వంట చెరకు తెచ్చుకొనేందుకు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.
డిప్యూటీ సీఎం, వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన మండలంలోని తారువలో శనివారం వైసీపీ నాయకులు చెలరేగిపోయారు.
ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని వైసీపీ విశ్వప్రయత్నం చేస్తోంది.
కార్పొరేషన్గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు దక్కుతాయని సంబరపడిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు నిరాశే ఎదురైంది.