స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు రావడంతో ప్రారంభోత్సవానికి దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సుముహూర్తం నిర్ణయించారు. మార్చి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పాలకవర్గం చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఆలయంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు ముందుకు సాగడం లేదు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంలేదు. ఇందుకు సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు భావించి, ఇంటి పన్ను వసూళ్లలో బాగా వెనుకబడిన 274 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీపీపీ విధానంలో డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్గా మార్చి, వచ్చే సీజన్ నుంచి చెరకు క్రషింగ్ను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం శాసనసభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరస్థులు సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇంటి నుంచే ఉద్యోగం చేసి, వేలాది రూపాయలుసంపాదించ వచ్చు అంటూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వల విసురుతున్నారు. నిజమేనని నమ్మిన పలువురు తమ వివరాలను సైబర్ నేరగాళ్లకు (మోసగాళ్లని తెలియక) అందించి, ఆనక నిండా మోసపోతున్నారు.
మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) బ్లూ జెట్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ ఔషధ తయారీ కంపెనీ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో భూమి చదును పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ సముద్ర కోతకు గురవుతున్న 30కి పైగా ప్రాంతాలను సంరక్షించేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నడుం కట్టింది.
కుటుంబ వివరాల సేకరణ కోసం చేపడుతున్న ఏకీకృత (యూనిఫైడ్) సర్వే పక్కాగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాలు ఇచ్చారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆనందపురం మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాకు తెగబడ్డారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.