విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పేరుతో విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు.
విశాఖ పోర్టునుంచి కార్యకలాపాలు నిర్వహించే వేదాంత కంపెనీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తోందని వన్టౌన్ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఏడో ప్యాకేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో గోదావరి జలాలను ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కాలువలో మిగిలిన పనుల్లో వేగం పెంచారు. ఎలమంచిలి మండలం ఏటికొప్పాక వద్ద నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఆయా ప్రదేశాల్లో పనులు చేస్తున్నారు.
రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహించే సర్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని భారత ఎన్నిక సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పేర్కొన్నారు.
జిల్లాలో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సబ్బవరం, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, తదితర మండలాల్లో చెరువులు, ప్రభుత్వ భూములతోపాటు పరిశ్రమల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మట్టి, గ్రావెల్ను యథేచ్ఛగా తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు.
జీవీఎంసీ గతనెలలో నిర్వహించిన వేసవిక్రీడా శిబిరా ల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందించాల్సిన టీషర్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రుషికొండ ఐటీ హిల్ నంబరు -2లో ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ కార్యాలయం 300 మంది ఉద్యోగులతో గురువారం ప్రారంభమయింది.
విశాఖపట్నం/ గోపాలపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయాన్ని భవిష్యత్తులో రీజనల్ ఏవియేషన్, నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్ (ఎంఆర్ఓ), కార్గో కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
తల్లిదండ్రులకు దూరంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మెస్ (డైట్) చార్జీలను పది శాతం పెంచాలని బుధవారం అమరావతిలో జరిగిన సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, అల్పాహారం అందే అవకాశం వుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
మండలంలో భారీ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్ బ్యాంకు భూములకు వంద అడుగుల రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపయ్యపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ‘ల్యాండ్ బ్యాంకు’ కింద గుర్తించారు.