రాజకీయాలకు అతీతంగా గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో తీవ్ర అన్యాయానికి గురైంది. దీంతో రాజ్యాంగం పరంగా గిరిజనులకున్న సంక్షేమ పథకాలను రద్దు చేయడంతోపాటు పల్లెల్లో మౌలిక సదుపాయాలు సైతం కల్పించని దుస్థితి కొనసాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది.
పెదబయలు జీసీసీ గ్యాస్ గోడౌన్లో సిలిండర్ల దందా గుట్టురట్టు అయ్యింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్ల తరలింపునకు యత్నించడంతో స్థానికులు పట్టుకొని డిప్యూటీ తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన స్పందించి ఆర్ఐ, వీఆర్వో గ్యాస్ గోడౌన్కు పంపించారు. వారు సిలిండర్లు, బొలెరో వ్యాన్ను సీజ్ చేశారు.
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డీఈవో పదో తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. ముఖ్యంగా సోషల్ స్టడీస్ సబ్జెక్టులో మ్యాప్ పాయింటింగ్పై విద్యార్థులకు స్వయంగా బోధించారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం(సీజీఆర్ఎఫ్) చైర్మన్, రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు.
ఎల్నినో ప్రభావం ఖరీఫ్ వరి సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో వేసిన వరినారు ముదిరిపోయింది. దీంతో నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం మండలంలోని గన్నెల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్కే నగర్కు వస్తున్నారు. గన్నెల పంచాయతీలో సంజీవిని ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ అమిత్బర్దార్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఉన్నతాధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నేపాల్లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు అదృష్టవశాత్తూ జలప్రళయం నుంచి తప్పించుకున్నారు. వరద బీభత్సానికి ఒక్కరోజు ముందే వాళ్లు భారత్కు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొందరు విద్యార్థులకు అటెండెన్స్ సమస్య కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించడం లేదు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి నగరంలోని ఆర్కే బీచ్రోడ్డులో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె అస్మితానాయుడు వివాహానికి హాజరయ్యారు.