రోడ్డు సౌకర్యం లేక పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్లో వెళ్లి ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవ విగ్రహం, ఉత్సవాల అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి తల్లిగరగను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
అంతర్ రాష్ట్ర పాలగెడ్డ-ఆర్వీనగర్ రహదారి నిర్మాణాలు ఊపందుకున్నాయి.
గిరిజన ప్రాంతంలో పతో తరగతి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వివిధ పాఠ్యాంశాల్లో స్వల్ప మార్కుల తేడాతో పరీక్షలు తప్పిన విద్యార్థులందరూ పాస్ అయ్యేలా ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లోనూ బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల శిబిరాల్లో బోధన, విద్యార్థుల హాజరును ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ సమీక్షిస్తున్నారు. ఈనెల 4న ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ఈనెల 24తో ముగియనున్నాయి.
అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది.
మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.
స్టీల్ప్లాంటును మూడు నెలల్లో పట్టాలపైకి తీసుకువచ్చి సక్రమంగా, నిబంధనల ప్రకారం నడపాలని అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీలను నూతన సీఎండీ ప్రభాకర్ ఆదేశించారు.
ఒకప్పుడు వేసవి విడిది కేంద్రంగా పేరొందిన విశాఖపట్నం రానురాను వేడెక్కుతోంది.
జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తృతంగా అందుతున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే పురోగతి గణనీయంగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన ప్రతీ కేసును ఈ పథకంలో చేయడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సమకూర్చుతున్నారు.