కేజీహెచ్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి.
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగులేటి నారాయణ తీరు జిల్లా ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు.
కూరగాయలు పండించి, అమ్మగా వచ్చిన డబ్బులు కుమార్తెలకు ఇస్తోందనే అపోహతో అత్తపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా, ఆమెను పొలంలో ఈడ్చుకుపోయిన కోడలి ఉదంతమిది.
జిల్లాలోని పలు మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యాశాఖాధికారులు ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా చాలా పాఠశాలలు మూతబడే ఉన్నాయి.
ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపునకు పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో జల్ సంచయ్- జన్ భగీదారి(జేఎస్జేబీ) 2.0లో చేపడుతున్న పనులు అద్భుతంగా ఉన్నాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు.
165 కిలోల గంజాయి స్వాధీనం
స్థానిక ఘాట్రోడ్డులో చాపరాయిని ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో సీతాకోకచిలుక ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ నిర్మించిన ఉడెన్ కాటేజీలను బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించనున్నారు. ఘాట్రోడ్డులో అనంతగిరి- బీసుపురం మధ్య మెయిన్ రోడ్డు పక్కన సుమారు రూ.5.5 కోట్లతో ఈ కాటేజీలను నిర్మించారు. ప్రకృతి అందాల నడుమ నిర్మించిన ఈ కాటేజీలు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.
జిల్లాలో వివిధ పథకాల్లో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, బర్త్ వెయిటింగ్ హాళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
సుమారు రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తెరమరుగైంది. దీనిస్థానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్జీ)ను తీసుకొచ్చింది. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.