వైద్య రంగాన్ని అవినీతి జబ్బు పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రులకు సైతం సోకింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కొన్ని కీలక విభాగాల్లో లీక్ వీరులు రెచ్చిపోతున్నారు.
గత ఏడాది సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా మత్స్యకారులకు అందించాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బహిరంగ మార్కెట్లో అమ్మేశారు.
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలను నిఘా నేత్రాలు పట్టేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నవారిని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు గుర్తిస్తున్నాయి. నంబరు ప్లేట్ ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి.
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత, వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
చోడవరం, మాడుగుల నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాంబిల్లి నుంచి అనకాపల్లి, చోడవరం, మాడుగుల ప్రాంతాలను కలుపుతూ భోగాపురం వరకూ సెమీ రింగు రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో ఈ రెండు నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది.
స్థానిక తాండవ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గంగవరం సర్వే నంబరు 58లో గల జగనన్న కాలనీ(ప్రస్తుతం ఎన్టీఆర్ కాలనీ)లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.
మన్యంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండ ప్రతాపానికి విలవిలలాడుతున్నారు.
అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు (గిరిజన ఉత్సవం) విజయవంతమవుతున్నాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.