స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూడా కూటమి కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
విశాఖపట్నంలోని షీలా నగర్లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్బాడీస్ లభించాయి.
జూనియర్ డాక్టర్ల సమ్మెతో సోమవారం ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. గడిచిన ఏడు రోజులుగా విధులను బహిష్కరించిన జూడాలు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలకూ కూడా దూరంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఎన్నికల సందడి మొదలైంది.
నగరంలో మంగళవారం జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు తొలిరోజు ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు.
మండలంలోని మాదల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.