• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

ఎడాపెడా అక్రమ నిర్మాణాలు

ఎడాపెడా అక్రమ నిర్మాణాలు

భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సెల్ఫ్‌ డిక్లరేషన్‌ (సర్టిఫికేషన్‌) బిల్డింగ్‌ పర్మిషన్‌ విధానం’ దుర్వినియోగం అవుతోంది. ఇది కొంతమంది లైసెన్డ్స్‌ టెక్నికల్‌ పర్సన్లు/సర్వేయర్‌ (ఎల్‌టీపీ)లకు వరంగా మారింది. లేఅవుట్‌లో స్థలాలు ఉన్నట్టు చూపించి కొందరు వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములతోపాటు భవిష్యత్తులో రోడ్ల విస్తరణకు విడిచిపెట్టాల్సిన చోట్ల అడ్డగోలుగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి ఎల్‌టీపీల వద్దనే ప్లాన్‌ జారీ అయిపోతుండడంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో నగరంలో అక్రమ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈఏపీసెట్‌లో  సత్తాచాటారు

ఈఏపీసెట్‌లో సత్తాచాటారు

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌-2026లో జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పరీక్షకు జిల్లా నుంచి 23,954 మంది హాజరు కాగా, 17,308 మంది (72.25 శాతం) అర్హత సాధించారు.

తొలి రోజు 90.16 శాతం పింఛన్ల పంపిణీ

తొలి రోజు 90.16 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం 90.16 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు.

ఎకో పార్కు ప్రారంభం

ఎకో పార్కు ప్రారంభం

మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఎకో పార్కును బుధవారం వర్చువల్‌ విధానంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు.

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యం

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యం

అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు.

34 మంది బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు

34 మంది బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు

జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని 34 మంది బూత్‌ స్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ బుధవారం తెలిపారు.

గిరిజన రైతుల సంక్షేమానికి కృషి

గిరిజన రైతుల సంక్షేమానికి కృషి

వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గిరిజన రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రైతుల పీజీఆర్‌ఎస్‌లో ఆమె మాట్లాడారు.

మన్యంలో కాఫీ ఘుమఘుమలు

మన్యంలో కాఫీ ఘుమఘుమలు

మన్యంలో ఈ ఏడాది నుంచి మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చెందనున్నాయి. ఏజెన్సీలో రూ.526 కోట్ల వ్యయంతో 2015 నుంచి పదేళ్ల కాల పరిమితితో అమలైన గత కాఫీ ప్రాజెక్టు 2024- 25 ఆర్థిక సంవత్సరంతో ముగిసింది.

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత

అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. పాయకరావుపేట పట్టణంలోని పాత పెద్దిరెడ్డి వారి వీధిలో పెన్షన్లను పంపిణీ చేశారు.

వైసీపీ వాసనలు పోని సచివాలయాలు

వైసీపీ వాసనలు పోని సచివాలయాలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా, వార్డు సచివాలయాల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, తమకు జగన్‌మోహన్‌రెడ్డే నాయకుడు అన్నట్టు పలువురు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆరోపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి