హార్బర్ సబ్ డివిజన్ ఏసీపీగా సీహెచ్ వివేకానందను నియమిస్తూ డీపీజీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఉక్కు కర్మాగారంలో వారం రోజుల నుంచి హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గిపోతోంది.
జిల్లాలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలు, పారిశ్రామిక అనుమతులు, ఏర్పాటు చేసిన యూనిట్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, తదితర అంశాలపై సమీక్షించారు.
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలోని ఓపీ విభాగం కౌంటర్ను కొత్త భవనంలోకి మార్చనున్నారు. డాక్టర్లు ఇప్పుడు ఎక్కడైతే వైద్యం చేస్తున్నారో అక్కడే కొనసాగుతారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న ఓపీ చీటీల జారీ కౌంటర్ ఆస్పత్రిలోకి ప్రవేశించే ప్రధాన మార్గం దగ్గర ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రావికమతం మండలం కల్యాణపులోవ, గొలుగొండ మండలం ధారమఠం, విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పుణ్యగిరి శైవక్షేత్రాలకు జిల్లా నుంచి 95 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డీపీటీవో ప్రవీణ చెప్పారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది శివరాత్రికి 75 ప్రత్యేక బస్సులు నడిపామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత మహిళా ప్రయాణికుఉలు పెరగడంతో ఈ ఏడాది మరో 20 బస్సులను అదనంగా నడుపుతున్నామని తెలిపారు.
కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి విస్సన్నపేటలో సాగిన భూ దోపిడీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ నత్తనడకన సాగుతోందా?.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏడాదిన్నర దాటినా విచారణ పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు అనుమతులు లేని లేఅవుట్లో రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన అసకపల్లి-లంకెలపాలెం రోడ్డుకు కూటమి పాలనలో మహర్దశ పట్టింది. సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
మండలంలోని గూడెంకొత్తవీధి పంచాయతీ వీరవరం గ్రామంలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా అక్రమ కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ అమిత్బర్ధార్ గురువారం విలేకరులకు తెలిపారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. పాఠశాల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.