జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రణాళికతో వ్యవహరించడం లేదని, జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజల దాహార్తి ని ఎప్పుడు తీరుస్తారంటూ పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు.
రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
వాల్తేరు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.10,422.56 కోట్ల ఆదాయం సాఽధించి జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరించారు. 851 మిలియన్ టన్నుల సరుకును లోడింగ్ చేసి ఐదో స్థానంలో నిలిచిందన్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల వేగం నిర్దేశించిన పరిమితి దాటితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్కుమార్ అన్నారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వాహనాలను అపరిమిత వేగంతో నడపడం వల్లనే రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు.
యుద్ధం కారణంగా వంటకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత కొనసాగుతూనే ఉంది. ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ బుక్ చేస్తే పదిహేను రోజులు దాటితే గానీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలకు సిలిండర్ల అవసరం లేకుండా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని ‘పైప్డ్ నేచురల్ గ్యాస్’ (పీఎన్జీ)గా వ్యవహరిస్తారు.
జిల్లాలోని ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందుతున్నాయని కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు తెలిపారు. ఆస్పత్రులు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అందుతున్న సేవల వివరాలను ఆయన బుధవారం విలేకరులకు వెల్లడించారు.
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ వారం కిందట ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజనను గురువారం నుంచి ప్రారంభించాలని, వచ్చే నెల ఐదో తేదీ నాటికి సరిహద్దులతో గెజిట్ జారీచేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీకి ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తానని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. రాష్ట్రాభివృద్ధికి టార్చ్ బేరర్లా విశాఖ సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యేలా కృషిచేస్తానన్నారు. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు, డేటా సెంటర్లు, పర్యాటకం వంటి రంగాల్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు.
వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఆయన బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పుణ్యస్థలిలో పనిచేయడం ప్రతి అధికారికి సువర్ణ అవకాశం, అదృష్టమన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు.