• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు

గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలో నోటిఫికేషన్‌ జారీచేసినా సరే షెడ్యూల్‌ ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. వార్డుల పునర్విభజనపై ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. 120 వార్డులా?, గతంలో మాదిరిగా 98 వార్డులా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు విధాలుగా ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

అభివృద్ధి పనుల్లో  నాణ్యత లోపిస్తే చర్యలు

అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

జీవీఎంసీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ హెచ్చరించారు. అభివృద్ధి పనులు, కొత్తగా ప్రతిపాదించిన పనులపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జీవీఎంసీ కమిషనర్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో చేపడుతున్న పనులు, ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా కార్యాచరణ తయారుచేసుకుని అమలుచేయాలని సూచించారు.

బలిమెల నీటి పంపకాలపై సమీక్ష

బలిమెల నీటి పంపకాలపై సమీక్ష

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం జీకే వీధి మండలం సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు.

మన్యానికి పచ్చలహారం

మన్యానికి పచ్చలహారం

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్‌ బాల్స్‌)ను వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

చింతాలమ్మ ఘాట్‌ నాలుగవ మలుపు వద్ద బుధవారం ఉదయం లారీ అదుపుతప్పి కొండను ఢీకొనడంతో డ్రైవర్‌ మృతి చెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

వాన జాడ లేక రైతన్న దిగాలు

వాన జాడ లేక రైతన్న దిగాలు

ఎల్‌నినో ప్రభావం మండలంపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో వరి సాగు విస్తీర్ణం మూడొంతులు పడిపోయింది. వరి నాట్లు వేసే సమయం ముగుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం

పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం

పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక డివిజనల్‌ అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఎస్‌ఆర్‌- హరిత, పంచవటి కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.

29న సీఎం అరకు పర్యటన?

29న సీఎం అరకు పర్యటన?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న అరకులోయలో పర్యటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తున్నది.

జడ్పీ ఎన్నికలకు కసరత్తు

జడ్పీ ఎన్నికలకు కసరత్తు

స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి