ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగస్వామ్యులైన బూత్ స్థాయి అధికారులకు ఇతర పనులు అప్పగించవద్దని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అధికారులను శుక్రవారం ఆదేశించారు.
ఆంధ్రా ఊటీగా పేరుగాంచి పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయ ప్రాంతం అడ్వెంచర్ టూరిజంలోనూ అభివృద్ధి చెందనుంది. ఈ ఏడాది అరకు ఉత్సవ్లో భాగంగా డిసెంబరు నెలలో ‘అరకు వ్యాలీ అల్ర్టా ట్రయిల్ రన్- 2027’ పేరిట వంద కిలోమీటర్ల మారఽథన్ను నిర్వహించాలని శాప్ నిర్ణయించింది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, టూరిజం, అటవీ శాఖ, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
మండలంలో బూదరాళ్ల ప్రాథమిక పాఠశాలకు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళం వేశారు. వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదు. ఈ విషయాన్ని గ్రామస్థులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు శుక్రవారం ఆందోళనకు దిగారు.
చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి సిందేరి అనిల్ (17) వసతిగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సీఐ బి.సింహాచలం అందించిన వివరాలిలా ఉన్నాయి.
స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ వీరుడు అల్లురి సీతారామరాజుకు ప్రత్యేక స్థానముంది. సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి రెండేళ్ల రంప తిరుగుబాటుతో ఆంగ్ల పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. 27 ఏళ్ల వయసులోనే వారి అకృత్యాలు, దురాగతాలను ఎదురించి, నిరక్షరాస్యులైన ఆదివాసీలను స్వాతంత్ర్యోద్యమం దిశ గా నడిపించాడు. అల్లూరి పోరాటంతో బ్రిటిష్ ప్రభుత్వంలో వణికిపోయింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 97.45 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.
అది ప్రభుత్వ భూమి. నగర నడిబొడ్డున మురళీనగర్ సమీపంలో బర్మా క్యాంప్నకు ఎగువన కొండకు ఆనుకుని ఉంది.
జీవీఎంసీకి చెందిన పార్కును ఒక కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి చేసింది.
నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్ సమీపాన గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీ కాల్వలోకి బోల్తాపడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారుల తీరు మారడం లేదు.