భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి భూముల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది.
భారత అంధుల మహిళా జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణకుమారికి కిషోర్ గ్రానైట్స్ అధినేత గొట్టిపాటి హర్ష రూ.5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విజయశ్రీ బ్లడ్ సెంటర్పై ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు.
నరసింహనగర్లో గల ‘ముంతాజ్’ హోటల్లో ఈ ఏడాది జూన్ నెలలో ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కుళ్లిపోయిన కోడిగుడ్లు, దుర్వాసన వెదజల్లుతున్న చికెన్, చేప, రొయ వంటకాలను గుర్తించారు.
జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాకు మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు.
జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా స్వరూపం మారనుంది. ర ంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలతోపాటు పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలను కలుపుతూ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.
గిరిజన ప్రాంతంలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) ఎం.తులసి తెలిపారు.
మన్యంలో దాల్చినచెక్క సాగును ప్రారంభించేందుకు స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు.
కోట్లాది రూపాయల విలువైన స్టీల్ప్లాంటు స్థలాన్ని కొందరు కబ్జా చేసి, అర్ధరాత్రి సమయంలో పునాదులు నిర్మించడమే కాకుండా ఓ కాలనీ పేరుతో బోర్డును కూడా ఏర్పాటు చేసేశారు.