విశాఖపట్నం జిల్లాలో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ ఏర్పాటుకానుంది.
విశాఖ మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నట్టు డీజీపీ హరీష్కుమార్గుప్తా పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సోమవారం అర్ధరాత్రి ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
జీవీఎంసీ ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల్లో కాంట్రాక్టర్ల సంఘం నేత ఒకరు చక్రం తిప్పుతున్నారు.
మండలంలోని ఈదటం, పాయకరావుపేట ఇందిరా కాలనీ, పాల్మన్పేట, కొర్లయ్యపేట, తదితర గ్రామాల్లో ఆరు అంగన్వాడీ కేంద్రాల భవనాలు సుమారు దశాబ్ద కాలం నుంచి అసంపూర్తిగా వుండిపోయాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరుకునేలా వున్నాయి. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి.
కొన్నేళ్లుగా సిజేరియన్ ప్రసవాలు పెరుగుతూ వస్తున్నాయి.
మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పింఛన్ సొమ్ము కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని వెలపాలెం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి పెదబయలు ఎస్ఐ వెంకటేశ్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీకరి పంచాయతీ వెలపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చేపల వేట నిషేధకాలంలో భృతి కింద జిల్లాలో 13,597 మంది మత్స్యకారుల ఖాతాలకు రూ.27.19 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తెలిపారు.
మూడు దశాబ్దాల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జీసీసీ బ్రాంచి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్ పెచ్చులు ఊడి, గోడలు బీటలు బారి, వర్షాలకు శ్లాబ్ లీకవుతూ ఏ క్షణాన కూలుతుందో తెలియని దుస్థితిలో ఉంది. ఈ భవనంలోనే గత దశాబ్ద కాలంగా భయాందోళనతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
జనగణన- 2027లో జిల్లా ముందంజలో ఉంది. సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ మంగళవారం రాష్ట్రంలోని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సెన్సస్కు సంబంధించిన ప్రక్రియను జిల్లా యంత్రాంగం 95 శాతం పూర్తి చేసిందని, దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన కలెక్టర్ నిషాంతి, జేసీ శ్రీపూజ, డీఆర్వో లోకేశ్వరరావు, యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.