• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

మార్కెట్లకు శ్రావణ శోభ

మార్కెట్లకు శ్రావణ శోభ

జిల్లాలోని పలు మార్కెట్లు గురువారం శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 21న శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావడంతో గురువారం మధ్యాహ్నం నుంచి మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి కనిపించింది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కళాశాల ఆధునికీకరణకు రూ.5 కోట్ల పీఎం ఉష(ప్రధానమంత్రి ఉచ్చతార్‌ శిక్షా అభియాన్‌) పథకం నిధులు మంజూరు చేసింది.

కాఫీకి బెర్రీబోరర్‌ సోకకుండా కార్యాచరణ

కాఫీకి బెర్రీబోరర్‌ సోకకుండా కార్యాచరణ

జిల్లాలో కాఫీకి బెర్రీబోరర్‌ తెగులు సోకకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

విశాఖలో దారుణం.. తరగతి గదిలో కుప్పకూలిన బాలుడు

విశాఖలో దారుణం.. తరగతి గదిలో కుప్పకూలిన బాలుడు

విశాఖలో దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ కుప్పకూలిపోయాడు.

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు.

విశాఖపట్నం జూ పార్కు వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు..

విశాఖపట్నం జూ పార్కు వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు..

విశాఖపట్నం జూ పార్కు వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

అటకెక్కిన  రెండరింగ్‌ ప్లాంటు!

అటకెక్కిన రెండరింగ్‌ ప్లాంటు!

ప్రజారోగ్యానికి తూట్లు పొడిచేలా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న కాంట్రాక్లర్లకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్‌ వ్యర్థాలను పర్యావరణ హితంగా పునర్వినియోగం చేసేలా ‘రెండరింగ్‌ ప్లాంటు’ ఏర్పాటుకు గతంలో జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రాజమండ్రిలో ప్లాంటు ఏర్పాటుచేసిన సంస్థ ఆసక్తిచూపింది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ...ప్లాంటు ఊసెత్తడం లేదు.

పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం

పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం

మేయర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్‌ స్వాగతించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా బలమైన, స్వచ్ఛమైన నాయకత్వాన్ని ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. అవసరమైనచోట సేవా భావం ఉన్న తటస్థులు, సమాజంలో మంచి సంబంధాలు ఉన్న సివిల్‌ సొసైటీ ప్రతినిధుల అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం 59 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.34 లక్షల విలువైన చెక్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మాటల్లో కాకుండా బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కేడర్‌ కలిసి పనిచేయాలన్నారు.

ఖాళీగా ఏరో ఎక్స్‌ప్రెస్‌లు

ఖాళీగా ఏరో ఎక్స్‌ప్రెస్‌లు

ఆర్టీసీ అధికారులు గాజువాక నుంచి భోగాపురం విమానాశ్రయానికి నడుపుతున్న ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు ఆదరణ పెద్దగా లేదు. మొదటి రెండు రోజులు కేవలం 20 శాతమే ఆక్యుపెన్సీ వచ్చింది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు బస్టాపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది.

గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు

గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలో నోటిఫికేషన్‌ జారీచేసినా సరే షెడ్యూల్‌ ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. వార్డుల పునర్విభజనపై ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. 120 వార్డులా?, గతంలో మాదిరిగా 98 వార్డులా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు విధాలుగా ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి