వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శుక్రవారానికి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై వుంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తరువాత అడపాదడపా జల్లులు పడుతూనే వున్నాయి. మొత్తం మీద జిల్లా అంతటా ముసురు వాతావరణం నెలకొని వాతావరణం చల్లబడింది.
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలుదొర తెలిపారు. ఆయన శుక్రవారం అసిస్టెంట్ మలేరియా అధికారి ఏజె సత్యనారాయణతో కలిసి మండలంలోని కోనాంలో పర్యటించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో భారీగా ఓట్లు పోయే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జిల్లాలో ఒకింత మందకొడిగానే సాగుతున్నది. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని, ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ (డిజిటలైజేషన్) చేయాలి. ఓటర్లకు ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ వారి నుంచి పూర్తి చేసిన ఫారాలను తిరిగి తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. అధికారుల గణాంకాల ప్రకారం ఇంతవరకు సుమారు 40 శాతం ఫారాలను మాత్రమే అప్లోడ్ చేశారు.
అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ పరిధిలోని కాపుశెట్టిపాలెంలో పాత్రుని చెరువు కబ్జాకు గురైంది. కొంతమంది వ్యక్తులు దీనిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ నకిలీ పట్టాలు సృష్టించారు. ఇందులో సుమారు ఏడు ఎకరాల చెరువు గర్భంలో స్టోన్ క్రషర్ల ఏర్పాటుకు లీజుకు ఇచ్చేశారు. పాత్రుని చెరువు కబ్జాపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
నగరంలోని రామకృష్ణా బీచ్రోడ్డు పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి.
జిల్లాలో చేపడుతున్న సేంద్రీయ సాగు పద్ధతులను పరిశీలించేందుకు కెన్యా దేశానికి చెందిన బృందం శుక్రవారం పర్యటించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా ఏజెన్సీలో ముసురు కొనసాగుతున్నది.
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు.