ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్పటేల్, ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్పటేల్, ఎస్పీ తుహిన్సిన్హా వేర్వేరుగా గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ జిల్లాలో వంద శాతం లక్ష్యాన్ని సాధించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు చివరినాటికి జిల్లాలో 10,755 మంది బాలికలకు హెచ్పీవీ టీకాలను వేయాలన్నది లక్ష్యంకాగా పది రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తిచేశారు.
రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, పలు మండల కేంద్రాల్లో రోగుల నుంచి యథేచ్ఛగా డబ్బుల దోపిడీ జరుగుతున్నది. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేయాలన్నది వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేయకపోవడంతో ఆయా ల్యాబ్లు, కలెక్షన్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టంవచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు
స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,480 మంది డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు పనిచేస్తున్నారని, సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియలో కొంతమందికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వం పునఃపరిశీలించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీకె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు. రానున్న శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.
మండలంలో వరి సాగుపై ఎల్నినో ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. మండలంలో రైతులు 80 శాతం వరి నాట్లు పూర్తి చేసినప్పటికి ప్రస్తుతం పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి.
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతిపాదనలు చేశారు. దీంతో తమ కష్టాలు తీరతాయని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఆశించారు.
గిరిజన ప్రాంత రైతులకు పంపిణీ చేయనున్న రాజ్మా విత్తనాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు. గురువారం చౌడుపల్లి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాజ్మా విత్తనాల ప్రయోగాత్మక మొలకలను పరిశీలించారు.
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం గన్నెల పీహెచ్సీ ఆవరణలో జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గన్నెల పీహెచ్సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను టీడబ్ల్యూ డీఈఈ అభిషేక్, ఏడీఎంహెచ్వో డాక్టర్ ముర