మాకవరపాలెం మండలాన్ని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఎంఎస్ఎంఈ పార్కును మంజూరు చేసి భూములు కేటాయించింది. ప్రైవేటు రంగంలో ఎర్త్ మూవర్స్ కంపెనీ ‘డోక్సో’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల నుంచి పలు గ్రామాల్లో సర్వే జరుపుతున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా కల్యాణపులోవలో పోతురాజుబాబు, పెద్దింటమ్మవార్ల ఉత్సవాలను ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేదుకు అధికారులు, ఉత్సవ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భీమిలి బీచ్రోడ్డులో రామానాయుడు స్టూడియో సమీపాన ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ‘యూనిటీ మాల్’ నిర్మాణం పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల వద్ద గురువారం అర్ధరాత్రి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతిచెందగా, ఆయన సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యా శాఖాధికారులు ముందుకు వెళుతున్నారు. అన్ని పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా డిసెంబరు ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 226 మంది ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించి ప్రత్యేక బోధన చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్నిబట్టి రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్గా విభజించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
తూర్పు నౌకాదళం విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు విందు ఇచ్చారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీకి అధికారులు సన్నద్ధమయ్యారు.
సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో విద్యుదాఘాతంతో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు గంగిరి గణేశ్ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు జెన్కో అధికారులు అంగీకరించారు.