పాడేరు మన్యంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గూడెంకొత్తవీధి, ముంచంగిపుట్టు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది.
జీకేవీధి, చింతపల్లి మండలాల్లో సోలార్ విద్యుత్ సామగ్రి దొంగలపై చర్యలు తీసుకోవడంలో ఏపీఈపీడీసీఎల్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏడాది క్రితం సోలార్ విద్యుత్ సామగ్రి దొంగల వ్యవహారాన్ని కూటమి నాయకులు బయటపెట్టారు. అప్పట్లో దర్యాప్తు చేస్తున్నామంటూ విజిలెన్స్ అధికారులు హడావిడి చేశారు. సోలార్ విద్యుత్ సామగ్రి దొంగల సమాచారం పక్కాగా సేకరించినప్పటికి విజిలెన్స్ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మండలంలోని తుమ్మనవలస-గుమ్మకోట రోడ్డు అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.
అరిదమన్ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. అమరావతిపై జగన్లా ఇన్ని ప్రకటనలు చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
విశాఖ నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న బొగ్గు, ఇతర సరుకుల ఎగుమతి, దిగుమతులను దశల వారీగా వేరే పోర్టుకు తరలిస్తామని ఇన్చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా వైదొలగిన ‘రాక్ట్రీ’ సంస్థపై చర్యలకు హౌసింగ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్లతో బడ్జెట్ రూపొందించిందని, బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉందని కమిషనర్ తేజ్ భరత్ వెల్లడించారు.
సీలేరు వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు గురువారం ఇక్కడి ఏపీ జెన్కో కల్యాణమండంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగింది.