జీవీఎంసీ పరిధిలో వార్డులను 150కు పెంచాలని గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్రాజులు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ను కోరారు. వార్డుల విభజనపై బుధవారం కలెక్టర్తో చర్చించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగియడంతో జనం బుధవారం స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛరథానికి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.
అరకులోయ టీటీడీ కల్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి భవనం కొత్త రూపు సంతరించుకుని పునఃప్రారంభానికి సిద్ధమైంది.
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుతో గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేస్తే ఏజీ బీఎస్పీని అభ్యసించే అవకాశముంది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ నిషాంతి ఆదేశించారు.
ఖరీఫ్ సాగుకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నా సాగునీటి వనరులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈసారి కూడా సాగునీటికి కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత బంటుపల్లి ఇందుమతి (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం సింహాచంలో ఈ ఘటన జరిగింది.
అచ్యుతాపురం జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణంలో అధికారులకు ముందు చూపు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో చెరువు గట్టు మీదుగానే అతి భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి.
జీవీఎంసీలో వార్డుల పునర్విభజనపై తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.