వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాలపై విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్కు ఆదివారం రైతులు భారీ మొత్తంలో టమాటాలు తీసుకువచ్చారు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడ మార్కెట్కు సోమవారం సెలవు కావడంతో ఆదివారం రైతులు అధిక మొత్తంలో కూరగాయలు తీసుకువస్తుంటారు.
మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి చాలకపోవడంతో అధికారులు, విద్యార్థుల ప్రవేశాలను సగానికి కుదించారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులతో పోటెత్తారు. హరహరమహదేవ శంభోశంకర అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. శైవక్షేత్రాల్లో అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించారు. కుటుంబాల సమేతంగా భక్తులు ఆలయాలకు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
జిల్లాలోని శివాలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు.
గిరిజన ప్రాంతంలో మిరియాల పంట ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది గతం కంటే అధిక దిగుబడులు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో డౌనూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన సమీకృత కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ గత మూడేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది.
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో ఆదివారం ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేసింది.
మత్స్యగుండం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో ఆదివారం పన్నేడా గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.