స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మూడు రోజుల మగశిశువు మృతి చెందిన సంఘటన పై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో షేక్ ఆయీషా శనివారం వైద్యాలయంలో విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్లను ఆమె విచారణ చేశారు.
మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ కోసం లబ్ధిదారులు శనివారం పడిగాపులు కాశారు.
ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. వేసవిలో రక్తదానం చేయడానికి కొందరు ముందుకు రాకపోవడం, విద్యాలయాలకు సెలవులు కావడంతో విద్యార్థులు అందుబాటులో ఉండరని రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడంతో రక్త నిల్వలు అడుగంటు తున్నాయి. ఈ నెల వరకు ఇబ్బంది లేకపోయినప్పటికీ వచ్చే మూడు నెలలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు, మోటార్ వెహికల్ యాక్ట్కు విరుద్ధంగా వాహనాలను నడిపిన 2,046 వారిపై కేసులు నమోదుచేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ పుంజుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు కొనలేని దుస్థితిలో చాలాకాలం కొట్టుమిట్టాడిన కర్మాగారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సాయం చేయడానికి ముందుకువచ్చాయి.
శాటిలైట్ టౌన్షిప్గా మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన సాగర్నగర్లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా...సమస్యల పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.
జనాభా, ఆదాయం అంశాల ప్రాతిపదికగా పలు పంచాయతీలను అప్గ్రేడ్ చేశారు.
ఇన్నాళ్లు పాడేరు ఘాట్లో కొండచరియలో.. చెట్టు కొమ్మలో విరిగిపడతాయని డ్రైవర్లు, ప్రయాణికులు భయపడేవారు. కాని గత కొన్నాళ్లుగా అందుకు భిన్నంగా భారీ వాహనాల రాకపోకలు సాగిస్తే చాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అనుకోని విధంగా మలుపుల వద్ద భారీ వాహనాలు అడ్డంగా నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్నది.
మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కురుస్తూ తర్వాత నుంచి ఎండ ప్రభావం చూపుతున్నది.
కొత్త కలెక్టర్ టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.