• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

పూర్తి ఉచితంగా హోంగార్డులకు ఆరోగ్య బీమా: హోం మంత్రి అనిత

పూర్తి ఉచితంగా హోంగార్డులకు ఆరోగ్య బీమా: హోం మంత్రి అనిత

విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది.

మండలాలకు పాఠ్య పుస్తకాలు

మండలాలకు పాఠ్య పుస్తకాలు

వచ్చే విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను మండల పాయింట్లకు పంపించారు.

మండిన నగరం

మండిన నగరం

వాయువ్య దిశ నుంచి వీచిన వడగాడ్పులకు గురువారం నగరం ఉడికిపోయింది.

నగర నీటి భద్రతకు ప్రణాళిక

నగర నీటి భద్రతకు ప్రణాళిక

ఆస్తి పన్ను ప్రధాన ఆదాయంగా ఉన్న జీవీఎంసీకి భవిష్యత్తులో నీటి సరఫరాయే అతిపెద్ద ఆదాయ వనరుగా మారేలా భవిష్యత్తు నీటి భద్రత ప్రణాళిక (ఫ్యూచర్‌ వాటర్‌ సేఫ్టీ ప్లాన్‌)ను తయారుచేసినట్టు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

జూన్‌లో పలు రైళ్లు రీ షెడ్యూల్‌, మళ్లింపు

జూన్‌లో పలు రైళ్లు రీ షెడ్యూల్‌, మళ్లింపు

సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూన్‌లో పలు ఒరిజినేటింగ్‌ రైళ్లను రీ షెడ్యూల్‌ చేశామని, మరికొన్ని రైళ్లు మళ్లింపు మార్గంలో నడుస్తాయని సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు.

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రి నారా లోకేశ్‌ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, టెన్త్‌ విద్యార్థుల కోసం నిర్వహించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం స్థానికంగా వున్న క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని టెన్త్‌ ప్రతిభావంతులకు హోం మంత్రి అనిత తన సొంత నిధులతో కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌తో కలిసి నగదు పురస్కారాలను అందజేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మణం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మణం

ఎలమంచిలి, రాంబిల్లి, రావికమతం మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి బోల్తా పడడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఒక యువకుడు మృతిచెందాడు. రాంబిల్లి మండలం గొరపూడి మెట్ట వద్ద బైక్‌ను వ్యాన్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. రావికమతం మండలం మట్టవానిపాలెంలో ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ మృతిచెందాడు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మండుతున్న మన్యం

మండుతున్న మన్యం

సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న మన్యం రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశం. ఇది ఒకప్పటి మాటగానే మిగిలిపోయేలా తాజా వాతావరణం ఏర్పడింది. గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతానికి సమానంగా ఉండగా, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని పర్యావరణ పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మన్యంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అతి శీతల ప్రాంతంగా ఉన్న మన్యం ఉష్ణమండలంగా మారడం గమనార్హం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి