జిల్లా సమగ్ర శిక్ష విభాగంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, కేజీబీవీల్లో టెండర్ల ఖరారులో తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయం సూపరింటెండెంట్కు పదోన్నతి కల్పించి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. నగరంలో ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) సహా పలురకాల క్యాన్సర్లను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ‘పాసింజర్ లాంజ్లు’ ఏర్పాటు చేస్తున్నారు.
మండలంలోని తెనుగుపూడి అంబేడ్కర్ గురుకుల కళాశాల విద్యార్థులు మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు.
బిల్డర్ల మాయాజాలంలో పడి మధ్య తరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో అత్యంత కీలకమైన అక్విడెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద ఈ భారీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు మూడు షిఫ్ట్టుల్లో పనులు చేపడుతున్నారు.
కోనాం జలాశయం అడుగంటింది. నిర్వహణ పనుల కోసం జలాశయంలో ఉన్న సాగునీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెట్టడంతో జలాశయంలో చుక్కనీరు కూడా లేకుండాపోయింది. పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ అలసత్వం వహించడంతో కురిసిన వర్షపు నీరు సైతం బొడ్డేరు నదిలోకి పోయింది. దీంతో జలాశయం పరిధిలో ఐదు మండలాలకు చెందిన 13 వేల ఎకరాల వరిసాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని తెనుగుపూడి అంబేడ్కర్ గురుకుల కళాశాల విద్యార్థులు మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు చొప్పున విద్యార్థులు జ్వరాలతో మంచాన పడుతున్నారు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు 22 మందికి జ్వరాలు వచ్చాయి. గత మూడు రోజుల్లో 13 మంది జ్వరాల బారిన పడ్డారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి పార్కులోని అల్లూరి, గంటందొర సమాధులు, విగ్రహాలకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా కృష్ణాదేవిపేట రామాలయం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, డివిజన్, మండలస్థాయి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.