విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు.
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం ప్రారంభం కానుంది.
మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా విభిన్నమైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం పొగమంచు, తర్వాత ఎండ, సాయంత్రం వేళల్లో వర్షం పడుతున్నది.
స్థానిక ముత్యాలమ్మ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థల సమస్య నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాల వేదికల ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.
మన్యంలో శనివారం రాత్రి 11.30 గంటలకు ఒక్కసారిగా అలజడి రేగింది. ఇళ్లు కంపించడం, వస్తువులు కింద పడిపోతుండడంతో ఏం జరిగిందో తెలియక జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. కలెక్టర్గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
మండలంలోని గిరిజన గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి మొదలైంది. ఆదివారం జంగంసరియా, మజ్జిగూడ, బోడిపుట్టు, తదితర గ్రామాల్లో ఇటుకల పండుగ సందర్భంగా పెద్ద వేట ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఆంధ్ర ఊటీ అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి.
పట్టణంలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు జనంపై దాడులు చేస్తున్నాయి. శనివారం జలాలు వీధికి చెందిన కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్ధురాలిపై కోతుల మంద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో జనం భీతిల్లుతున్నారు.
నక్కపల్లి మండలం తీర ప్రాంతానికి ప్రభుత్వం జట్టీని మంజూరు చేసిన నేపథ్యంలో మత్స్యశాఖాధికారులు, టీడీపీ నాయకులు శనివారం స్థల పరిశీలన చేశారు.