మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకసంఖ్యలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ శీతలగాలులు వీస్తున్నాయి. డిసెంబరు, జనవరి మాసాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం పర్యాటకులను ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత శీతాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఆరున్నరేళ్లుగా ఆగిపోయిన బీఎన్ రోడ్డు పనులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రంలో మార్చి నాటికి రోడ్లపై గుంతలు ఉండకూడదని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చేసిన హెచ్చరికలు తీవ్రంగానే ప్రభావం చూపించాయి. ఫలితంగా బీఎన్ రోడ్డు పనులలో కదలిక వచ్చింది. బీఎన్ రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలపై ఈనెల 22వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు రహదారులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో రెవెన్యూలో అవినీతి మర్రి ఊడల్లా విస్తరిస్తోంది.. పలు తహశీల్దారు కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు తహశీల్దారు కార్యాలయాలే అడ్డాగా చేసుకొని భూ లావాదేవీలు సాగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ మార్పు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్పై రవాణా శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు చేపట్టామని జిల్లా రవాణాశాఖ అధికారి జి. మనోహర్ తెలిపారు. పాఠశాలల బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ఎంవీ చట్టం, బస్సు బాడీకోడ్ల ప్రకారం పాటించబడుతున్నాయా అనే అంశాలను ఎంవీ ఇన్స్పెక్టర్ల ప్రత్యేక బృందాలు పరిశీలించినట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న పాఠశాలల బస్సులన్నింటిని మూడు బృందాలు సూక్ష్మంగా పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
అనకాపల్లి ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరబోతోంది. పదేళ్లుగా ఊరిస్తున్న రైతు బజార్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు కానుంది. ఇప్పటికే యార్డులోని నాగదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని 17, 18 నంబర్లు గల బ్లాకులను సుందరంగా తీర్చిదిద్దడంలో మార్కెటింగ్ శాఖ నిమగ్నమైంది.
భూమి మ్యూటేషన్కు రూ.20 వేలు లంచం తీసుకుంటూ మారేడుపూడి వీఆర్వో ఎం.సూర్యనారాయణ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండు దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలం వివాదాస్పదంగా మారడంతో ఈ దుకాణాలకు నిర్వహించిన టెండర్ను రద్దు చేస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దుకాణాల అద్దెకు నిర్వహించిన టెండర్లో కొందరు వ్యాపారులు రింగ్ అయు, గతంలో నెలకు రూ.2.70 లక్షలు ఉన్న అద్దె కంటే తక్కువగా నెలకు రూ.1.30 లక్షల అద్దెకు దుకాణాలు దక్కించుకోవడం, ఇది ఆరోపణలకు దారితీయడంతో ఈ టెండరు రద్దు చేసి మళ్లీ టెండరు పిలవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ‘రాక్రీట్’ కంపెనీ మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించింది.
హైందవ ధర్మ పరిరక్షణ, సింహాచలం క్షేత్ర మహాత్మ్యం ప్రచారానికి ఉద్దేశించిన నృసింహ దీక్షలకు డిసెంబరు 3వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత ప్రకటించారు.
నగరంలో ప్రధాన రహదారులను పీపీపీ యాన్యుటీ/హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.