పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ముఖ్యంగా కొత్తూరు జంక్షన్ నుంచి దేవరాపల్లి వె ళ్లే రహదారితో పాటు మెయిన్ రోడ్డు నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారిలో నిత్యం వాహనాల రద్దీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీకి నాడు, నేడు కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ వరి పంటపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి.
భవిష్యత్తులో రాష్ట్రంలోనే నంబర్ వన్గా అనకాపల్లి జిల్లాను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పాటు భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సంపూర్ణంగా వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడుతున్న అన్నదమ్ములను పీడీ యాక్టుపై అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.
మన్యం ప్రకృతి అందాలకు వన్నె తెచ్చిన వలిసెల సాగును కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది రబీలో జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు వ్యాల్యూ క్లస్టర్ చైన్(వీసీసీ) పథకం ద్వారా శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనుంది. మేలిజాతి వంగడాలను ఒడిశా సునాబెడ నుంచి తీసుకొస్తున్నది. నెలాఖరు నాటికి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.