కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం (6వ తేదీ) రద్దు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపియ్యపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గుర్తించిన ల్యాండ్ భ్యాంకు భూముల్లో త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన చామంతిపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజుల నుంచి రావికమతం, రోలుగుంట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కి దున్నడం, ఆకు మడులు సిద్ధం చేయడం, వరి విత్తనాలు చల్లడం వంటి పనులు చేపడుతున్నారు. రావికమతం మండలం కొత్తకోట, దొండపూడి, గర్నకం, కొమిర, మత్స్యపురం, చినపాచిల, రావికమతం, మట్టవానిపాలెం, గుడ్డిప తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆదివారం పొలాలకు వెళ్లి, మడులు సిద్ధం చేసుకొని వరి విత్తనాలు చల్లారు.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జనసైనికులు, వీర మహిళల నుంచి 2,100కుపైగా దరఖాస్తులు స్వీకరించినట్టు జనసేన పార్టీ నియోజకవర్గం పరిశీలకులు పెండెం దొరబాబు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు.
మునిసిపాలిటీ ప్రజారోగ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం పట్టణ వాసులకు శాపంగా మారింది. వీధులను శుభ్రం చేసిన సిబ్బంది వాహనాల్లో తరలించకుండా కుప్పలుగా పోగుచేసి నిప్పు పెడుతుండడంతో పట్టణ వాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. దట్టంగా పొగ వెదజల్లుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అధి కారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నా మని వాపోతున్నారు.
ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు.
ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటు గల్లంతైన ఘటన చాలా బాధాకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మత్స్యకారులు గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పిన వెంటనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నగరంలో ఊబర్, ర్యాపిడో, ఓలా కారు డ్రైవర్లు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది.