అనకాసల్లి ఎంపీ సీఎం రమేశ్ శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి పారుదల, తాగునీటి వసతుల కల్పన, తదితర సమస్యలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే ప్రధాన మార్గంలో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. ఈ మార్గంలో వాహనాలు వెళితే ధూళి ఎగసిపడడంతో వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి.
మండలంలో కాశీపురం- బి.కింతాడ ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఈ రహదారి నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రహదారులు, మౌలికవసతుల నిధుల (సీఆర్ఐఎఫ్)తో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంట్రాక్టర్కు చెల్లించకుండా వేరే అవసరాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఏజెన్సీలో గతంలో పెద్దగా ఎండల ప్రభావం ఉండేది కాదు. కాని ఈఏడాది అందుకు భిన్నంగా ఎండలు తీవ్రం కావడంతో ఏజెన్సీలోనూ ఫ్యాన్ల వినియోగం క్రమంగా పెరిగింది. ఫలితంగా విద్యుత్ వినియోగం రోజుకు మూడు మెగావాట్లు పెరిగింది.
మన్యంలో ఎండల తీవ్రతకు గిరిజనులు విలవిలలాడుతున్నారు. ఎండకుతోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) గిరిజన ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించింది.
డుంబ్రిగుడ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహరి సమీపంలోని హనుమరాయి గెడ్డలో సరదాగా స్నానానికి దిగి గిరిజనుడు శుక్రవారం మృతి చెందాడు.
గిరిజన ప్రాంతంలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ కాఫీ తోటలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వయస్సు మీరిన మొక్కలు, కాపు తగ్గిన కావేరి రకాల మొక్కలను తొలగించి మేలిజాతి చంద్రగిరి, సెలక్షన్-5 మొక్కలు నాటేందుకు నర్సరీలను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది నూతన మొక్కలను కాఫీ తోటల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నది. గిరిజన ప్రాంతంలో ఏపీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడానికి విద్యా శాఖ అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే లక్ష్యం మేర అడ్మిషన్లు జరుగుతాయా అన్న సందేహం కలుగుతున్నది. ప్రభుత్వం విధించిన టార్గెట్లో ఇంతవరకు 25 శాతానికి కూడా చేరుకోలేదు.
క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని అన్నారు.