మత్స్యకారుల గల్లంతుపై గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 10:00 AM
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
విశాఖపట్నం, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని రక్షించేందుకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. సముద్రంలో గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సీపీలను ఆదేశించారు సీఎం. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు.
మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లి 7 మంది మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchannaidu) ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News