గౌరవ వేతనం చెల్లించాలని ఎంపీటీసీలు కోరారు. సోమవారం ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం జరిగింది.
Sales of inferior drinks and ice creams పండుగలు, జాతర్లలో ఆనందంగా గడపాల్సిన క్షణాలు.. కొందరి వ్యాపారుల కాసుల కక్కుర్తికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. తక్కువ ధర ఆశచూపి.. నాసిరకం, కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతున్న వ్యాపారుల వలకు అమాయక ప్రజలు బలవుతున్నారు.
పాతపట్నంలోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో లోపాలను సరిదిద్దుతామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్క ర్ తెలిపారు. స్థానిక గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతి నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్ల, టెర్రస్ను పరిశీలించారు. విద్యార్థిని ఎలా మృతిచెందిందో ఆరాతీశారు. విద్యార్థినులపై నిఘాలేకపోవడం, నిర్వహణ వైఫల్యాలు, లోపాలు గుర్తించి ప్రిన్సిపాల్ పద్మావతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రను ముద్రించి రైతులకు భూములపై పూర్తిస్థాయిలో భరోసా కల్పించామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
Treatments at Singupuram PHC సింగుపురంలోని కొండమ్మతల్లి జాతరలో విక్రయించిన బాదంపాలు తాగి.. అస్వస్థతకు గురైన బాధితులకు స్థానిక పీహెచ్సీలో చికిత్స కొనసాగుతోంది. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ శుక్రవారం నాడు సుమారు 80 మందికిపైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. శనివారం నాటికి 113 కేసులు నమోదయ్యాయి.
అమరావతి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకురావాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. హామీ మేరకు రైతులకు రాజముద్రతో కూడిన హక్కుపత్రాలను అందజేస్తు న్నామని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమం సమతుల్యత పాటిస్తూ పాలన సాగించడం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
బందరువాని పేటలో చెత్త సంపద సేకరణ కేంద్రాన్ని విని యోగంలోకి తీసుకువచ్చారు. గత నెల 28న ‘నిరు పయోగంగా చెత్త సంపద కేంద్రం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనా నికి అధికారులు స్పందించారు.