సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసుల నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు.
ఉత్తరాంధ్రలో కాలుష్యం పెరుగుతున్న జిల్లాల్లో విశాఖ తరువాత శ్రీకాకుళం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు రెండుమూడుసార్లు అధికారంలోకి తీసుకురావాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠ శాల ఆవరణలో నిర్వహించి ప్రీస్కూల్ తరగతుల నిర్వహణకు మందస ఐసీడీఎస్ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్లు పీవో పెద్దింటి అరుణ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే 75 కేంద్రాలను తనిఖీ చేసి ప్రీస్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేసి నట్లు చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఎస్డబ్యూఆర్ ఈఐ సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ ఆదేశించారు.
:కార్గో ఎయి ర్పోర్టు నిర్మాణంపై అపోహలు వద్దని పలాస ఆర్డీవో జి.వెంకటేష్, ఎయిర్పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వర రావు కోరారు. సోమవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంఎయిర్పోర్టు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి,ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధ్దం చేసిన ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష పేర్కొన్నారు. సోమవారం జలుమూరు వద్ద సిద్ధం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.
కొత్తమ్మతల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు తెలిపారు. సోమవారం కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో అధి కారులు, గ్రామపెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.
Construction of medical and health department buildings జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Today is World AIDS Day ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన వైరస్ హెచ్ఐవీ. 1990-2002 మధ్య జిల్లాలో హెచ్ఐవీ కేసుల తీవ్రత అధికంగా ఉండేది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం ఉపశమనమే అయినా.. ఇంకా కేసులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో హెచ్ఐవీతో మృతి చెందేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.