Inspection in Uddanam soon జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్, నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
‘In Service of Fishermen’ Scheme ‘‘కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద అందజేస్తున్న భృతి.. కేవలం సాయం కాదు. మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Medical shops closed ఆన్లైన్ ఫార్మసీ (ఇ-ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ జరగనుంది.
నందిగాంలోని పొందరలు మంగళవారం అమ్మ వార్లకు చల్లదనం చేశారు. మహిళలు కలశాలతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి నీలమణిదుర్గ, సందెమ్మతల్లి ,చింతపోలమ్మతల్లి, సామాలమ్మతల్లి అమ్మవార్లకు ముర్రాటలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.
మెళియాపుట్టిలో చెత్త సేకరణ రిక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి పీఎంజే బాబు అన్నారు.
ఇకపై జైలు ములాఖత్ వద్దే న్యాయ సేవలు లభించే వీలు కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ చర్యలు చేపడు తోందని ఆ సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.
ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం స్వర్ణ కారులు బంగారు దుకాణాలను మూసి వేసి నిరసన తెలిపారు.
: దామోదరసాగర్ ఆయకట్టు రైతుల కష్టాలను రానున్న ఖరీఫ్నుంచి తీరుస్తామని జలవనరుల శాఖ ఎస్ఈ సుధాకర్ తెలిపారు. మంగళవారం మందస మండలంలోని దామోదర సాగర్ కుడి కాలువను జలవనరులు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు.
కుందువానిపేటలో ఇటీవల జరిగిన గృహప్రవేశాల ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమి టీ సభ్యులు మంగళవారం సదరు గ్రామాన్ని సందర్శించారు.