విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం జలుమూరు కేజీబీవీ పాఠశాలలో 2.12 కోట్లు రూపాయలతో నిర్మించిన అదనపు వసతులు భవనాన్ని ప్రారంభించారు.
ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరడి బ్యారేజీ అంశం గాలికొదిలేశారని, ఇప్పుడు వైసీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నౌపడా మూడురోడ్లు జంక్షన్లో సింకుఒడ్డు చెరువు వద్ద నీటిభద్రత సాగునీటి సంఘాల బాధ్యత పనులను ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నవంబర్ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
వత్సవలసలో రాజమ్మను శనివారం దర్శించుకొని తిరిగి స్వగ్రామా నికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటోబోల్తా పడిన ఘట నలో మృతి చెందాడు.
ఎం.తోటూరు జంక్షన్, రైల్వే క్రాసింగ్ ఎల్సీ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నంనాయుడు, రూరల్ ఇన్చార్జి ఎస్ఐ జనార్దనరావు తెలిపారు.
జగతిమెట్ట దరి జగనన్న కాలనీలో పెద్దఎత్తున అవినీతి, అక్ర మాలు చోటుచేసుకున్నాయని అధికారులు ద్వారా తేటతెల్లమవుతుందని, నెల రోజుల్లో వీటిని వెలికి తీయాలని రెవెన్యూ అధికారులను మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
జాతీయ రహదారి నెమలి నారా యణపురం బైపాస్ వ ద్ద పూరీ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఎదు రుగా వస్తున్న లారీని ఢీ కొంది.
Water.. Special drive from today వర్షాభావ పరిస్థితులు, అడుగంటున్న భూగర్భ జలాలతో అల్లాడుతున్న రైతులు, ప్రజలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత’ పేరిట జల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల ప్రత్యేకడ్రైవ్కు శ్రీకారం చుట్టింది.
తమ బంధు వును పరామర్శించేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్ర మాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య మృ తి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
Project negligence of the YCP government జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార నదిపై అత్యంత ప్రాధాన్యం కలిగిన నేరడి బ్యారేజీని నిర్మించి తీరుతామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.