రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో విత్తనాలు, ఎరు వులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు. గురువారం రామయ్యపుట్టుగలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.
Two students missing at sea శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవానిపేట సముద్ర తీరంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి పాసైన ఆనందంతో సరాదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన వజ్రపు సాయితిలక్ (15), గుజ్జల లీలాకృష్ణ(15) గల్లంతయ్యారు.
Approval of revised estimates జిల్లా ప్రజలు, పర్యాటకులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వంశధార హైలెవల్ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే.. వంతెన పనులకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Deficit rainfall in the srikakulam జిల్లాలో నాలుగు మండలాల్లో రైతులను లోటు వర్షపాతం వెంటాడుతోంది. వర్షపాతానికి సంబంధించిన తాజా గణాంకాలను ప్రభుత్వం.. అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 19 వరకు జిల్లావ్యాప్తంగా సగటున ‘సాధారణ’ వర్షపాతమే నమోదైనప్పటికీ, మండలాల వారీగా మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Medical shop strike అక్రమ, నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు చేపట్టిన ఒకరోజు టోకెన్ బంద్ విజయవంతమైంది. ఏఐఓసీడీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.
రామయ్యపట్నంలో దశాబ్దాలు గా గ్రామస్థులు పూజిస్తున్న వరసండి అమ్మవారి ఆలయ ప్రహరీ నిర్మిస్తుం డగా బుధవారం అటవీశాఖ అధికా రులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరి గింది.
విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ సిబ్బందితోనే నిర్వహిం చాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి వై.అప్పయ్య డిమాండ్ చేశారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
Increasing student enrollment in government schools ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశాలు ఊపందుకున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు.
Animal husbandry has become a burden ఒకప్పుడు పాడి పంటలతో పల్లెలు కళకళలాడేవి. ప్రతి ఇంటి ముందూ పశువుల శాలలు, అందులో నాలుగైదు ఆవులు, దూడలు, గేదెలతో పాటు ఎద్దులు ఉండేవి. కళ్లాల్లో పెద్దపెద్ద గండి వాములు సైతం కనిపించేవి. కానీ ప్రస్తుతం పల్లెల్లో పశుసంపద కనుమరుగవుతోంది. యాంత్రీకరణ సాగు పెరగడం, పచ్చిక బయళ్లు తగ్గిపోవడం, గ్రాసం దొరక్కపోవడం వంటి కారణాలతో పశుపోషణ భారంగా మారింది.