District MLAs to meet CM Chandrababu today వైసీపీ పాలనలో నిధుల లేమితో కుదేలైన జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రజాప్రతినిధులు సన్నద్ధమయ్యారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
Downed electrical transformers and poles జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకూ ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. 3.30 గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని.. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.
Moolapet port works at a fast pace ‘మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న నవంబరు నాటికి షిప్ రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నామ’ని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
గ్రామాల్లో నీటిని సంరక్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని పలువురు ప్రజా ప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కార్యక్రమ లక్ష్యాలను వివరించారు.
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో హోంగార్డు ఎం.మహదేవ్ సంజీవరావు సిల్వర్ మెడల్ సాధించాడు.
సమాజ చైతన్య వీచికలు నాటిక లని, ఇవి ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ అన్నారు.
విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణ దోహదం చేస్తుందని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేవీ రమణ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అటకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరు కుపోతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా ఫాగిం గ్ సైతం చేయడంలేన్న విమర్శలొస్తున్నాయి.
జలుమూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 2010లో నిర్మించిన ఈ భవనం కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. గోడలు సైతం బీటలు వారాయి. దీంతో ఎప్పుడు కూలిపోతుందోన్న భయాందోళనతో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పలుచోట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.