Release water through Vamsadhara canals ఖరీఫ్ సాగుకు వంశధార కదలివస్తోంది. సోమవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్రెగ్యులేటర్ గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. ముందుగా వంశధార ప్రాజెక్టు ఎస్ఈ జి.రామచంద్రరావు, కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
బఫర్ గోదాముల నుంచి నిత్యావసర సరుకుల సరఫరా విధానంతో హమాలీల కుటుంబా లను రోడ్డున పడేయొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, యూనియన్ గౌరవాధ్యక్షుడు సీహెచ్ గోవిం దరావు డిమాండ్చేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో సీఎంఆర్ఎఫ్ ఆసరా గా ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికు మార్ తెలిపారు.
Only 8 days left for ‘Sir’ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ఇంటింటి సర్వేకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ శతశాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ మాత్రం ఆశించినస్థాయిలో పూర్తికావడం లేదు.
Today is World Zoonosis Day చాలామంది కుక్కలు, పిల్లులు, రకరకాల పక్షులను పెంచుతుంటారు. పెంపుడు జంతువులంటే వారికి ప్రాణం. వాటిని కన్న పిల్లలతో సమానంగా కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అవి కూడా అంతకు మించిన ప్రేమను పంచుతుంటాయి. అయితే జంతువులు, పక్షుల పెంపకంలో జాగ్రత్తలు అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు. లేదంటే వాటి నుంచి కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని హెచ్చరిస్తున్నారు.
Wife delivers baby in hospital; husband dies in road accident మృత్యువు ఏ రోజు.. ఏ రూపంలో వస్తుందో తెలియదనడానికి ఆ ఘటనే ఉదాహరణ. ప్రసవ వేదనతో బాధపడుతున్న భార్యను ఆటోలో ఆస్పత్రికి తెచ్చాడు భర్త. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది భార్య. తమ ఇంట రెండో సంతానంగా లక్ష్మీదేవి పుట్టిందని ఆ దంపతులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఎంతసేపూ మిగల్లేదు. ఆస్పత్రిలో ఉన్న భార్యాబిడ్డకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన భర్తను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది.
Water released through the Left Main Canal today ఎట్టకేలకు ఖరీఫ్ సీజన్లో వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా సాగునీటి విడిచిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. ‘‘వంశ‘ధార’ వచ్చేనా’’ అనే శీర్షికతో ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు.
: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లితే బీఎల్వోలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు.
సంస్కృతి, సంప్ర దాయాలను పాటించాలని నిర్వాహకులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఆదివారంజంట పట్టణాల్లో ఆర్టీసీకాంప్లెక్స్ వద్ద ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కాటమ్మతల్లి అమ్మవారి వార్షిక సంబ రాలు నిర్వహించారు.