Share News

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:41 PM

కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి
కృష్ణతేజకు వినతిపత్రం అందజేస్తున్న బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధిహామీ పనులు పెండింగ్‌ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అలాగే 1959లో నిర్మించిన సారవకోట మండలపరిషత్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడం తో నిరుపయోగంగా ఉందని తెలిపారు. ఈ భవనం పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.

Updated Date - Feb 20 , 2026 | 11:41 PM