అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపడు తున్నారు. ఈ యాత్రకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్వాగతం పలికారు.
పలాస రైల్వేస్టేషన్ను అమృతభారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆధునీకరిస్తున్నారు. ఒకటో నెంబరు ప్లాట్ఫారాన్ని టిక్కెట్ రిజర్వేషన్ కార్యాలయం ఉండే ప్రాంతానికి మార్చేపనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్లాట్ఫారాలను కలుపుతూ పది మీటర్ల వెడల్పుతో భారీ ఫుట్బ్రిడ్జిని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఆర్ఎం టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నగరంలో సోమవారం చేపట్టిన ర్యాలీలో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
మారుమూల పల్లెల్లో సైతం విద్యా భివృద్ధికి ప్రభుత్వం కృషివేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమ వారం హరిపురం ప్లస్ టూ హైస్కూల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, మాధవరావు, రుద్రయ్య, గున్నయ్య, వాసు, వైకుంఠరావు, తమిరి భాస్కరరావు, లచ్చయ్య పాల్గొన్నారు.
మండ ల కేంద్రం రణస్థ లం జాతీయ ర హదారి విస్తరణ లో భాగంగా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి.
కారు ఢీకొనడంతో ఓ మెడికో విద్యార్థినికి గాయాలవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
ప్ర జల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారా నికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
Wild animals వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో తూర్పు కనుమల్లో ఎత్తయిన మహేంద్రగిరులు వన్యప్రాణులకు నిలయాలు. లక్షల ఎకరాల్లో విస్తరించే కొండలు.. అరుదైన పక్షులు, జంతువులకు ఆవాసాలు. ఆహారంతో పాటు సమృద్ధిగా నీరు లభిస్తుంది.
Benefits of PM Matru Vandana Yojana గర్భిణులకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఆర్థికసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బంది గ్రామాలతోపాటు పట్టణాల్లో సర్వే చేపడుతున్నారు.