వైసీపీ నాయకుల డీఎన్ఏలోనే హింస ఉందని, నిస్వార్ధంగా వార్తలు అందిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించడం హేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
కాశీబుగ్గ నిత్యానందనగర్లో మంగళవారం మధ్యాహ్నం జ్యూయలరీ షాపులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడులకు దిగడం పిరికిపంద చర్య అని టీడీ పీ జిల్లా అధికార ప్రతినిధి బూర్లె లలితకుమారి తెలిపారు.
ప్రస్తుత కాలంలో సినిమా ల్లోకి వచ్చే కొత్తవా రు నటనపై ఆసక్తి పెంచుకోవాలని, చక్కని డైలాగ్ డెలి వరీ, హావభావాలు పలికించి రాణించా లని సూచించారు.
ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామంటూ రెండు రోజులుగా వైసీపీ నాయకులు హడా వుడి చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. ప్రతి మండలం నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు నిచ్చారు. కానీ బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కేవలం 60 మంది హాజరయ్యారు. దీంతో ఆ పార్టీ కార్యక్ర మం ఫ్లాప్ షో అయింది.
బడిఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, ఎంఈవోలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
జిల్లాలో కొద్దిరోజులుగా విచిత్ర వాతా వరణ పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రీమాన్సూన్ కావడంతో మధ్యాహ్నం ఎండలు కాచి సాయంత్రం ఉరుములు, మెరుపులతో మేఘావృతమై ఒక్కసారిగా వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి.
కొండపేట ఎత్తిపోతల పథకం మర మ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్ చేశారు.
ఎయిర్ పోర్టు నిర్మాణానికి రైతులు సహకరించాలని డిప్యూటీ కలెక్టర్లు వేణుగోపాల్, జయదేవి కోరారు. మంగళవా రం మండలంలోని మోట్టూరు పంచాయతీలోగల ఒం కులూరు, చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో రైతులతో మాట్లాడారు. భూములు అప్పగించేందుకు ఉన్న సమస్యలను రైతులు అడిగి తెలుసుకున్నారు.
జీవోఎంఎస్ నెంబరు-60ని ఉపసంహరించుకొని జీవోనెంబరు- 91ని యధావిఽధిగా కొనసాగించాలని కార్యదర్శులు కోరారు. ఈమేరకు నందిగాం ఎంపీడీవో యు.కుమార్పట్నాయక్కు మంగళవారం కార్యదర్శుల మండలశాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.రమణబాబు, కె.సంతోష్కుమార్ నేతృత్వంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.