Governance towards welfare and development డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆమదాలవలస మునిసిపాలిటీ జగ్గుశాస్ర్తులపేట వద్ద విద్యుత్ ఉపకేంద్రానికి పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
Odisha woman commits suicide in Srikakulam hotel అనారోగ్య సమస్యలు ఆ యువతిని కుంగదీశాయి. చికిత్స కోసం రూ. లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి.. తాపీ పని చేసుకునే తండ్రికి అంత భారం వేయకూడదని నిర్ణయించుకుంది.
Rain at srikakulam జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
జేఆర్పురం పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పినట్టు ఎస్ఐ ఎస్.చిరంజీవి శుక్రవారం తెలిపారు.
ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం మృతదేహం శుక్రవారం వాండ్రంగి- ఆనందపురం గ్రామాల సమీపంలో లభ్యమైనట్టు ఎస్ఐ వెలిచేటి సందీప్ కుమార్ తెలిపారు.
జిల్లా పోలీస్శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తు న్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని చేపట్టి క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు.
సముద్రతీర ప్రాంత రక్షణకు, అక్రమ రవాణా నివారణకు సహకరిం చాలని మెరైన్ సీఐ రమేష్ అన్నారు.
ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఓ కరుడుగట్టిన స్మగ్లర్ ఆటను పోలీసులు కట్టిం చారు. పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి తీసు కొచ్చి జిల్లాలో విక్రయిస్తున్న మోస్ట్వాంటెడ్ డ్రగ్ అఫెండర్పై ప్రభుత్వం ఉక్కుపాదం మో పింది.
కార్మికవర్గాలను యజమా నులకు బానిసలుగా చేసే నాలుగు లేబ్ రోడ్లను వెంటనే రద్దు చేయా లని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు హెచ్చరించారు.
మునిసిపాలిటీ పరిధిలోని బొడ్డేపల్లిపేట జంక్షన్ వద్ద బుధవారం రాత్రి కారు ఢీకొని కల్లేపల్లి పాపారావు (25) మృతి చెందినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు.