Home » Andhra Pradesh » Srikakulam
కృష్ణాపురానికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీ, బీజేపీల్లో చేరాయి.
ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫేస్టో అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కార్మిక సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి కోరారు.
మే డే.. అంటే కార్మికులకు పండుగ దినం. కార్మికుల శ్రమ, వారి అంకితభావం గుర్తించేలా.. ఏటా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు. కాగా.. వైసీపీ పాలనలో కార్మికుల హక్కుల కాలరాయడం.. శ్రమదోపిడీకి పాల్పడడం.. ఉపాధి అవకాశాలు లేక.. కార్మికుల్లో సంతోషం కరువవుతోంది.
ఆటో డ్రైవర్లు కూడా వైసీపీ పాలనపై గుర్రుముంటున్నారు. సీఎం జగన్ వాహన మిత్ర పథకం ద్వారా ఓ చేత్తో సాయం చేసి.. మరోచేత్తో జరిమానాలు, వివిధ పన్నుల పేరిట దానికి పదిరెట్లు నగదు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు శరవణ కుమార్, కోమల్జిత్ మీనా, నవీన్ కుమార్ సోనీ.. అధికారులను ఆదేశించారు.
జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన పోలాకి రామారావు(70) అనే రైతు.. మంగళవారం పొలానికి వెళ్లి నువ్వుచేను ఆరబెట్టాడు. ఆ సమయంలో ఎండ తీవ్రతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఎన్నికల పండుగ చిరు వ్యాపారులకు ఊతమిచ్చింది. నామినేషన్లు, ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం జోరందు కుంది. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యా లీగా వెళ్లిన నేతలకు పూల దండలు వేయడానికి అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ముందు గానే పూల దండలకు ఆర్డర్లు ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల ర్యాలీలు ముగియడంతో ప్రచా రానికి వెళుతున్న అభ్యర్థులకు గ్రామాల్లో పూల దండలు వేసి అభిమానం చాటుకుంటు న్నారు. ఇక జిల్లా స్థాయి నాయకులు వచ్చినా, పార్టీ అధినేతలు వచ్చినా కార్యకర్తలు పూల దండలు, గజమాలలు వేసి కేరింతలు కొడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగి యడంతో అభ్యర్థులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందిస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం పూలకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పువ్వులు సిద్ధం చేసి అమ్మడానికి ఎదురు చూసే పరిస్థితి లేకుండా వ్యాపారులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ దండలు, పువ్వులు తెప్పించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు సంబర పడుతున్నారు. అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభానికే విక్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత విజయంఎన్నికల పండుగ చిరు వ్యాపారులకు ఊతమిచ్చింది. నామినేషన్లు, ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం జోరందు కుంది. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యా లీగా వెళ్లిన నేతలకు పూల దండలు వేయడానికి అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ముందు గానే పూల దండలకు ఆర్డర్లు ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల ర్యాలీలు ముగియడంతో ప్రచా రానికి వెళుతున్న అభ్యర్థులకు గ్రామాల్లో పూల దండలు వేసి అభిమానం చాటుకుంటు న్నారు. ఇక జిల్లా స్థాయి నాయకులు వచ్చినా, పార్టీ అధినేతలు వచ్చినా కార్యకర్తలు పూల దండలు, గజమాలలు వేసి కేరింతలు కొడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగి యడంతో అభ్యర్థులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందిస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం పూలకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పువ్వులు సిద్ధం చేసి అమ్మడానికి ఎదురు చూసే పరిస్థితి లేకుండా వ్యాపారులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ దండలు, పువ్వులు తెప్పించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు సంబర పడుతున్నారు. అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభానికే విక్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత విజయం సాధించిన వారి విజయోత్సవ ర్యాలీ వరకు తమకు వ్యాపారం బాగానే సాగుతుందని పూల వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు. సాధించిన వారి విజయోత్సవ ర్యాలీ వరకు తమకు వ్యాపారం బాగానే సాగుతుందని పూల వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు.
‘హలో... మన దగ్గర ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఈసారి ఎవరు గెలుస్తారు? జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయ’ంటూ దేశ, విదేశాలు, పక్క జిల్లాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలు సుకుంటున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో బంధువ ర్గాలకు ఫోన్ చేసి సమాచారం అడుగుతున్నారు. ఎక్కువగా తెలంగాణ నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు జిల్లా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. వీరితో పాటు ఉద్యోగం, చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన వారు కూడా గెలుపు, ఓటములపై ఆరా తీస్తున్నారు. ఇటు జిల్లా వాసులు కూడా పక్క జిల్లాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అక్కడి రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి ఫోన్లలో రాజకీయాలపై ఆసక్తికరంగా చర్చించుకోవడం గమనార్హం.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఖర్చులు తక్కువ చేసి చూపుతామంటే కుదరదు. ప్రస్తుత ధరలను బట్టి ఎన్నికల కమిషన్ దేనికి ఎంత వ్యయమవుతుందో ఓ లెక్కను సిద్ధం చేసుకుంది. ఈ లెక్క ప్రకారం అభ్యర్థులు తమ ఖర్చులను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అభ్యర్థి వెంట అనుచరులు వస్తారు. ప్రచారానికి వెళ్లడానికి వాహనం, అనుచరుల భోజన సదుపాయాలు చేయాల్సిందే. మరో వైపు సభలు, ర్యాలీలు చేస్తే మరింత వ్యయం. వాటికి సంబంధించిన లెక్కలను ఈసీకి అభ్యర్థులు చూపాల్సి ఉంటుంది. వాటర్ ప్యాకెట్ నుంచి సాంబారు ఇడ్లీ, చికెన్ బిర్యానీ, ఎక్కిన వాహనం, పెట్టిన మైక్, కట్టిన బ్యానర్, ఎగిరిన జెండాకు లెక్కలను పక్కాగా ఈసీకి చూపించాల్సిందే. అభ్యర్థుల వ్యయ పరిశీలనకు మండల, నియోజకవర్గ స్థాయిలో ఈసీ పరిశీలకులను నియమించింది.