• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

నాన్నా.. సంబరాలకు వెళ్లొస్తానని చెప్పి..

నాన్నా.. సంబరాలకు వెళ్లొస్తానని చెప్పి..

Two youths killed after crashing into an electric pole వజ్రపుకొత్తూరు మండలం చినతామాడవానిపేట గ్రామం సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇదే మండలం ఉద్దాన గోపినాథపురానికి చెందిన కర్ని కోదండరావు(28), గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ (23).. సైనూరులో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలకు ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో తిరిగి తమ ఊర్లకు బయలుదేరారు. చినతామాడవానిపేట గ్రామం వద్ద వీరి బైక్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆ నిధులు ఏమయ్యాయి?

ఆ నిధులు ఏమయ్యాయి?

Complaint lodged with CMO regarding Paidibhimavaram Panchayat పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సోమవారం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పంచాయతీలో సాధారణ నిధులు రూ.3కోట్లకుపైగా పక్కదారి పట్టించారని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

గదుల్లో పుస్తకాలు.. నేలపై చదువులు

గదుల్లో పుస్తకాలు.. నేలపై చదువులు

టెక్కలి జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా విద్యార్థులు నేలపైనే చదవా ల్సివస్తోంది. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 656 మందిపైగా విద్యార్థినులు అభ్యసిస్తున్నారు.

వసతులు లేవు.. వంట గది లేదు

వసతులు లేవు.. వంట గది లేదు

మండలంలోని చీడివలస పంచాయతీ పరిధిలో గల జిల్లేడువలస ప్రాఽథమికోన్నత పాఠశాలలో సమస్యలు తిష్ఠవేశాయి.

మెరుగైన బోధనకు చర్యలు

మెరుగైన బోధనకు చర్యలు

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన బోధనకు చర్య లు తీసుకుంటున్నామని, అలాగే విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్పీదు ఇస్తున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్‌) అడిషనల్‌ సెక్రటరీ రాజ్యలక్ష్మి అన్నారు.

కొడుకు చితికి తల్లి తలకొరివి

కొడుకు చితికి తల్లి తలకొరివి

కన్న కొడుకుకి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సోమవారం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు.. తెలంగాణలోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో భరత్‌ మృతిచెందాడు.

భారీ వాహనాలతో బేజారు

భారీ వాహనాలతో బేజారు

మం డలంలోని అలికాం- బత్తిలి ప్రధాన రోడ్డులో పరి మితికి మించిన బరువుతో భారీ వాహనాల రాక పోకలతో గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనచోదకులు బేజారవుతున్నారు. దగ్గరకు వచ్చే వరకూ గోతులు కనిపించకపోవడంతో ద్విచక్రవాహ నాలపై వచ్చే వాహనచోదకులు ప్రమాదాలకు గురవు తున్నారు.

అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే అర్జీలను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారు లను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 155 అర్జీలను స్వీకరించారు.

  ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోండి

ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోండి

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి సమస్య లపై తాము స్పందించి ఉచితంగా న్యాయసహా యం అందజేస్తామని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.

ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలి

ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలి

ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలిం చి చట్టపరంగా విచారించి బాధితులకు న్యాయం చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి