• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలి

గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలి

గురుకులాల్లో పరిశుఽభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఏపీ గురుకుల విద్యాలయాల అడిషనల్‌ సెక్ర టరీ రాజలక్ష్మి అన్నారు.

‘బాహుదా’కు నిధుల వరద

‘బాహుదా’కు నిధుల వరద

Government sanctions Rs 1.10 crore బాహుదా నదిపై కూటమి ప్రభుత్వం కరుణ చూపింది. అభివృద్ధి పనులకు సోమవారం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. బెల్లుపడ వరద గట్టు నిర్మాణానికి రూ.70 లక్షలు, బెల్లుపడ, లొద్దపుట్టి గ్రోయిన్ల నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయించింది.

తప్పని నిరీక్షణ

తప్పని నిరీక్షణ

Transfers for 321 MTS teachers బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎంటీఎస్‌(మినిమం టైం స్కేల్‌) ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం డీఎస్సీ -2008 చెందిన 108 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. మంగళవారం 1998 - డీఎస్సీకి చెందిన 213 మంది ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం

ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం

మందస మండలం దన్నువూరు క్లస్టర్‌ విలేజ్‌ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాద్‌పై నమోదైన ఏసీబీ కేసులో పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావు (రిటైర్డ్‌)పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

వంశధార కాలువ కబ్జా

వంశధార కాలువ కబ్జా

Vamsadhara Canal.. Encroachment వంశధార కాలువనూ అక్రమార్కులు వదలడం లేదు. నరసన్నపేటలోని జమ్ముజంక్షన్‌ సమీపంలో పాపయ్య చెరువుకు ఆనుకొని ఉన్న 11 ఆర్‌ కిళ్లాం కాలువ గట్టుపై అక్రమ నిర్మాణం చేపట్టారు.

మార్కెట్‌ సెస్‌ విధిస్తే జీడి పరిశ్రమలు బంద్‌ చేస్తాం

మార్కెట్‌ సెస్‌ విధిస్తే జీడి పరిశ్రమలు బంద్‌ చేస్తాం

డిపప్పుపై మార్కెట్‌ కమిటీకి ఒక శాతం సెస్‌ కట్టాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు మంగళవారం జీడి వ్యాపారులతో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.

 ఆదుకోవాల్సిన కొడుకు అనంత లోకాలకు...

ఆదుకోవాల్సిన కొడుకు అనంత లోకాలకు...

ఆదుకుంటాడని ఆశించిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విషాద ప్రయాణం

విషాద ప్రయాణం

Car-Lorry Collision.. two members dead వివాహమై ఏడేళ్ల తరువాత ఎన్నో నోములు నోచుకొన్నాక.. లేకలేక పుట్టిన బిడ్డ కావడంతో ఆమె కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో తండ్రి కూడా చూడకుండా క్షణమైనా ఉండలేకపోయేవాడు. ఇక తాత వెంటే మనవడు. మనవడ్ని వదలని తాత. బయటికి వెళ్తే తాత ఒడిలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు. చిన్నారి ముద్దు ముద్దు మాటలు వింటూ తాత మురిసిపోయేవాడు. సోమవారం కూడా కారులో వెళ్తున్న ఆరుగురిలో.. ఐదుగురు చిన్నారితో ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండు గంటల పాటు వారి ప్రయాణం సాగింది. మరికొద్ది నిమిషాల్లో గమ్యం కూడా చేరుకుంటారనగా కారు అదుపుతప్పి డివైడర్‌ ఎక్కింది. పక్క రహదారిపైకి వెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న చిన్నారి తండ్రి తేరుకునేలోపే లారీ వచ్చి ఢీకొని ఈడ్చుకుపోయింది.

పల్లెల్లోనూ రియల్‌ దందా

పల్లెల్లోనూ రియల్‌ దందా

Illegal layouts at srikakulam జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో పట్టణానికి 10 కిలోమీటర్లు దూరం వరకు వెలసిన అక్రమ లేఅవుట్లు.. నేడు మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో వేస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతల అండతో డీపట్టా భూముల్లో వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు.

జైలుకు వెళ్లొచ్చి.. బైక్‌లు దొంగిలించి..

జైలుకు వెళ్లొచ్చి.. బైక్‌లు దొంగిలించి..

Inter-district thief arrested అంతర్‌జిల్లాల బైక్‌ దొంగ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా ఆయనలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్ర వాహనాల దొంగతనం చేస్తూ.. వాటిని విక్రయించేవాడు. ఈక్రమంలో పోలీసులకు పట్టుబడగా.. ఆయన నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి