రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన రాష్ట్ర బార్ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిశా యి.
హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ నాయకుడు రామకృష్ణపై శుక్రవారం దాడి జరిగింది.
State budget today అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లా సమగ్రాభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిధుల కోసం జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Ambulance employees.. Salary hike అత్యవసర వేళ ఆపద్బాంధవులుగా సేవలందిస్తున్న 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అలాగే కొత్తగా చేరి.. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.
Celebrations at Srimukhalingam శ్రీముఖలింగ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 18 వరకు వేడుకలు నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Ready for the exams ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పాల్గొన్నారు.
Mandasa Brahmotsavam మందస వాసుదేవ ఆలయంలో వారం రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 గంటలకు అశేష భక్తజనావళి మధ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
Budget in the Assembly tomorrow జిల్లా అభివృద్ధి రథచక్రాలు ముందుకు సాగాలంటే ‘నిధుల’ ఇంధనం అత్యవసరం. ఈనెల 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై సిక్కోలు వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
Rs.50 hike on a kilo of cashew nuts పలాస-కాశీబుగ్గ జీడిమార్కెట్లో జీడిపప్పు ధరలు ఊపందుకున్నాయి. ప్రథమశ్రేణి జీడిపప్పు ధర కిలో రూ.900 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే అన్ని రకాల జీడిపప్పులపై కిలోకు రూ.50 పెరగడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Rally protesting the central government's attitude కార్మికులను బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని వామపక్ష సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. అఖిలభారత సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక, రైతు, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.