కర్నూలులో ఈనెల 13 నుంచి 15 వరకు జరి గిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్ 59 కిలోల విభాగంలో బంగారు పతకం సాధిం చాడు.
జిల్లాలో వాహనాలకు ఎల్ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి వెదజల్లుతుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తోన్నారు.
పిల్లల్లో నులిపురుగులను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత పిలుపునిచ్చారు.
రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ను రూపొందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యం లభించింది.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత మంచినీటి పథకం పైపులైన్ను అనుసంధానించేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక నిధులు రూ.60 లక్షలు మంజూరు చేసింది.
ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పి స్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. 15.25 లక్షలు వసూలు చేసి.. నకిలీ నియామక పత్రా లతో మోసగించిన ఘటన శ్రీకాకుళం నగరంలో వెలుగుచూసింది.
మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్యూలైన్లు..బారికేడ్లతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ముఖ్యమైన క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.
పిన్న వయసులోనే ముఖ్య మంత్రిగా వ్యవహరించి నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తి దామోదం సంజీవయ్య అని, ఆయన జీవితం ఆదర్శప్రా యమని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.
ప్రజా సమ స్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.