స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. జిల్లాస్థాయి ఉత్సవాలకు ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి శనివారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, నిర్వాసి తులకు న్యాయం చేయడం కూడా అంతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో వెలిగొండపై ప్రత్యేకంగా చర్చించారు.
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. వారిని అన్నివిధాలా ఆదుకొంటున్నదన్నారు. శుక్రవారం కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి నియోజకవర్గంలోని 49 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను మంత్రి అందజేశారు.
బీసీ రిజర్వేషన్లపై నియమించిన గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు- బీసీ రిజర్వేషన్ అధ్యయన (డెడికేటెడ్ కమిషన్) రాజీవ్ రంజన్మిశ్ర కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన పదవులు, ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కేటాయించాల్సిన వాటితోపాటు కుటుంబ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 703 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (ఏఐ) పోస్టులను మంజూరు చేస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ప్రకాశం జిల్లాకు 241, మార్కాపురం జిల్లాకు 462 పోస్టులు ఇచ్చారు.
ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం, రైతులకు ఎదురైన ప్రతికూల పరిస్థితి వచ్చే ఏడాది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ తెలిపారు.
‘గత వైసీపీ ప్రభుత్వం చేసినట్టు మేము మోసం చేయలేదు.. వెలిగొండ పూర్తి చేస్తాం.. ఈ నెలకు మొదటి దశ పూర్తిచేసి నీరిస్తామని చెప్పాం.. ఆ మాట ప్రకారం నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు స్పష్టం చేశారు.
జీవో నంబరు 306 దళారులకు, కొందరు అధికారులకు వరంగా మారింది. పదేళ్లు పైబడి అసైన్డ్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటూ పన్ను చెల్లిస్తున్న పేదలకు ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
దర్శి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మెతకవైఖరి అవలంబిస్తుండటంతో అక్రమార్కులు లెక్కచేయడం లేదు. నోటీసులిచ్చినా పట్టించుకోకుండా ఆన్లైన్ విక్రయాలు యథేచ్ఛగా చేస్తున్నారు.
గ్రానైట్ లారీలు గడగడలాడిస్తున్నాయి. కనిగిరి వాసుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పట్టణ సమీపంలోని గార్లపేట రోడ్డులో ఉన్న గ్రానైట్ క్వారీలు, కటింగ్ యూనిట్ల నుంచి ప్రతిరోజూ వందల టన్నుల రాయిని భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు.