గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు సమీపంలో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న గనుల శాఖ కార్యాలయానికి ఆదివారం ఆయన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో కలిసి భూమి పూజ చేశారు.
ఈ ఏడాది పొగాకు సాగు ఆరంభం నుంచే రైతులకు అవస్థలు ప్రారంభమయ్యాయి. నాట్ల దశలోనే పాట్లు పడాల్సి వస్తోంది. గత నెలలో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో సకాలంలో పంట సాగు చేయలేకపోయారు. వానలకు చాలాచోట్ల దొడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పొగాకు నారుకు కొరత ఏర్పడింది. దీంతో నారు ధర భారీగా పెరిగింది.
సత్యసాయిబాబా శతవర్ష జ యంతి ఉత్సవాలు స్థానిక ప్రేమసుధా మందిరంలో అత్యంత వైభవంగా జరిగా యి. 5 రోజులుగా జరుగుతున్న జయం తి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.
మార్కాపురం పట్టణ పరిధిలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని భగత్సింగ్ కాలనీ సమీపంలో గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేయని డీప్బోర్కు మున్సిపాలిటీ అధికారులు మరమ్మతులు చేయించారు.
రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అంటారు. చంద్రమండలానికి సైతం దారులు వెతికే నేటి ఆధునిక యుగంలో తరతరాలుగా నివాసముంటున్న గ్రామానికి సరైన రహదారి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి విద్యార్థులకు విహారయాత్ర ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంతోషం కోసం విహారయాత్ర ఏర్పాటుకు తన సొంత నిధులను వెచ్చించి ఏర్పాట్లుచేశారు.
మండలంలో తాళ్లూరు - శివరాంపురం రోడ్డు అధ్వానంగా మారింది. ఈ ఆర్అండ్బీ రోడ్డు తాళ్లూరు నుంచి వెల్లంపల్లి వరకు ఉంది. బీటీ రోడ్డు మెటల్ రోడ్డును తలపిస్తుంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో గనుల సీనరేజీ పాలసీ సరళీకృతం చేస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.
పంచాయతీలలో నిధుల దుర్వినియోగంపై విచారణలు అటకెక్కాయి. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రజా సొమ్మును డ్రా చేసుకుని స్వాహా చేస్తూనే ఉన్నారు.
ఒంగోలులోని మెప్మా కార్యాలయంలో మరోసారి రచ్చ మొదలైంది. పొదుపు సభ్యులకు తెలియకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన ఓ ఆర్పీ వాటిని బ్యాంకులకు చెల్లించకపోవడంతో తమకు నోటీసులు వస్తున్నాయంటూ బాఽధితులు రోడ్డెక్కారు.