వేసవిలో మూగజీవాలకు ఎట్టకేలకు ఊరట దక్కింది. పల్లెపండుగ కింద నిర్మించిన నీటి తొట్టెలు వాటి దాహార్తిని తీరుస్తున్నాయి. ఎండలు మండుతున్న సమయంలో పశువులు, గొర్రెలు, ఇతర పశుసంపద తాగేందుకు నీరు కూడా దొరక్క తల్లడిల్లడం, వాటి పరిస్థితిని చూసి పశుపోష కులు ఆవేదన చెందడం పూర్వ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యకృత్యం.
మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతులపై ఒత్తిడి చేయకుండా ఎక్కువ మొత్తంలో నీటి తీరువా పన్ను వసూలు చేయాలని సాగర్ కుడికాలువ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు సూచించారు. వచ్చే నిధులతో సాగర్ కాలువల మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జరగనుంది. అందుకు జిల్లా అంతటా తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అవిర్భవించి ఈనెల 29 నాటికి 43 ఏళ్లు పూర్తవుతున్నాయి. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం సూచించింది.
ఒంగోలులోని ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. బుక్ చేసుకున్న తర్వాత ఐదారు రోజులకు కూడా సరఫరా చేయకపోవవంతో ప్రజలు సిలిండర్లను తీసుకొని ఏజెన్సీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. వచ్చేనెల 2వతేదీతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచే పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి.
సంతమాగులూరు మండలంలో ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య విభేదాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈవో రేణుక విచారణకు ఆదేశించారు. ‘ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య కోల్డ్వార్’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. విచారించి నివేదిక అందజేయాలని చీరాల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగాధరరావును ఆదేశించారు.
జిల్లాలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలోనే మంటలు మొదలయ్యాయి. వడగాడ్పులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ రెండు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు హెచ్చరించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.
చీమకుర్తి బైపా్సపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చీమకుర్తి పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుచున్న విద్యార్థి బొడ్డు తరుణ్(15) దుర్మరణం పాలయ్యాడు.