ఏమైనా సమస్యలు ఉన్నాయా, పింఛన్ను సొమ్మును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం కావాలా అంటూ పింఛన్దారులను కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలే అత్యంత కీలకమని కలెక్టర్ రాజాబాబు చెప్పారు.
రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది బ్రాహ్మణులతో జులై 19వ తేదీన రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ భమిడిపల్లి వెంకటరమణమూర్తి తెలిపారు.
జీవితంలో ఎదురైన తీవ్ర విషాదం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. వైవాహిక జీవితంలో ఇబ్బందులుపడినా నిరాశకు లోను కాకుండా తన చదువు కొనసాగించి ఈ ఏడాది ఇంటర్మీడియట్లో 990 మార్కులు సాధించి ప్రతిభ చాటింది కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలోని రామాయపల్లికి చెందిన విద్యార్థిని కటికల భాగ్యశ్రీ
వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్ట్ కోసం ఇళ్లు, భూములు, ఊళ్లను త్యాగం చేసిన వారి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఆందోళనలు, నిరసనలు చేసి తీవ్ర నిర్వేదంలో ఉన్న వారికి ఇప్పుడు ఉపశమనం కలిగింది.
వచ్చే సీజన్ పొగాకు పంట ఉత్పత్తి పరిమాణంలో భారీగా కోతపడనుంది. రాష్ట్రంలో కేవలం 81 మిలియన్ కిలో లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఆమేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి పొగాకు బోర్డుకు స్పష్టమైన సమాచారం అందింది.
ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెల కొంది. మొదటిదశ దాటి అడుగు ముందుకు పడలేదు. అందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా జారీ చేసిన షెడ్యూల్ సోమవారంతో ముగిసింది.
వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలులోని హౌసింగ్బోర్డు కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
మండలం లోని రామాయపాలెం గ్రామానికి పండుగ వచ్చింది. జిల్లా స్థాయి ఏరువాక ఉత్సవానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జిల్లాస్థాయి అధికారులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లాలోని కరువు మండలాల్లో 2025-26 రబీ పంట నష్టపరిహారం కోసం రూ.6.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా గతంలో ప్రకటించింది.