జిల్లాలో ఓట్ల నమోదుకు భారీ స్పందన కనిపించింది. వివిధ కారణాలతో తొలగించిన ఓట్లతోపాటు సర్ ప్రక్రియ సమయంలో అందుబాటులో లేని వారు ప్రస్తుతం ఆన్లైన్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు.
ఒంగోలు రత్నమహల్ సెంటర్లో ఓ వ్యక్తి కారుతో హల్చల్ చేశాడు. గురువారం ఉదయం పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి వెళుతున్న కారు స్థానిక రత్నమహల్ సెంటర్ వద్ద హల్చల్ చేసి చోదకుడు ప్రమాదానికి గురయ్యాడు.
బాల భవిత కేంద్రంలోని చిన్నారులకు కృత్రిమ అవయాలను గురువారం జీజీహెచ్లో జేసీ కల్పనాకుమారి అందజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుత పొగాకు మార్కెట్ ఒడిదొడుకులకు అధికోత్పత్తే కారణం. అలాగే యుద్ధంతో ఎగుమతులకు ప్రతికూలత, ఇతర దేశాల్లో భారీగా పంట ఉత్పత్తి, జీఎస్టీ పెంపు వంటివి కీలకంగా మారాయని బోర్డు విశ్లేషిస్తోంది.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించి నీటి తరలింపులో కీలకమైన ఫీడర్ కెనాల్ సిద్ధమైంది. రూ.450 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొల్లంవాగు నుంచి టన్నెళ్ల ద్వారా వచ్చే నీరు కొత్తూరు వద్ద ఫీడర్ కెనాల్కు చేరి ఎటువంటి అవరోధం లేకుండా నల్లమల జలాశయంలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
భూగర్భ గనుల శాఖలో సీబీఐ వణుకు పుట్టించింది. మంగళవారం నాటి దాడుల ప్రభావం ఆయా కార్యాలయాల్లో బుధవారం కూడా కనిపించింది. వరుసగా ఏసీబీ, సీబీఐ దాడులతో జిల్లాలోని మైనింగ్ శాఖలో కలకలం మొదలైంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు పడు తున్నాయి. జిల్లా సహకార శాఖలో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల స్థాయిని బట్టి ఆయా పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్రస్థాయిగా గుర్తింపు పూర్తయింది.
ఓటర్ల సమగ్ర సవరణ (సర్) ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటర్లకు జారీ చేస్తున్న నోటీ సుల్లో అనేక అసంబద్ధాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి వారి స్వగ్రా మం ఎక్కడ ఉందో కూడా తెలియదు. వారు పుట్టకముందే తల్లిదండ్రులు మరొక చోట స్థిరపడిపోయారు.