జిల్లాలో భూ సమస్యలు అధికమవుతున్నాయని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వారు మాట్లాడారు.
సింగరాయకొండ మండలం పాకల తీరంలో రెండు రోజులపాటు జరగనున్న సంబరాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చాయి. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అందులో భాగంగానే వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది పేదలకు శాపంలా మారిందన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని తుమ్మలచెరువుకు వచ్చారు.
గతేడాది నేర్పిన పాఠాలతో పలువురు రైతులు వైట్బర్లీ పొగాకు సాగుచేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో కంపెనీలు తమ సిబ్బంది, ప్రతినిధులను గ్రామా లకు పంపాయి. వారు రైతులను ప్రోత్సహించారు. ఎంత సాగుచే సినా క్వింటా రూ.16వేలకు కొనుగోలు చేస్తామని నమ్మబలికారు.
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారాన్ని దాతలు శుక్రవారం అందజేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ముప్ప వరపు సుధీర్, ప్రత్యూష దంపతులు రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారాన్ని మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు సమక్షంలో ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకరరావుకు అందజేశారు.
మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగం నాటుబండి పోల్రాదా పోటీలు ఉత్సాహంగా సాగాయి.
గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ రోగుల పాలిట సంజీవినిలా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ఉండడంతో స్థానిక రోగులే కాకుండా దూరప్రాంతాలు, పక్కజిల్లాల రోగులు సైతం ఇక్కడకు వచ్చి రక్తాన్ని శుద్ధి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారు.
శివరాత్రి పండుగ సందర్భంగా నిర్మమహేశ్వరాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనికనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్యశ్వంత్ చెప్పారు.
ఇచ్చిన హామీని అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని 108 సిబ్బంది ముక్తకంఠంతో చెప్పారు.
ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ గురువారం జిల్లాలోని కార్మికులు, ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది.