పదో తరగతి పబ్లిక్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈనెల 6నుంచి ప్రారంభంకానున్న మూల్యాంకనాన్ని వినూత్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వచ్చేశాయి. పంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ఈనెల 2తో ముగిసిన విషయం విదితమే. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది.
దర్శి నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో చోటుచేసు కున్న అక్రమాలపై విచారణ అటకెక్కింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కొంతమంది కీలక అధికారులు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీ చేయించుకొని వెళ్లారు.
మండలంలోని రజానగరం మేజర్కు సాగర్ జలాలు సింగనపాలెం మైనర్ వద్ద పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
అడవిపంది ఎదురుగా రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గరు గాయపడ్డారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు ఆమోదించడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు అమరావతికి జై అంటూ కేరింతలు కొట్టారు. ర్యాలీలతో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, ఊరూరా కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శనలు చేశారు.
అత్తింటి ఆరళ్లను తట్టుకోలేక ఓ గర్భిణి పురుగుమందు తాగి మృతి చెందింది. కనిగిరిలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వరి పండించిన రైతులు మార్కెట్ మాయాజాలంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. మిల్లర్లు, వ్యాపారుల చేతిలో దగాకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికి వచ్చేవరకు అనేక ఇబ్బందులు పడటం పరిపాటైంది.
జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్లను ఇటు సిబ్బంది, అటు టీడీపీ శ్రేణులు కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. పేదల సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పలువర్గాల వారి సంక్షేమం కోసం సామాజిక పింఛన్లు అందజేస్తున్న విషయం విదితమే.