ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై తొలివారం ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి.
దక్షిణాది పొగాకు మార్కెట్లో నోబిడ్లు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మార్కెట్లో 33శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. శనివారం నాటి కన్నా ఒక్కసారిగా ఏకంగా 10శాతం పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
మార్కాపురం జిల్లాలో 50 వేల గ్యాస్ కనెక్షన్లపై వేటు పడనుంది. ఈకేవైసీ చేయించుకోని వినియోగదారులకు తొలుత బుకింగ్ నిలిపివేసి ఆ తరువాత పూర్తిగా రద్దు చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.
పాలేరు తీర గ్రామాల మధ్య ఇసుక వ్యవహారం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు ఏకంగా ఓ గ్రామం వారి రక్షిత నీటి పథకం పైపులైన్లు, రాకపోకలు సాగించే రోడ్డును పాలేరు తీరంలోని మరోవైపు గ్రామం వారు ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ భూముల్లోని జామాయిల్ చెట్లను కూడా తొలగించారు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి సోమవారం జరగాల్సిన మండల స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇందుకు సంబంధించిన తుది సీనియారిటీ జాబితాల జాడ లేకపోవడంతో కౌన్సెలింగ్ నిర్వహణ డోలాయమా నంలో పడింది.
విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్కు లీప్ యాప్ను డౌన్లోడ్ చేయడంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వెనుకం జలో ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 25వ స్థానంలో ఉంది.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు. మార్కాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ఆయన పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్)గా ఐపీఎస్ అధికారి అయిన నవజ్యోతి మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
షె డ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు తెలిపారు.
పర్యావ రణ పరిరక్షణ, ఎల్నినో ప్రభావం తగ్గించటం కోసం మెక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒ క్కరూ ఓ ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు.