జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆమేరకు స్పష్టంగా తెలియజేస్తోంది. తుఫాన్ వల్ల ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రభావం శనివారం నుంచే కనిపిస్తోంది. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ శనివారంతో ముగిసింది. రైతు సేవా కేంద్రం యూనిట్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 516 ఆర్ఎస్కేల పరిధిలో 2.78 లక్షల కుటుంబాలను ఆయా శాఖల సిబ్బంది కలిశారు.
దర్శి ప్రాంతంలోని పాల కేంద్రాల్లో ఆహార భద్రత అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గురువారం ‘పాల కూట విషం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి వారు స్పందించారు. మండలంలోని చలివేంద్ర గ్రామంలోని డెయిరీ ఫాంలో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఆహార భద్రతా అధికారి శివకృష్ణ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల విభజన, విలీనంపై ఐదేళ్లుగా అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని సమీప పట్టణ, స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని కేశవస్వామిపేటకు చెందిన యానాది సామాజికవర్గానికి చెందిన పలు పొదుపు సంఘాల బాధ్యతను చూసేఆర్పీ దివ్యశాంతిపై బాధితులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
తమ వద్ద ఉన్న బంగారం తాకట్టుపెట్టుకొని నగదు కావాలని వచ్చిన ఇద్దరు వ్యక్తులు జ్యూయలరీ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించిన సంఘటన త్రిపురాంతకంలో జరిగింది.
పొదిలిలోని పొగాకు వేలం కేంద్రం నిర్వహణ 208 రోజులు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగి గురువారంతో ముగిసింది. చిన్నచిన్న అవాంతరాలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆదరణ పెరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. బడులకు వచ్చే పేద విద్యార్థులకు రుచికరంగా, శుచికరంగా నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంది.
జిల్లా పునర్విభజన విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న తాజా నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోవాలంటే చంద్రన్న మార్కాపురం జిల్లా పేరుతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.