• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

అద్దంకి వైసీపీలో ముసలం

అద్దంకి వైసీపీలో ముసలం

అద్దంకి నియోజకవర్గ వైసీపీలో ముసలం పుట్టింది. ఇప్పటికే సరైన నాయకత్వం లేక పలువురు నేతలు, కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు. ఈక్రమంలో తాజాగా ముగ్గురు మండల కన్వీనర్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు.

మొక్కజొన్న రైతుకు   ‘మద్దతు’ ఏదీ

మొక్కజొన్న రైతుకు ‘మద్దతు’ ఏదీ

ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రోజురోజుకూ ధర దిగజార్చి కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం క్వింటా రూ.1,700కు మించి కొనడం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వాల నిర్ణయాలు ఆలస్యమైతే మొక్కజొన్న రైతులు నిండా మునిగిపోయే ప్రమాదముంది.

లెక్క.. పక్కా!

లెక్క.. పక్కా!

ప్రజా ప్రభుత్వం బడ్జెట్‌పై వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన నిధుల కేటాయింపులపైనా స్పష్టతనిచ్చింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు వివిధ సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపుల కింద సుమారు రూ.4,200 కోట్లు ఈఏడాది లబ్ధి చేకూరనుంది.

మునిసిపాలిటీల్లో ముందస్తు ప్రణాళిక

మునిసిపాలిటీల్లో ముందస్తు ప్రణాళిక

వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు పురపాలక అధికారులు ముందస్తు ప్రణాళికను రూపొందించారు. గతంతో పోల్చితే ఈసారి పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేనప్పటికీ ఎక్కడా గొంతెండకుండా చర్యలు తీసుకుం టున్నారు.

తౌషిక్‌ మృతిపై మళ్లీ దర్యాప్తు

తౌషిక్‌ మృతిపై మళ్లీ దర్యాప్తు

మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధి శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో కనిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి షేక్‌ సయ్యద్‌ తౌషిక్‌ (11) అనుమానాస్పద మృతిపై మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారంటూ బాలుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఏఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించాలని, కేసును పునర్విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది.

రైలు కూత ఎప్పుడు?

రైలు కూత ఎప్పుడు?

నడికుడి-శ్రీకాళహస్తి లైను నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ రైళ్లు నడపడంలో జాప్యం జరుగుతోంది. రైల్వే సేఫ్టీ అధికారులు రెండు నెలల క్రితం లైన్‌ను పరిశీలించి ఆమోదం తెలిపారు. 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చారు.

ఒంగోలులో పెట్టుబడిదారుల సదస్సు

ఒంగోలులో పెట్టుబడిదారుల సదస్సు

జిల్లాలో పరిశ్రమల స్థాపనను మరింత వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జూన్‌ ఆఖ రులో ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయిం చింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ రాజాబాబు శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి

పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి

ఒంగోలులో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి జవా బుపత్రాల మూల్యాంకనానికి ఉపాధ్యా యుల నియామకంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆటోమేషన్‌ విధానంలో చేపట్టిన మూల్యాంకన విధుల కేటాయింపుల్లో భారీగా తప్పులు దొర్లాయి.

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో కేంద్రాలను ప్రారంభిం చేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రబీ సీజన్‌లో ప్రకాశం జిల్లాలో 69,079 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.

మార్కెట్‌లో అనిశ్చితి

మార్కెట్‌లో అనిశ్చితి

రాష్ట్రంలో ఈ సీజన్‌ పొగాకు కొనుగోళ్లు పూర్తిగా ప్రారంభం కాకుండానే మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వారంక్రితం దక్షిణాదిలోని పొదిలి, కందుకూరు కేంద్రాలు.. ఉత్తరాదిన రాజమండ్రి రీజియన్‌ పరిధిలోని ఐదు కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు. అక్కడ లభిస్తున్న ధరలు, కొనుగోళ్ల తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి