బాపట్ల జిల్లా పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం కోతకు గురైంది. శనివారం రాత్రి నుండే విపరీతంగా ఏర్పడిన అలల తాకిడికి ఆదివారం ఉదయం సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పొట్టిసుబ్బయ్య పాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకు సుమారు 2 కిలో మీటర్లు పొడవు, అలాగే 20 మీటర్లు దూరం నుండి కోత ఏర్పడింది.
వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని ఏపీ మంత్రి బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ముప్పయ్యేళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా వాసుల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 31వ తేదీన వెలిగొండ మొదటి దశను ప్రారంభించి నీరు విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించారు.
పోలీసుల పార్టీ వ్యవహారం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీయగా అభూతకల్పనలతో దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ అభాసుపాలైంది. అటు సీఎం, ఇటు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ల జోక్యంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అసలేం జరిగిందనే విషయాన్ని తేటతెల్లం చేశారు.
కరవు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
జిల్లాపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు మూడోవారం దాటుతున్నా వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి సరైన వర్షం కురిసిన దాఖలాలు లేవు.
వెలిగొండ నిర్వాసితులు ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. పుట్టి పెరిగిన ఇళ్లు, తరాలుగా సాగు చేసుకున్న భూములు విడిచి తమతో ముడిపడిన జ్ఞాపకాలను అక్కడే వదిలి బరువెక్కిన గుండెలతో కొత్త ఊళ్లవైపు పయనం ప్రారంభించారు.
పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్కు రోగుల తాకిడి పెరిగింది. ప్రతిరోజూ సాధారణంతోపాటు, అత్యవసర సేవలకు వచ్చేవారితో వైద్యశాల కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.
జిల్లాలో పొలాలకు వెళ్లేందుకు దారులు సరిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోతలు పూర్తిచేసి ఉత్పత్తులను ఇళ్లకు తెచ్చేం త వరకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా పలురకాల వస్తువులను పొలాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేయాలి.
పోలీసుల కారు ప్రమాదంపై ఆరా తీసిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఇటీవల పోలీసు అధికారులు వెళ్తున్న కారు ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడి ప్రజలు పోలీసుల తీరును తప్పుబట్టారు.