పొగాకు వేలం తీరుపై తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు పోరుబాట పట్టాలని తీర్మానించినా దక్షిణాది మార్కెట్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నియంత్రించి వేలంను సజావుగా కొనసాగించడంలో పొగాకు బోర్డు అధికారులు సఫలం కాలేకపోతున్నారు.
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు వైపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి కూట మి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి పేర్కొన్నారు. సింగరాయ కొండ మండలం పాకల పంచాయతీ పరిధి లోని పల్లెపాలెం, చెల్లెమ్మగారిపాలెం, క్రాంతిన గర్, పోతయ్యగారి పట్టపుపాలెం, ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెల్లో మంగళ వారం నిర్వహించిన మత్స్యకార సేవ పథకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఒంగోలు మండలం కరవది రెవెన్యూ పరిధిలో గల ముదిగొండి వాగును రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుల్లగుల్ల చేస్తు న్నారు. అడ్డగోలు తవ్వకాలతో వాగును ధ్వంసం చేసేస్తు న్నారు.
మార్చి 26న మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు.
రైతులకు విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించి నాణ్యమైన విద్యుత్ అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు.
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు వేసవి ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వడగాలులు వీస్తుండటంతో పని ప్రదేశాలలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు, గిట్టుబాటు ధర సాధన కోసం పోరుబాట పట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్వహించిన రైతు సదస్సు తీర్మానించింది.
పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా వైసీపీ సోమవారం సింగరాయకొండలో చేపట్టిన నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీలో ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో అందిన వినతులను నిర్దేశిత గడువులోపు పరిష్క రించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్లోని మీకోసం హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.