మహాశివరాత్రి పర్వదిన వేడుకలను పర్చూరు నియోజకవర్గ పరిధిలోని శివాలయాల్లో విశేష పూజలు చేశారు.
రాష్ట్ర బడ్జెట్ ఉద్యానానికి ఊపు తెచ్చింది. బడ్జెట్ కేటాయింపులు జిల్లాలోని వివిధ రంగాలకు మేలు చేసేలా ఉండగా, అత్యధికంగా ఉద్యాన రైతులకు బాగా ఊతమిచ్చేలా ఉంది. గ్లోబల్ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయబోతుండటం, అందులో పూర్వ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలు ఉండడం విశేషం. ఇందుకోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవటంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. గుంతల రోడ్లతో నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈసారి రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కొంతమేర ప్రాధాన్యం లభించింది. ఇక్కడి అవసరాలకు పూర్తిస్థాయిలో కాకపోయినా ఆయా రంగాలకు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్తో పోల్చితే 70శాతానికిపైగా నిధులు కేటాయించారు.
పాకల బీచ్ ఫెస్టివల్ ఆరంభం అదిరిపోయింది. తీరంలో రాష్ట్ర సంస్కృతి, పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ రాజాబాబు తదితరులు ఉత్సవాలను ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యమని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. అందుకోసం రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీలలో రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
పచ్చాకు ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన ఘటన మండలంలోని గంగపాలెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది.
రానున్న ఆర్థిక సంవత్సరంలో కీలక రంగాలకు నిధులు కేటాయింపు చేసే రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శనివారం శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3.35లక్షల కోట్లకుపైగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో ఆదాయ వనరుల పెంపుకోసం రాష్ట్ర పురపాలక శాఖ ప్రవేశపెట్టిన బీపీఎస్లో ఒంగోలు నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ఊసేలేదు.
జిల్లాలో భూ సమస్యలు అధికమవుతున్నాయని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వారు మాట్లాడారు.