తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణానికి చెందిన షేక్ మున్నీకి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంజూరు చేయించిన రూ.58,713ల ఎల్ఓసీని బాధితునికి టీడీపీ నాయకులు అందచేశారు.
రాజకీయ నేతల దృష్టి అంతా నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రీకృతమైంది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న సమాచారానికి అనుగుణంగా సీనియర్ నాయకులు మండలాల వారీ బలాబలాలపై కూడికలు, తీసివేతల్లో మునిగిపోయారు. కొత్తవారికి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో ఔత్సాహికులు సైతం ఆ వైపు దృష్టి సారించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పలుచోట్ల ఉరుములు, పిడుగులు, వడగండ్లతో కూడిన వాన పడింది. అప్పటివరకు ఉక్కపోతతో వేడిగాలుల తాకిడి చూసిన ప్రజలు ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం కురిసి ఉపశమనం కలుగుతుందని భావించారు.
జల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమం సోమవారం జిల్లా అంతటా ప్రారంభమైంది. ఇది వందరోజులపాటు కొనసాగనుంది. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఇతర సంబంధిత శాఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హైస్కూలులో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులకు సబ్జెక్టులు బోధించని హైస్కూలు ప్లస్ టీచర్లతో పేపర్లు దిద్దిస్తున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఆరు మార్కులు కలపాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ (డీజీఈ) కేవీ శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, తద్వారా భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు మండలం కంచుపల్లె గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాటు మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీతోపాటు ఆసుపత్రి సేవలు ఈ ఏడాది ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ మెడికల్ కాలేజీ, బోధన ఆసుపత్రి నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.