పరిహారం విషయంలో బాధితులతో అధికారులు చెలగాటమాడుతున్నారు. పంగులూరు మండలం ముప్పవరం వద్ద హైవే నుంచి ప్రారంభమయ్యే బీకేవీ గ్రీన్ఫీల్డ్ రోడ్డు అద్దంకి మండలం బొమ్మ నంపాడు, జార్లపాలెం, ఉత్తర, దక్షిణ అద్దంకి, కొటికలపూడి, కుంకుపాడు, మోదేపల్లి నుంచి వెళ్తుంది. ఈక్రమంలో జరిగిన భూసేకరణలో చాలావరకు నష్ట పరిహారం చెల్లించారు.
రాళ్లపాడు ప్రాజె క్టును నిర్మించి 70 ఏళ్లు పూర్తికావస్తున్నందున దాని భద్రత దృష్ట్యా ఆధునికీకరణ చేపట్టాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎడమకాలువ పొడిగింపు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాలలో మంగళవారం ఆయన రాళ్లపాడు రిజర్వాయర్ సమస్యలను ప్రస్తావించారు.
ఈ ఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం జాప్యం కానుంది. గత ఏడాది మార్చి 10న దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆరంభించగా ఈ ఏడాది ఇంతవరకు ఆ ఊసే కనిపించడం లేదు. ఇప్పటికే మూడొంతుల పంట ఇళ్లకు చేరడంతో వేలంను ఎప్పుడు ప్రారంభిస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ వో)గా డాక్టర్ బి.మాధవీలత నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మార్టూరు, మండల పరిధిలోని వలపర్ల గ్రామానికి చెందిన షేక్ ఖాజావలి(30) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఫిల్టర్ బెడ్ల మరమ్మతులతో పర్చూరు ప్రజలకు కలుషిత నీటి సమస్యను పరిష్కారం లభించనుంది. చాలా కాలం తరువాత తాగునీటి పథకానికి సంబంధించిన ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. ప్రస్తుతం ఫిల్టర్ బెడ్లోని ఇసుకను మార్చటంతోపాటు మరమ్మతులు చేస్తున్నారు.
జిల్లాకే తల మానికంగా చీరాల నియోజకవర్గం వాణిజ్య, వ్యాపార రంగాలతో పాటు పర్యాటకంలోనూ దినదినాభివృధ్ధి చెందుతోంది.
సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పొదిలి శ్రీపార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన కాలంనాటిదిగా, దక్షిణకాశీగా పేరొందింది.
దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.