ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు.
మండలం లోని పలు పంచా యతీలను విభజించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామస్థు లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గుంటుపల్లి పం చాయతీ పరిధిలో ఉన్న తురకపల్లి, శంకరాపురం గ్రామాలను కొత్త పంచా యతీగా విభజించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముం డ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు కోసం సమగ్ర శిక్ష నిధులు రూ.2.53 కోట్లు మంజూ రయ్యాయి. ఇప్పటికే 90 శాతంమేర పనులు పూర్త య్యాయి.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
గుండ్లకమ్మ నదికి ఇటీవల వచ్చిన వరదలతో ఇసుక చేరింది. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు.
పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వం బాలికల హైస్కూ ల్లో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కలు వేశారు.
రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. ఆదివారం గిద్దలూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రారంభించారు.
ఉపాధి హామీ పనులు (2014-19 మధ్య) చేసినా గత వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపు చర్యలతో బిల్లులు రాక అప్పులపాలైన వారికి ఊరట లభించనుంది. ఆ పనుల నమోదుకు ప్రస్తుత ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.