Home » Andhra Pradesh » Prakasam
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ.షరీఫ్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 4వ డివిజన్లో ముస్లింలతో టీడీపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్, మాగుంట ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
పొగాకు మార్కెట్ మురిపిస్తోంది. పలు రకాల గ్రేడ్లకు రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. మంగళవారం మేలు రకం ఏకంగా కిలో రూ.300 పలికింది.
వైసీపీని వీడి టీడీపీలో చేరే వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ కార్యకర్త లు ఒరవడి ఓవైపు కొనసాగుతుండగానే వైసీపీలోని జిల్లా స్థాయి నాయకులు సైతం టీడీపీ గూటికి చేరుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగ చిరకాల కోరికను తీరుస్తామని టీడీపీ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో దారుణంగా తయారైంది. మేదర, కుమ్మరి, కంసాలి, రజకులు, క్షురకులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, చెప్పులు కుట్టేవారు, ఎలక్ర్టీషియన్లు ఇలా ఒకటేమిటి అన్ని చేతివృత్తిదారుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉద్యోగుల్లో లభించని ఆదరణ... పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ తటస్థ ఓటర్లలో బయటపడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత... అంటీముట్టనట్లుగా ఉన్న సొంత పార్టీలోని అసమ్మతివాదులు.. క్రమేపీ దూరమవుతున్న ఓటర్లు... ఇదీ ప్రస్తుతం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి. ఓటమి భయంతో బెంబేలెత్తుతున్న అధికార పారీ నేతలు ఓటర్లకు వారం ముందుగానే నగదు పంపిణీకి తెరలేపింది.
జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఆప్రాంతంలో ఎండలు మండిపోయాయి. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
అధికార వైసీపీ తెర చాటు కార్యకలాపాలకు ఆ కళాశాల అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలతో హడావుడిగా మారింది. బహిరంగంగా కార్యకలాపాలు జరుగుతున్న ప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.
ఒంగోలు జీజీహెచ్లో గతనెల 10న చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి కేసులు నమోదైన టీడీపీ శ్రేణులకు ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారం భంకానుంది.