పోలీసు అంటే భయంతో కూడిన గౌరవం పెరగాలని, ఆ విధంగా అందరూ పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్కి చెందిన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఇవ్వాల్సిన రూ.7వేల నగదు ఇవ్వలేదని కోపం పెంచుకున్నాడు. గొడ్డలితో తలపైకొట్టి, కత్తితో గొంతుపై పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఇంట్లో నగదు దొరక్కపోయేసరికి హతుడు వేలికి ఉన్న ఉంగరాన్ని అపహరించుకొని పరారయ్యాడు.
తల్లి జీవించి ఉండగానే మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం పొంది ఆమె పేరుతో ఉన్న భూమిని థర్డ్ పార్టీకి కుమారుడు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న అంతా నిజమేనని తేల్చి అక్రమార్కులపై చర్యలకు ఆదేశించారు.
పేదల ఆకలి తీర్చడంపై ప్రజా ప్రభుత్వం మరోసారి దృష్టి సారిం చింది. ఇప్పటివరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తోంది.
‘పోలీసు అతిఽథి గృహం నిర్మాణా నికి ఎంపీ లాడ్స్ నుంచి రూ.2కోట్లు ఇచ్చా. కనీసం శిలాఫలకంపై పేరు లేదు. ప్రారంభానికి కూడా పిలవలేదు’ అంటూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు.
మండలం లోని పలు పంచా యతీలను విభజించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామస్థు లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గుంటుపల్లి పం చాయతీ పరిధిలో ఉన్న తురకపల్లి, శంకరాపురం గ్రామాలను కొత్త పంచా యతీగా విభజించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముం డ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు కోసం సమగ్ర శిక్ష నిధులు రూ.2.53 కోట్లు మంజూ రయ్యాయి. ఇప్పటికే 90 శాతంమేర పనులు పూర్త య్యాయి.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
గుండ్లకమ్మ నదికి ఇటీవల వచ్చిన వరదలతో ఇసుక చేరింది. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు.