దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.
క్రీడలకు ప్రజాప్రభుత్వం చేయూతనిస్తున్నదని, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఏపీ మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. సోమవారం కొండపిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి టెన్ని్సబాల్ క్రికెట్ పోటీలను సత్య ప్రారంభించారు. క్రికెట్ ఆడి సత్య అభిమానులను అలరించారు.
తగ్గించిన అడిషనల్ క్యాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఏపీఎన్జీవో భవన్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా సర్వసమావేశం జిరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు బడే అంకిరెడ్డి అధ్యక్షత వహించారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని మీకోసం హాలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు.
ఒంగోలు నగరంలోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్లో సోమవారం 28వ అంతర్ పాలిటెక్నిక్ బాలుర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది.
ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా పోలీసులు పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. సోమవారం నగర శివారు ప్రాంతంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెం దాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. మండలంలోని గానుగపెంట, పోతలపాడులో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
టీడీపీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల ను పార్టీ గుర్తించి తగిన గౌరవం ఇస్తుందని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పార్టీ విజయం కోసం, బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన కార్యకర్తలకు స్థా నిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సా యంత్రం ప్రతిభా అవార్డులు అందజేశారు.