ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో నిర్లక్ష్యంతోపాటు అసంతృప్తికర పనితీరుపై కలెక్టర్ రాజాబాబు సీరియస్ అయ్యారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అర్జీల పరిష్కారంలో లోపాలను ఆయన గుర్తించారు.
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు, ఎస్ఎన్పాడు నియోజకవర్గాల్లో ఈనెల 28న లోకేష్ పర్యటించనుండగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమా ర్లు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.14కోట్లతో చేపట్టనున్న పనులకు ఈనెల 28న మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమిపూజ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముంపు ప్రజలు గ్రామాలు వదిలి వెళ్తున్నందున విద్యకు అటంకం ఏర్పడకూడదన్న సంకల్పంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించింది.
ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ (యువ భవన్) భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరయ్యాయి.
చీమకుర్తి పట్టణంలోని జగనన్నకాలనీలో ఈ నెల 21న జరిగిన మహిళ మీరాబీ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
దొంగలను పట్టుకోవడం పోలీసు శాఖ ప్రధానమైన విధుల్లో ఒకటి. వారిని పట్టుకుంటే పోలీసులకు, వారి వద్ద చోరీ సొత్తు రికవరీ చేసి అప్పగిస్తే బాధితులకు ఎంతో సంతృప్తి మిగులుతుంది. జిల్లా పోలీసులు ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభచూపారు.
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
రెండు దశాబ్దాల క్రితం మహిళలలో వచ్చిన చైతన్యం గోపాలపురాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పరోక్షంగా దోహదపడింది. నాటి మహిళల పోరాట స్ఫూర్తితో గ్రామంలో రెండు దశాబ్దాలుగా మద్యం బెల్ట్ షాపు దరి చేరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు.
దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం కావడంతో కనిగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడుతూ టీడీపీ ఆధ్వర్యంలో కనిగిరి, పీసీపల్లి మండలాల్లో సోమవారం మోటార్సైకిల్, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.