స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ (సర్)లో పార్టీ నాయకులు చాలా కీలకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.
ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.విజయసునీత హెచ్చరించారు.
రైతులకు రాయితీపై ప్రభుత్వం అందించే వ్యవసాయ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల కన్నా నాలుగైదు రెట్లు అధికంగా రైతులు వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కనిగిరిలో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర, రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సామాజికవర్గాల నాయకులు హాజరయ్యారు.
మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న సిబ్బంది బదిలీల వ్యవహారం మలుపు తిరిగింది. యథాతథ స్థితి కొనసాగించాలని కలెక్టర్ రాజాబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కరెంటు ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాల పునర్విభజనతో అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరి ఐదు నెలలు దాటింది. ఇంకా పలు శాఖల పర్యవేక్షణ, పరిధి మాత్రం పాత జిల్లాలోనే కొనసాగుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు అయోమయా నికి గురవుతున్నారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.