ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పెంచడంతో కొంతమేర పురోగతి కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉండగా ఈనెల 15వతేదీ నాటికి 12,69,595 మంది డిజిటలైజేషన్ చేయించుకున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది.
మై భారత్ సేవలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
జిల్లాలో చినుకు జాడ కరువైంది. కీలక సమయంలో పంటల సాగు ముందుకు కదలనంటోంది. ఉష్ణోగ్రతలు దడపుట్టించే స్థాయి నుంచి నాలుగైదు డిగ్రీలు తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజానీకానికి వరుణుడు మాత్రం నిరాశనే కలిగిస్తున్నాడు.
తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులకు కేంద్రప్రభుత్వం దన్నుగా నిలిచి సాయపడాలని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నా యుడు, డాక్టర్ డీఎస్బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కోరారు. ఈ మేరకు వారు రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందంగా సోమవారం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలపై చర్చించారు.
‘ఉదయ్ అలాంటోడా..’ ఇదీ ప్రస్తుతం మండలంలో చర్చనీయాంఽశంగా మారిన అంశం. ట్రైనీ ఐపీఎస్ మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో సింగరాయకొండలోనూ, ఆయన స్వగ్రామమైన ఊళ్లపాలెంలోనూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యంచూస్తుండటంతో భవనాసి చెరువు ఖాళీ అవుతోంది. ఇక్కడి నీరు చేపల చెరువులకు వెళ్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్దచెరువులలో భవనాసి ఒకటి.
అద్భుత విజయాలు అందుకునేందుకు దృఢ సంకల్పమే బలమైన పునాది అని కలెక్టర్ రాజా బాబు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడి యెట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభచూపిన విద్యార్థులకు సోమవారం స్థానిక రిమ్స్ ఆడిటోరి యంలో షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో (ఆర్ఎస్కే) సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖరులు సోమవారం పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. దీంతో అన్ని చోట్లా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
ఫ్లవర్ డెకరేషన్కు సంబంధించిన వస్తువులు నిల్వ ఉంచే గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన స్థానిక కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది.