• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

అలా వదిలేశారు!

అలా వదిలేశారు!

మార్కెట్‌లో ధాన్యం ధరలు ఒక్కసారిగా దిగజారాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. సివిల్‌ సప్లయీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లను ఫిబ్రవరి 21 నుంచి నిలిపివేశారు.

సీజన్‌ ముగిసినా కదలికేదీ?

సీజన్‌ ముగిసినా కదలికేదీ?

పంటల సాగు సీజన్‌ ముగిసి అమ్మకాల సీజన్‌ కొనసాగుతున్నా రైతులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల జాడలేదు. ఈ పథకం కింద సాయాన్ని ఏటా మూడు విడతలుగా ప్రభుత్వాలు ఇస్తుండగా మూడో విడత సాధారణంగా ఫిబ్రవరి ఆఖరులోపే జమ చేస్తారు.

దివ్యాంగుడిపై దాష్టీకం

దివ్యాంగుడిపై దాష్టీకం

కనిగిరి తహసీల్దార్‌ నర్రా జయలక్ష్మి ఓ దివ్యాంగుడిపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. నాపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తావా? అంటూ ఊగిపోయారు. సిబ్బందితో అతని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాగివేయించారు. అనంతరం పోలీసులను పిలిపించి లోపల వేయాలని హుకుం జారీ చేశారు.

మహిళలూ మీకోసం

మహిళలూ మీకోసం

మార్కాపురం జిల్లాలోని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక ఇది. ప్రభుత్వం వనితల భద్రత, వారికి న్యాయ సహాయం కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఆది వారం మార్కాపురంలో ప్రారంభిస్తోంది. అ

ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ ఇళ్లలో సోదాలు

ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ ఇళ్లలో సోదాలు

గిద్దలూరులో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేస్తూ ఏసీబీకి దొరికిన నామన కృష్ణమోహన్‌రావు ఇళ్లలో ఆ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం చీరాల, పేరాల, కడవకుదురులలో అతనికి చెందిన మూడు గృహాల్లో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి.

సామాన్యులపై ‘బండ’

సామాన్యులపై ‘బండ’

వంట గ్యాస్‌ ధర రాత్రికి రాత్రే పెరగడంతో వినియోగదారులపై భారీగా భారం పడింది. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు సమాచారం. సాధారణ సిలిండర్‌కు రూ.60, కమర్షిల్‌ సిలిండర్‌కు రూ.115 పెరిగింది.

టీచర్లకు మరో అవకాశం

టీచర్లకు మరో అవకాశం

ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టిస్‌)లో టీచర్ల వివరాల్లోని తప్పుల సవరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 10 వరకూ గడువు ఇచ్చింది. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు.

ఓపెన్‌ పరీక్షా కేంద్రాలపై ఉక్కుపాదం

ఓపెన్‌ పరీక్షా కేంద్రాలపై ఉక్కుపాదం

ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షలపై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం ఆంధ్రజ్యోతిలో అంతా ‘ఓపెన్‌గానే’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. పరీక్షా కేంద్రాలపై నిఘాను పెంచారు. మొత్తం 13 కేంద్రాలకు మండల విద్యాధికారులు వెళ్లి పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు అక్కడే తిష్ఠవేసి పర్యవేక్షించారు.

ఆదాయానికి మించి ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ప్రకాశం జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం రేగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అధ్వాన రోడ్లకు మోక్షం

అధ్వాన రోడ్లకు మోక్షం

గుంతలమయమైన ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.57కోట్లకుపైనే నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆయా రోడ్ల మరమ్మతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి