జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో ఏడు క్లస్టర్లలో కొనుగోలు కేంద్రాల ద్వారా 514 మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కనిగిరి పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు.
సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు
అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్ఎంపీ వైద్యుడు మేడగం వెంకటకోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు.
పాహిమాం చెన్నకేశవ.. జైజై చెన్నకేశవ.. నమో చెన్నకేశవ.. మమ్మేలు ఇలవేల్పా.. శరణఘోషలతో మార్కాపురం పట్టణం హోరెత్తింది. శ్రీదేవిభూదేవి సమేతుడై చెన్నుడు రథంపై కొలువైన వేళ భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. దేవదేవుని దివ్యమంగళ స్వరూపం తిలకించి భక్త జనం పులకించిపోయారు.
టిడ్కో గృహ సముదాయాన్ని నాణ్యతా ప్రమాణాలతోపాటు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
ఈత సరదా యువకుని ప్రాణం తీసింది. శనివారం ముగ్గురు యువకులు సరదగా రామతీర్థం ఆలయం సమీపం నుంచి వెళ్తున్న ఒంగోలు బ్రాంచ్ కాలువలో ఈత కొడదామని దిగారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా 22ఏ కాలంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. క్లరికల్ తప్పుల వలన నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములను నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.