స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా అమలు చేసినందుకు కలెక్టర్ పీ రాజాబాబు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.
టీడీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవల నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. ఆదివారం కనిగిరిలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తొలి సమావేశాన్ని నిర్వహించారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే పాఠశాలల్లో 100రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
ఒంగోలు మండలం యరజర్ల పరిధిలోని కొండను గ్రావెల్ మాఫియా గుల్ల చేస్తోంది. అక్రమంగా తవ్వకాలు చేసి తరలిస్తోంది. దీంతో ఒంగోలు, కొత్తపట్నం గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగే సాగర్ కాలువ కట్ట ధ్వంసమవుతోంది. ఈ విషయంపై ఇరిగేషన్శాఖ అధికారులు సాగర్ కాలువ కట్టపై గ్రావెల్ టిప్పర్లు తిరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వారు.
భారత ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటుహక్కు నమోదు, వినియోగించుకోవడం, కొత్త ఓట్ల నమోదు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది.
పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సభలు నిర్వహించారు. వారితో ప్రతిజ్ఞలు చేయించారు. స్వచ్ఛాంధ్ర-స్వ ర్ణాంధ్రలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం పరిశుభ్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం విదితమే. ఈనెలలో మూడో శనివారం సంక్రాంతి సెలవులు కావడంతో నాల్గో వారానికి కార్యక్రమాన్ని మార్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి మెరుగైన విద్యను అందిస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం మండలంలోని కూకట్లపల్లి ఉన్నత పాఠశాలలో గొట్టిపాటి కిషోర్ గ్రానైట్, అసిస్టు స్వచ్ఛంద సంస్థ ద్వారా 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కా రమే ధ్యేయంగా వచ్చేనెల 5వతేదీన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్ఎస్ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
బహిరంగ మార్కెట్కు తగ్గకుం డా భూముల విలువ పెంచేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాలలో పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఒంగోలు అర్బన్ అఽథారిటీ పరిధిలో ఉన్న భూములు విలువ 10శాతం పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.