ఎన్నికలకు ముందు తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు.
బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్ పరిశీలించారు.
గ్రానైట్ పరిశ్రమల్లో వచ్చిన అధునాతన యంత్రాల ద్వారా విపరీతంగా ఉత్పత్తి పెరగడం.. అదే స్థాయిలో డిమాండ్ తగ్గి అమ్మకాలు పడిపోవడం.. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన వ్యాపారులు బల్లికురవ ప్రాంతంలో రాజస్థాన్కు చెందిన వారు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పట్టణ పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారుల ఇంటి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఆసన్నమవుతోంది. నాణ్యతను పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితిల్లో ఈ ఏడాది జూన్కు నీటిని విడుదల చేయాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నాం. అందుకు అనుగుణంగా ముందుకు సాగండి’ అని జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
భానుడి భగభగతో ప్రజలు తల్లడిల్లిపోయారు. రెండు రోజులుగా ఎండతీవ్రతతోపాటు ఉక్కపోత పెరిగింది. జిల్లాలో సాధారణంగా మే మొదటి వారం నుంచి ఎండ బాగా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటివారం నుంచే మంటలు మొదల య్యాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనాల ఫిట్నెస్ గురువారం నుంచి ప్రైవేటుపరం కానుంది. ఈ మేరకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 నుంచి కేపీ ఎంటర్ప్రైజెస్ ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో వాహనాల ఫిట్నెస్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మండలంలోని తురకపల్లి అటవీ ప్రాంతంలో తెల్లరాయి (వైట్క్వార్ట్జ్) అక్రమ తవ్వకాలపై మంగళవారం మైనింగ్ అధికారులు దాడి చేశారు. ‘తురకపల్లిలో తెల్లరాయి దొంగలు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మైనింగ్ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతులు మండలంలోని తురకపల్లి అటవీ ప్రాంతంలో తెల్లరాయి (వైట్క్వార్ట్జ్) అక్రమ తవ్వకాలపై మంగళవారం మైనింగ్ అధికారులు దాడి చేశారు. ‘తురకపల్లిలో తెల్లరాయి దొంగలు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మైనింగ్ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలను గుర్తించారు. లేకుండా జరుగుతున్న తవ్వకాలను గుర్తించారు.
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ హెచ్చ రించారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాల యంలో మంగళవారం ఆయన బెట్టింగ్లకు పాల్పడిన దర్శి పట్టణంతోపాటు జిల్లాలో మొత్తం 14 మంది యువకులు, వారి కుటుం బ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
వేటపాలెం - చీరాల జాతీయ రహదారిలోని పాత చాపల మార్కెట్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు దుర్మరణం చెందాడు.