తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీలను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి మొత్తం 42మంది కమిటీ సభ్యులు వాటిలో ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు మొదలైంది. ఈ మేరకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరిని తొలగించారు.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి గ్రామస్థులతో మాట్లాడారు.
చీరాల పట్టణంలో రెండు మూడు రోజులుగా దుకాణాల్లో కొనుగోళ్ల జోరు పెరిగింది.
పేరుకు 300 ఎకరాల ఆసామి. ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా ఉంది దేవాలయ పరిస్థితి. అటు ఆలయ బాధ్యతలు చేపట్టే అధికారులు గాని, రెండేళ్లకోసారి ఏర్పడే పాలకమండళ్లు కాని ఆలయ అభివృదిఽ్ధపై శీతకన్ను వేశారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆలయం కళావిహీనంగా మారింది. ఇదీ జరుగుమల్లి మండలంలోని దావగూడూరులోని శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయ కథ...
ప్రాథమిక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
జిల్లా ఏర్పాటుతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది.
నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కంభం రోడ్డులోని అటవీశాఖ పరిధిలోని పార్కులో ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టారు.
అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో ఒక్కసారి గా కదలిక వచ్చింది. ఇటీవల వరకు స్తబ్దుగా ఉన్న ఽస్థలాల ధరలతో రియలెస్టేట్ వ్యాపారం ఆగిపోయింది.
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా పనులకు ఈ ఏడాది భారీగా కోతపడింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్లో పది శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లకు మించి మెటీరియల్ కోటా పనులు మంజూరు చేయలేమని జిల్లా యంత్రాంగం తేల్చేసింది.