జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఇక్కట్ల నుంచి కొంతమేర ఉపశమనం లభించనుంది. సాగర్ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం బుధవారం జలాలను విడుదల చేశారు.
మండలంలోని శానంపూడి పంచాయతీ పరిధిలో ఉన్న పచ్చటి మామిడి తోటల్లో యంత్రాల బీభత్సం కొనసాగుతోంది. మట్టి మాఫియా ఏమాత్రం బెరుకు లేకుండా అసైన్డ్ భూముల నుంచి నిత్యం టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్ను తరలిస్తోంది.
వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత బుధవారం పంపిణీ చేశారు. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాలకు చెందిన 468 మందికి వారికి కేటాయించిన నిర్వాసిత కాలనీల్లో ప్లాట్లను ఇచ్చారు.
ప్రయాణిస్తున్న లారీలో క్యాబిన్ డోర్ తెరుచుకుని ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై సాయిబాబా మందిరం సమీపంలో మంగళవారం రాత్రి 12.45 నిమిషాలకు చోటుచేసుకుంది.
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ద్వారా నూతన రైళ్లు నడపటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతిసారీ హామీ ఇవ్వటమే తప్పా ఆచరణలో అమలుకాలేదు. తాజాగా ఆగస్టు నెలలో రైళ్లు నడుపుతామని చెప్పిన మాట కూడా దాదాపుగా నీటిమూటైంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పచ్చి మోసం, దగా చేశారని ధ్వజమెత్తారు.
జిల్లా అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా అడుగంటిన నీటి వనరులు దర్శనమిస్తున్నాయి. నీరు లేక, నిర్వహణ సరిలేక తాగునీటి పథకాలు పనిచేయని పరిస్థితి నెలకొంది.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పెండింగ్ పనులను అధికారులు చకచకా చేస్తున్నారు. బుధవారం నాటికి అన్నింటినీ పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా ఫీడర్ కాలువపై సీఎం చంద్రబాబు ఈనెల 31న జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసేందుకు వీలుగా అమర్చిన గేట్ల వద్ద కాలువ లోపలి భాగంలో కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు.