వంగ సాగు చేసిన రైతులు బెంగ పడుతున్నారు. ఇటీవల వరకు పది కిలోలు రూ.300 వరకు ఉన్న వంకాయల ధర ప్రస్తుతం రూ.60కు పడిపోయింది. కిలో రూ.30 చొప్పున ధర ఉంటేనే సాగుచేసిన రైతులకు పెట్టుబ డులు వచ్చేది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థికసంఘం నిధులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్పంచ్ల పదవీకాలం ముగింపు దశకు రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికసంఘం నిధులను ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆంక్షలు విధించింది.
కుటుంబ సమస్యల కారణంతో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
మార్టూరు పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్ లో టమోటా ధర బాగా తగ్గింది. హోల్ సేల్ గా 25 కిలోలు టమోటా బాక్స్ రూ.100 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లె గ్రామాల వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ, టన్నెల్ పనులను పరిశీలించనున్నారు.
వ్యవసాయం గిట్టుబాటు కాక పంటల సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు మూడేళ్లుగా మళ్లీ సామాజిక వనాలను ముమ్మరంగా సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో జామాయిల్ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల భేటీలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తయ్యాయి. చంద్రబాబు అరడజనుకుపైగా సర్వే సంస్థలతో తెప్పించుకున్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో నిర్మొహమాటంగా సమీక్ష చేస్తుండగా.. మంత్రి నారా లోకేష్ ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
రైతులు వేలం కేంద్రాల వెలుపల ప్రైవేటు కంపెనీలు, చిరు వ్యాపారులకు పొగాకు అమ్మకాలు ప్రారంభించారు. ప్రధానంగా అధికంగా పంట సాగుచేసిన పెద్ద, చిన్నకారు రైతులు పొగాకును బయట విక్రయిస్తున్నారు. ఈఏడాది మొత్తంగా మేలు రకం దిగుబడి పెరిగింది.
సాగునీటి కాలువను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పంట పొలాలకు నీరు ఎలా చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాలలో ముందస్తు అనుమతులు తీసుకోకుండా వెంచర్లు, నిర్మాణాలు చేయకూడదు.
పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళనబాట పట్టారు. వీఆర్వోల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.