Home » Andhra Pradesh » Prakasam
పొదిలి నగర పంచాయతీని సమూలంగా మార్చి వేసి అభివృద్ధి చేస్తామని గతేడాది మార్కాపురం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పొదిలి పెద్దచెరువుకు సాగర్ కాలువ నుంచి పైపులైన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నామినేషన్ల అనంతరం ప్రచార కార్యక్రమం హోరెత్తుతోంది. అయితే ఇప్పటికే జరిగిన, జరుగుతున్న ప్రచార కార్యక్రమం పరిశీలిస్తే తెలుగుదేశ కూటమి అభ్యర్థి ఎరిక్షన్బాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈపాటికే ఆయన రెండు మూడు పర్యాయాలు గ్రామాలన్నీ చుట్టేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రసుత్తం ఆయనతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె కూడా ప్రచారంలోకి రావటంతో ముగ్గురు మూడు వైపులా ఊరూవాడా పర్యటిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఆయన నియోజకవర్గానికి వచ్చి అక్కడ వారినే అంటిపెట్టుకొని ఉండటం కలసివచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి రంగంలోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పార్టీలో పరిస్థితులు చక్కబెట్టేందుకే సమయమంతా సరిపోవటంతో ప్రచార కార్యక్రమాల్లో వెనుకబడిపోయారు.
సింగరాయకొండ మండలంలో అధికారపార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని సింగరాయకొండ, మూలగుంటపాడు, పాకల తదితర గ్రామాల నుంచి వైసీపీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు ఆపార్టీకి గుడ్బై చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 120 కుటుంబాల వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా టీడీపీయేనని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మండలంలోని నందనవనం, బిట్రగుంట, దావగూడూరు, చింతలపాలెం, పంగులూరివారిపాలెం, జరుగుమల్లి, వావిలేటిపాడు గ్రామాల్లో స్వామి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు గ్రామాల్లో ప్రచార రథంపై నుంచి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు.
అద్దంకి పట్టణంలో మంచినీటి సరఫరాలో రెండున్న దశాబ్దాల క్రితం పరిస్థితులు మరలా వచ్చాయా అన్న భయం మళ్లీ మొదలైంది. రెండున్నర దశాబ్దాల కిందట పట్టణ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేదు. వేసవి కాలం వస్తే ఊటబావులలో నీటి లభ్యత లేక తాగు నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చేవి. అప్పటి మేజర్ పంచాయతీ సర్పంచ్గా సందిరెడ్డి శ్రీనివాసరావు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి పొలాలలో ప్రత్యేకంగా బోర్లు వేసి తాగునీటి కష్టాల నుంచి పట్టణ ప్రజలను గట్టెక్కించారు. అనంతరం పెద్దగా నీటి సమస్య ఉత్పన్నం కాలేదు.
చిరు వ్యాపారులకు, దినసరి కూలీలకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం అద్దంకి పట్టణంలోని 15వ వార్డు, రాత్రి మండలంలోని కొటికలపూడిలో ఎమ్మెల్యే పర్యటించారు.
కారంచేడు మండలం కుంకలమర్రులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఏలూరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షంతో గ్రామంలోకి సాధరంగా ఆహ్వానించి అభిమానం చాటుకున్నారు.
వైసీపీ అరాచక, అసమర్థ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్నిప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని పెదఅలవలపాడు, పీసీపల్లి, పెదయిర్లపాడు గ్రామాల్లో శుక్రవారం రాత్రి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మార్కాపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నామి నేషన్ గురువారం అట్టహాసంగా నిర్వహించారు.