ఇటుకబట్టీ పరి శ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. దశాబ్దకాలం క్రితం అద్దంకి ప్రాంతంలో 100కు పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి.
మార్కాపురం జిల్లా రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డిని గిద్దలూరు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యవర్గం స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు.
జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు ముందుకు సాగడం లేదు. సీజన్ ప్రారంభమై రెండు మాసాలు గడిచినా సాధారణ విస్తీర్ణంలో కనీసం 20శాతం కూడా పంటలు పడలేదు. విస్తారంగా రబీ సాగుచేసే సమయంలో జిల్లాను మొంథా తుఫాన్ ముంచెత్తింది.
నగర పరిశుభ్రత, సుందరీకరణలో పారిశుధ్య విభాగం పాత్ర కీలకమైనది. అయితే ఆ విభాగంలోని 3వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ తీరుతో అవినీతి కంపుకొడుతోంది. టీ దుకాణాల నుంచి ఆసుపత్రుల వరకు వసూళ్లకు పాల్పడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా సోమ వారం సామాజిక పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది. తుఫాన్ వాతావరణంతో చలిగాలులు, చిరుజల్లులు ఉన్నప్పటికీ ఉదయం ఏడు గంటలకే క్షేత్రస్థాయి సిబ్బంది, వారికి తోడు టీడీపీ శ్రేణులు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.
జిల్లాకు దిత్వా తుఫాన్ ముప్పుతప్పింది. చిరుజల్లులకే పరిమితమైంది. దీంతో ప్రజానీకం, అధి కార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జిల్లావ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారం భమైంది. మొత్తం 1,392 దుకాణాల పరిధిలో 6.71 లక్షల స్మార్ట్ కార్డుదారులకు సోమవారం నుంచి బియ్యం, జొన్నలు, పంచదారను ఇస్తున్నారు. తొలిరోజు సాయంత్రం ఆరు గంటలకు 1.94 లక్షల (29శాతం) మంది రేషన్ను అందుకున్నారు.
నియోజక వర్గంలో ప్రతీరోజు ప్రజాసమస్యల పరిష్కారంకోసమే తొలి అడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య పేర్కొ న్నారు.
కాటన్ కార్పొరేషన్ తరఫున మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని ఏవో లక్ష్మీనారాయణ చెప్పారు.