‘వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. వ్యవస్థ ముఖ్యం. దానిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలను నియమించిన టీడీపీ.. ఆ కమిటీ సభ్యులతో మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాపు నిర్వహించింది.
బ్యాంకు ఉద్యోగులకు పనిభారం తగ్గించేలా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీ యూ) జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్దేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అన్ని శాఖలను మూసివేసి సమ్మె చేపట్టారు.
మండలంలో మార్టూరు తర్వాత రెండో గ్రామంగా వలపర్ల గ్రామం నిలుస్తుంది. ఇంతటి పెద్దగ్రామానికి ఏళ్ల తరబడి చెరువునీటినే ఫిల్టర్ చేయకుండా వదులుతున్నారు.
తమ కాలనీలలో రోడ్లు, సైడుకాలువలు నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎమ్యెల్యే బీఎన్ విజయ్కుమార్ను అభ్యర్థించారు.. ఆయన స్పందించి రెండు ఎస్సీ కాలనీలలో సిమెంట్రోడ్లు, సైడుకాలువల నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించారు.. పనులు చేపట్టనున్న కాలనీలోని వీధులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
గణతంత్ర వేడుకలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం, మరోవైపు వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ఇతరత్రా వందలాది ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు.
అద్దంకి పట్ట ణంలోని పలుప్రాంతాలు నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో రిజిస్ర్టేషన్లు జరగక క్రయవిక్రయాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోంది. ప్రధానంగా ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలో ఉన్న 1038 సర్వే నెంబర్లో సుమారు 70 ఎకరాల భూమి దేవదాయశాఖకు చెందిన దిగా నమోదైంది.
ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో ఇంకా విభజన అడుగులు పడలేదు. ఫలితంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు అధికారులు, సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి.
ఇంటర్మీడియట్లో ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సంస్కరణలకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చింది.
ఒంగోలులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్థూపాన్ని కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తూ అసంపూర్తి పనులను పూర్తిచేస్తోంది. ఈక్రమంలో అద్దంకి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న భవనాసి రిజర్వాయర్ అసంపూర్తి పనులపై కూడా రైతులు గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు.