పాఠశాల విద్యలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని మెరిట్ విద్యార్థులను ఆకర్షించి ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఎత్తుకెళ్లేవి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
ఎరువులు పక్కదారి పట్టకుండా రైతుల అవసరానికి తగ్గట్టు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రైతుకు ఎంత పొలం ఉంది? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
ఒంగోలు కార్పొరేషన్ పరి ధిలోని పేర్నమిట్ట వద్ద 136/4బీ సర్వే నెంబరులో భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు సమగ్ర విచారణ చేసి నివేదికను అందజే యాలని ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్నాయుడును ఆదేశించారు.
బిహార్ రాష్ట్రం నుంచి చెన్నైలో వివిధ ఫ్యాక్టరీల్లో కూలి పనులు చేసేందుకు వెళ్తున్న 15 మంది బాలలను గుర్తించిన అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, షార్ట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఫర్ సోషల్ వలంటీర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంట లకు జోక్బాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న రైలులో తనిఖీలు చేపట్టారు.
మినిమం టైం స్కేలు (ఎంటీఎస్)తో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న డీఎస్సీ-98, డీఎస్సీ-2008 టీచర్ల సర్వీసులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెలలో ఒక నియోజకవర్గంలో మీకోసం, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా లన్న సీఎం ఆదేశాలతో ఈనెల 11వతేదీన లింగసముద్రం మండలం చినపవనిలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్ రాజాబాబు నిర్వహిస్తున్నారు.
నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు.
ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు.
ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్లో మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.