వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై ఆధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు వార్నింగ్ ఇచ్చారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాంటి అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తెస్తామన్నారు. జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల్లో కరువు అధికంగా ఉంటుందని.. దానిని పారద్రోలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా వెలిగొండ నీరు ఇస్తామని మరోసారి ప్రకటించారు.
డ్వామా నీటి సంరక్షణ పథకంలో జాతీయ ఉత్తమ పురస్కారానికి కనిగిరి నియోజకవర్గ పరిధిలోని మురుగుమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో అక్కడి వాటర్ షెడ్, ఇతరశాఖల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య విధానాలను పాటించారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ పర్యవేక్షణలో ఉన్న వాటర్ షెడ్లకు సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. గుంటూరులో మంగళవారం జరిగిన సదస్సులో కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ల చేతులమీదుగా డ్వామా ఏపీడీ హనుమంతరావు అవార్డులతోపాటు చెక్కులను అందుకున్నారు.
కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో కీలక ప్రజాప్రతినిధులు ఎవరన్నది అధికారులకు అవగాహన ఉండాలి. లేకపోతే తెలుసుకోవాలి. ప్రొటోకాల్ పాటిస్తూ శిలాఫలకాలపై వారి పేర్లను క్రమపద్ధతిలో ఉంచాలి. అయితే మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రోత్సెంటర్ వద్ద మంగళవారం జరిగిన ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన శిలాఫలకం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి దోర్నాలకు చేరుకున్నారు. స్థానిక వెలిగొండ అతిథి గృహం వద్ద మార్కాపురం ఇన్చార్జి సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, ప్రాజెక్టు ఎస్ఈ అబుత్ఆలి, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరువురు అర్అండ్బీ అధికారులకు షోకాజ్ నోటీసులను ఆశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వి.రామచంద్ర జారీ చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో పర్చూరు నియోజకవర్గం తీవ్రమైన వరద విపత్తును ఎదుర్కొందని, వ్యవ సాయం, వాగులు, కాలువలు, రహదారులు సహా అన్నీ రంగాలు భారీగా నష్టాన్ని చవిచూశాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
ప్రభుత్వ పథకాలపై చెంచు గిరిజన యువత అవగాహన కల్గి ఉండాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్వో రవికుమార్ అన్నారు. వెలుగు కార్యాలయంలో ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్ సూచనల మేరకు ఆర్ హెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
డీఎస్పీలో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులు చిన్నారుల బంగా రు భవితకు బాటలు వేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం 2025 డీఎస్పీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ఆత్మీయ సమావేశం జరిగింది.