కృష్ణపట్నం పోర్టు కట్టిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడా పోర్టు కట్టకూడదని వైఎస్ఆర్ జీవో ఇచ్చారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుర్తుచేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోలు రద్దు చేశామని చెప్పారు.
జిల్లాలో జలధార పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. యంత్రాంగం పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. పనుల గుర్తింపు కూడా చివరి దశకు వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత గ్రామసభలలో పనులను ఆమోదించి కలెక్టర్కు పంపనున్నారు.
మార్కాపురం జిల్లాలో జూదం జూలు విదుల్చుతోంది. ఎక్కడికక్కడ పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. రోజుకు రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అనేక మంది పేకముక్కల్లో చిక్కి బయటకు రాలేక ఆర్థికంగా చితికిపోతున్నారు.
ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లడం ఇప్పుడు నగరమంతా చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం వరకు విధి నిర్వహణలో బిజీగా ఉన్న ఆయన ఒక్కసారిగా నెలరోజులపాటు సెలవు పెట్టడం వెనుక ‘రాజకీయం’ ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎర్రగొండపాలెం, సింగరాయకొండ, దర్శిలో నిర్మించిన అన్న క్యాంటీన్లు బుధవారం ఆరంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు వర్చువల్గా రాష్ట్రంలోని 62 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న విషయం విదితమే. అందులోభాగంగా దర్శి, సింగరాయకొండలో బుధవారం నుంచి పేదలకు భోజన వసతి అందుబాటులోకి వస్తోంది.
ల్లాలోని గ్రామ పంచా యతీల్లో బుధవారం ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. అందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 519 గ్రామపంచాయతీలు ఉండగా 518 ఈనెల 3వతేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి.
గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాలలో మామిడిచెట్లకు పరిహారం చెల్లింపు వ్యవహారంలో కోట్లాది రూపాయల కుంభకోణం చోటుచేసుకుంది. రామాయపట్నం పోర్టు అనుబంధంగా ఏర్పాటుకానున్న బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణలో ఈ వ్యవహారం నడిచింది.
పీఎం సూర్యఘర్ పథకంలో మన రాష్ట్రానికి 20లక్షల కనె క్షన్లు మంజూరయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లంపేట గ్రామ ఎస్సీ కాలనీలో 44 గృహాలకు మంజూరైన ఉచిత సోలార్ యూనిట్లను సోమవారం ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రారంభించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బ ర్పై వైసీపీ నీచ రాజకీయం చేస్తు న్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి విమర్శించారు. మంగళ వారం నెల్లూరు జిల్లాకు జగన్ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒంగోలు డెయిరీని పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుం టానని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లాకు చెందిన రైతులు ఆయన్ను కలిసి సమస్యను వివరించారు.