వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో 18 సంవత్సరాల వయసు నిండిన నిర్వాసితులం దరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కోర్టు సెంటర్లో రాస్తారోకో చేశారు. దీంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పీడీసీసీ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని, బ్యాంకు చైర్మన్గా తాను బాధ్యతలు స్వీకరించిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లు నిఖర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చెప్పారు.
ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువా రంరాత్రి చోటుచేసుకుంది.
ఆటో బోల్తాపడి 13మందికి గాయాలయ్యాయి. ఈఘటన గురువారం ఉదయం మండలంలోని బోదనంపాడు వద్ద చోటుచేసుకుంది.
మద్దిపాడు యాదవ కాలనీలో భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దొంగలు కారులో ప్రవేశించి బంగారు ఆభరణాలను తస్కరించారు.
రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేసి, దళారీ వ్యవస్థను రూపుమాపి అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్ఎస్కేల)ను ఏర్పాటు చేస్తోంది.
విద్యార్థుల కుటుంబాల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. తల్లికి వందనం పథకం నిధులు తల్లుల ఖాతాల్లో జమ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించగా వారికి సంబంధించిన 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో నిధులు వేస్తున్నారు.
పొగాకు మార్కెట్ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తెస్తున్న ఒత్తిడిని వ్యాపారులు అంతగా పట్టించుకొంటున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో స్వయంగా సీఎం ఒకటికి రెండుసార్లు సమీక్షలు చేసి పలు ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రమంత్రుల బృందం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలోని కీలక మంత్రులు హామీలు ఇచ్చి తద నుగుణంగా వ్యాపారులకు సూచనలు చేసినా ఇక్కడ మార్కెట్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు.
తెలు గు తమ్ముళ్లు మరోసారి జనంబాట పట్టను న్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయా లను ప్రజలకు వివరించే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అధిష్ఠానం రూపొందించింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల జిల్లాల పునర్విభజనలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగా ర్థులకు ఊరట లభించింది. ప్రభుత్వంలో విలీనమైన తేదీ కాకుండా ఎయిడెడ్లో సర్వీసు ప్రారంభమైన తేదీ నుంచి వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.