జిల్లాలో బుధవారం పక్కా గృహ ప్రవేశాలు, భూమిపూజ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా అనేక చోట్ల గృహప్రవేశాలు నిర్వహించారు.
కేంద్ర మానవ వన రుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఏటా 20శాతం పాఠశాలల చొప్పున ఐదేళ్లలో వంద శాతం ఆడిట్ను పూర్తిచేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 50 పాఠశాలలను సోషల్ ఆడిట్కు ఎంపిక చేశారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, వైస్ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. కష్ట పడి పని చేసే కార్యకర్తలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వద్ద అవమానం తప్ప గౌరవం దక్కటం లేదన్నారు.నిజమైన కార్యకర్తలకు నియోజకవర్గంలో ఆదరణ లేనందునే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు.
నల్ల బర్లీ పొగాకు సాగుపై నిషేధం ఉన్నందున రబీ సీజన్లో పొగాకు సాగుచేసే రైతులు నల్లబర్లీ పొగాకు సాగుచేయవద్దని మండల వ్యవసాయ అధికారి ఎన్.రంగాకృష్ణ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని లక్ష్మక్కపల్లి, పిల్లివారిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడ రైతులు సాగుచేసిన వరి, కంది పైర్లను పరిశీలించారు.
రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కల నేరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని వగ్గంపల్లి గ్రామ ఎస్సీపాలెంలో నూతనంగా నిర్మించిన ఇళ్లను బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర టీడీపీ శ్రేణులు, అఽధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఇళ్లు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
సోలార్ హబ్ ఏర్పాటుకు అవసరమైన భూములను వెంటనే సేకరించే పనులు ప్రారంభించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు చెప్పారు. బుధవారం బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఆర్డీవో సమీక్షించారు.
గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ కోరారు.
నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంతింటి కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నా, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు 300 కాలనీలో మన ఇల్లు - మన గౌరవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి రానున్న మూడున్నర సం వత్సరంలో ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాజానగర్, ఎన్టీఆర్ కాలనీలో కాకర్ల లక్షీదేవి నిర్మించుకున్న ఎన్టీఆర్ గృహాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి గృహప్రవేశ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పేదలందరికీ పక్కా గృహాలు క ల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక బాపూజీ కాలనీలో బుధవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి భూమిపూజను చేశారు.