మద్యం మత్తులో రౌడీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందుకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న ఒక రౌడీషీటర్ పోలీసులు దుర్భాషలాడారని, అందుకే చనిపోతున్నానంటూ ర్యాట్ పాయిజన్ తాగుతూ వీడియో తీసి వైరల్ చేశాడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్వర్క్ వైద్యశాలల్లో పీఎం రహత్ స్కీంను అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్ హేమంత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో ఉచి తంగా రూ.1.50లక్షల వరకు వైద్యం అందుతుందన్నారు.
జిల్లా రైతులకు శుభవార్త. సాగర్ ఆయకట్టులోని కాలువలు, ఇతర నీటి వనరులను వచ్చే వ్యవసాయ సీజన్కు సిద్ధం చేసేందుకు భారీగా నిధులు విడుదల కానున్నాయి.
కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల మాయం వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట అధికారుల నిర్లక్ష్యమని భావించగా, ఇప్పుడు దాని వెనుక భూముల లావాదేవీలకు సంబంధించి పెద్ద స్కాం ఉన్నట్లు తెలుస్తోంది.
జనగణన-27లో ప్రాథమిక ఘట్టమైన గృహగణన కార్యక్రమంలో రెండో రోజైన శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. స్వీయగణన పేరుతో ఈనెల 16నుంచి 30వతేదీ వరకు ఆన్లైన్ పోర్టల్లో నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
జిల్లాలో భానుడు భగభగ మండిపోయాడు. మొత్తం 28 మండలాలు ఉండగా 14 మండలాల్లో శుక్రవారం 40 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అత్యధికంగా బల్లికురవలో 42.5 డిగ్రీల ఎండ కాచింది.
జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతులకు విరివిగా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
కొత్తపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు మురిగిపోయి తినటానికి పనికిరాకుండా ఉన్నాయి. వారంక్రితం టెండర్దారుడు పాఠశాలలకు సరఫరా చేసిన కోడిగుడ్లును ఉడకబెట్టి విద్యార్థులకు అందజేద్దామంటే కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి.
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణత సాధనలో రాష్ట్ర సగటు కంటే జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు.
పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసిందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.