రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపన కోసం ల్యాండ్బ్యాంక్ ఏర్పాటే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా ఏపీ మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా చేయిస్తోంది.
జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులైన కల్పనాకుమారి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సువర్ణను కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చీరాల నియోజకవర్గ అభివృద్ధికి శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు.
పర్చూరులో రైతు బజార్ ఏర్పాటు ఎండమావిని తలపిస్తోంది. కూరగాయలు సాగుచేసుకునే రైతులకు, కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆశయంతో ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదని ప్రజలు చెబుతున్నారు.
భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా కనిగిరి ప్రాంతాభివృద్ధి కోసం కలిసి సాగుదామని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
ఉపాధి హామీ మెటీరియల్ కోటాపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. ఇప్పటి వరకూ ఆ నిధుల వినియోగంపై ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. పది పనులు మించి జరుగుతున్న గ్రామాల్లో కొత్తవి చేపట్టే అవకాశం లేకుండా చేసింది. అందులో గృహ నిర్మాణం, పండ్ల తోటల పెంపకానికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఇతర పనులు పెద్దసంఖ్యలోనే ఉండనున్నాయి.
ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్ సొసైటీపై వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. విచారణాధికారైన ఒంగోలు డీఎల్సీవో కార్యాలయంలోని అసిస్టెంట్ రిజి స్ట్రార్ నర్రా సురేంద్రబాబు అందుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి, విస్తారంగా పండ్లతోటల సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి కేంద్ర పథకమైన పూర్వోదయలో ఉమ్మడి జిల్లాను చేర్చారు.
ముగ్గురు స్నేహితులు కలసి మద్యం తాగారు. ఆపైన ఒకరు సరదాగా ఈతకు దిగి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి ఒకరిని కాపాడారు. మిగిలిన ఇద్దరు యువకులు మృతి చెందారు.