పథకాలన్నింటికీ వ్యక్తి యొక్క గుర్తింపు వివరాల నమోదు (ఈకేవైసీ)ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుదారులు, గ్యాస్ వినియోగదారులకు ఈ ప్రక్రియను ప్రారంభించింది. కార్డుదారులకు నెలాఖరు వరకూ గడువు విధించింది.
రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలో శుక్రవారం భారీ విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. కూటమి పార్టీల తరఫున దీన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తోపాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి. 48 రోజుల వేసవి సెలవులు గురువారంతో ముగిశాయి. దీంతో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి.
అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ)ని పాలకపక్షం గాలికొదిలేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం గురించి పట్టించుకున్న వారు లేరు. గతంలో జరిగి ఏడు నెలలు దాటినా దాని ఊసే లేదు.
ఈ ఏడాది పంటల సాగుకు ముందే రైతులకు షాక్ తగిలింది. సాగులో అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. గత ఖరీఫ్ సీజన్ నుంచి కంపెనీలు ఎడాపెడా బాదేస్తున్నాయి.
పాతకక్షల నేపథ్యంలో దారికాచి వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని మార్కాపురం కోర్టులో తీర్పు చెప్పారు. 2017 మే 17న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ కోటాను కుదించింది. 2016లో పథకాన్ని ప్రారంభించినప్పుడు సబ్సిడీతో ఏటా 12 సిలిండర్లు ఇచ్చింది. గత ఏడాది ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించింది.
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 1,77,577 మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవ త్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు.
హత్య కేసులో మార్కాపురం విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
రానున్న సీజన్లో పొగాకు పంట ఉత్పత్తి తగ్గింపు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆ విషయాన్ని బోర్డు అధికారులకు రైతు ప్రతినిధులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఏటా గతం కన్నా ఎంతో కొంతమేర అధికంగా పంట పండించేందుకు అనుమతి కోసం గట్టిగా డిమాండ్ చేసే రైతులు ఈసారి అందుకు భిన్నంగా తగ్గింపు కోరుతున్నారు.