పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్తలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి శీతారామయ్య, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి ప్రారంభించారు.
ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి ఆదివారం స్థానిక పోలీ్సస్టేషన్ వద్దకు చేరి హల్చల్ చేశారు. పోలీసులపై చిందులు తొక్కారు.
ప్రభుత్వ శాఖల్లో కీలకమైన వాటిల్లో రెవెన్యూశాఖ ఒకటి. ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై రెవెన్యూ కార్యాలయాలకు వెళుతుంటారు.
బెంగళూరు - నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీ జరిగింది. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు.
ఒంగోలు పేరుకు మునిసిపల్ కార్పొరేషన్.. పారిశుధ్యం చూస్తే అధ్వానం అన్నట్లు పరిస్థితి తయారైంది. నగర పాలకసంస్థలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపుకొడుతోంది. ప్రజారోగ్యం పేరుతో ఆ విభాగం ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది.
మార్కాపురం సమీపంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయానికి దగ్గరలో విలువైన భూమిపై గిద్దలూరుకు చెందిన వైసీపీ నాయకుడి కన్ను పడింది. ఒక అగ్రిమెంట్ ఆధారంగా ఆ భూమి తనదేనని వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్లాట్లలోని రాళ్లను తొలగించారు.
జిల్లాలో డ్రాయింగ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల (డేటా)ను ట్రెజరీ కార్యాలయానికి పంపడంలో ఆలస్యం చేశారు.
పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా సాగింది.
అత్యధిక శాతం జాతీయ బ్యాంక్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వ్యవసాయ భూముల ఆధారంగా బంగారం తాకట్టుపెట్టి తీసుకునే రుణాల నిబంధనలను కఠినతరం చేశాయి. గతంలో భూములు ఉన్న రైతులు బంగారం తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకునే వారు.
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.