పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతం ఏ జిల్లాలో ఉండాలనే అంశంలో రాయలసీమ.. ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ పెత్తనానిదే పైచేయిగా మారింది. ఫలితంగా అత్యంత చేరువలో ఉన్న జిల్లాకేంద్రానికి దూరంగా శ్రీశైలం మిగిలిపోతోంది.
వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టి.. భూగర్భంలోకి ఇంకించి జల సంరక్షణలో పీసీపల్లి మండలంలోని మురుగుమ్మి గ్రామం ఆదర్శంగా నిలిచింది. 6వ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈనెల 18న ఈ అవా ర్డును నీటి యాజమాన్య సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో అందుకోనున్నారు.
జిల్లాలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో 64,598 పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్కార్డుల స్థానంలో రైస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
సాగర్ కాలువలకు నీటి పరిమాణం పెరిగింది. ప్రస్తుతం కుడి కాలువకు డ్యామ్ నుంచి పదివేల క్యూసెక్కుల నీరు విడుదలవు తుండగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్ ప్రధాన కాలువకు 9,620 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే ఇంటి పన్నులు దారిమళ్లకుండా నేరుగా పంచాయతీ అకౌంట్లకు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ ద్వారా పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది.
ఈ విడత స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాలను ప్రధానాంశంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పేరుతో ఒక్కో అంశంపై ప్రజలను చైతన్యవంతులను చేయడం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న విషయం విదితమే.
వారం రోజులలో మరో తుఫాన్ వస్తుందన్న సమాచారంతో మండలంలోని రాజుగారిపాలెం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ కారణంగా మండలంలోని రాజుగారిపాలెంలో నష్టం జరిగింది.
సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజా ప్రభుత్వం లోటుపాట్లను సరిచేస్తూ మూడు కేటగిరీల్లోకి తెచ్చి సిబ్బందిని సర్దుబాటు చేసినా గాడిన పడలేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో, ఏ పని మీద ఎక్కడికి వెళ్లారో, తిరిగి ఎప్పుడు కార్యాలయానికి వస్తారో తెలియని పరిస్థితి. అడ్మిన్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్వో, హెల్త్ అసిస్టెంట్ వంటి వారికి ఏదో ఒక పని ఉంటున్నప్పటికీ మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంటి వారు నామమాత్రమే అయ్యారు.
‘మొద్దు నిద్ర వీడండి. గత ప్రభుత్వంలో పనిచేస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రండి. నిర్దేశిత లక్ష్యంలోపు వెలిగొండ పనులను పూర్తి చేయండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులైనా, పనులు చేసే ఏజెన్సీలపైన అయినా వేటు తప్పదు’ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
జిల్లాలో గ్రామపంచాయతీల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పల్లెప్రజలకు మునిసిపాలిటీల తరహాలో నిరంతరం సేవలు అందనున్నాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం జారీ చేసింది.