ఉమ్మడి జిల్లాలో ఈనెల 16వతేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకంలో గందరగోళం నెలకొంది. కొన్ని హైస్కూళ్లలో ఒక్కరికి కూడా ఇన్విజిలేషన్ డ్యూటీ రాకపోగా కొన్ని పాఠశాలల్లో మాత్రం ఒకరిద్దరు మినహా మిగిలిన అందరినీ నియమించారు.
బెట్టింగ్లకు దర్శి కేంద్రంగా మారింది. అమాయకులైన యువకులను మాయమాటలతో నమ్మించి అక్రమార్కులు ఉచ్చులో దించుతున్నారు. ఇక్కడ క్రికెట్ బెట్టింగ్లతోపాటు ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలపై భారీగా పందేలు పెడతారు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శి ప్రాంతంలో ఈ జాడ్యం ఉంది.
పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలోని 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు.
మాయమాటలు చెప్పి బాలికను వెంట తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగుచూసింది. పలు సాంకేతిక పద్ధతులు, ఇతర ఆధారాలతో పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు.
ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలని భావించినా ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి గృహ నిర్మాణశాఖ అధికారులకు సమాచారం అందింది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ నీరు అందిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని కుంచేపల్లిలో శుక్రవారం సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ అధ్యక్ష్యతన ఏర్పాటు చేసిన అన్నదాత సఖీభవ మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొన్నారు.
దొనకొండ మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది.. కాదు తీవ్రతరం చేశారు అనడం కరెక్టమో..! దాదాపు రెండు నెలలుగా మంచినీటి సరఫరా జరగకపోవటంతో గ్రామాల్లో ప్రజలు మంచినీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.