అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేస్తుండగా తమను ప్రజలు ఎక్కడ మరిచిపోతారోనని వైసీపీ విషప్రచారం చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలన వైసీపీదని - ఆదర్శ పాలన చంద్రబాబుదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం టంగుటూరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం’ కొండపి నియోజకవర్గస్థాయి విజయోత్సవ సభలో మంత్రి స్వామి మాట్లాడారు.
జిల్లాలో సాగునీటి కాలువల బాగుకు రంగం సిద్ధమైంది. రానున్న సీజన్కు సాగర్ కాలువల్లో సజావుగా నీటి సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యవసర పనుల కోసం ఇటీవల నిధులు మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెలాఖరులోపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు ఇటు ప్రకాశంలోనూ, అటు మార్కాపురం జిల్లాలోనూ ఆయన పర్యటనకు రానున్నారు.
వేసవి సెలవుల అనంతరం శుక్రవారం మళ్లీ బడి గంటలు మోగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు స్కూళ్లలోకి అడుగుపెట్టారు. కొన్ని పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజయా లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం భాగస్వామ్య పార్టీలతో కలిసి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలకు సిద్ధమవుతోంది.
అద్దంకి పట్టణ చుట్టుపక్కల కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగర్ కాలువలను యథేచ్ఛగా ఆక్రమించి పంటలు సాగు చేయడంతోపాటు ఏకంగా వెంచర్లు కూడా వేస్తున్నారు.
ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకె ళ్తుందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాఽథూర్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్లో తొలిసారి పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఒంగోలు వచ్చారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. పలు పెండింగ్ అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లా భవిష్యత్కు ఉపకరించి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే.. సాగు, తాగునీటి ఇక్కట్లు తీర్చడంతో పాటు ఉపాధి మార్గాలను పెంపొందించే ప్రాజెక్టులు పట్టాలె క్కాయి.
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు హామీలు తప్ప ఆర్థికప రంగా బడ్జెట్లో కేటాయింపులు లేక ఆందోళన చెందుతున్న నిర్వాసితులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం, పున రావాస చర్యలకు సంబంధించి ప్రస్తుత ఏడాది బడ్జెట్లో మరో రూ.906 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.