ఆ ఇద్దరు చిరుద్యోగులు గ్రూప్-2లో మెరిశారు. నిన్నటి వరకు తాము జవాబుదారిగా ఉండాల్సి అధికారి స్థాయిలోనికే ప్రస్తుతం వీరు చేరనున్నారు.
కనిగిరి కొండపైన శ్రీవిజయమార్తండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన స్థానిక నగరికంటి బసవయ్య సెంటర్ వద్ద ఉన్న రూముల లీజుకు ఈనెల 28న వేలం పాట నిర్వహించారు. గతంలో ఉన్న పురాతన రూములను తొలగించి కొత్తవి నిర్మించేలా ప్రైవేట్ వ్యక్తులకు అధికారులు అనుమతులు ఇచ్చారు.
అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలలో కంటి పరీక్షలు చేసే అవకాశం లేకపోవటంతో ముఖ్యంగా వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దశాబ్దకాలం పాటు అద్దంకి సీహెచ్సీలో కొనసాగిన విజన్ సెంటర్ ఏడాదిన్నర క్రితం రద్దయ్యింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్కోదేనని ధ్వజమెత్తారు.
ఉపాధి హామీ మెటీరియల్ కోటా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలతో ఆందోళన చెందుతున్న నేతలు, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ఇటు జిల్లా, అటు రాష్ట్రస్థాయి అధికారులతో పలువురు ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
కనిగిరి నియోజకవర్గంలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సిఫార్సు మేరకు అక్కడే ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు.
ల్లాకు చెందిన యువకులు గ్రూపు-2లో రాణించారు. పలు కీలక ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలా ఎంపికైన వారిలో అధికులు ఇప్పటికే చిరుద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు.
జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో స్వల్పంగా భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను కోరుతూ ఆయా ప్రాంతా లలోని సబ్రిజిస్ర్టార్ కార్యాలయాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.
ఒంగోలు కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సూపర్బజారు)పై సెక్షన్ 52 విచారణకు జిల్లా సహకారాధికారి డి.శ్రీ లక్ష్మి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో సూపర్ బజార్ ప్రాంగణంలో హోటల్ నిర్వహణను నిబంధ నలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్లు ఆ సంస్థ 2024-25 సంవత్సరం ఆడిట్ నివేదికలో ఆడిటర్ నివేదించడంతో దానిపై విచారణకు డీసీవో ఆదేశించారు.
వచ్చేనెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట్రప్రభుత్వం ఈ నెలాఖరులోనే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 31వ తేదీన ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలలోని లబ్ధిదారులకు వేర్వేరుగా పింఛన్లను అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.