మునిసిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించిన వారికి రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఐదు శాతం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే ఆఖరు లోపు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది.
మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దర్శి వెంకటనారాయణ (26) ఆన్లైన్ మోసాలకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందిన సమాచారం మేరకు.. వెంకటనారాయణ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
జిల్లాలో జనగణన (ఎన్యుమరేషన్) నుంచి గ్రామ సర్వేయర్లను మినహాయిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సర్వేయర్లు రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో కొలతలు, సరిహద్దుల నిర్ణయం, రికార్డుల తయారీలో కీలకంగా పనిచేస్తున్నారు.
మోసాలు చేయడం.. లక్షలు సంపాదించడం.. ఇది మెస్ట్ వాంటెడ్ భీముడు అజిత్కుమార్ రెడ్డి నేర ప్రవృత్తి. 2018లో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఫేక్ బిల్లులు సృష్టించి వ్యాపారం చేస్తూ అనేక మందిని మోసగించాడు.
రెండు వందల యూనిట్లు విద్యుత్ వాడుకొనే ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మంజూరు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
ఫ్లోరిన్ రహిత రక్షిత తాగునీటి కోసం 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దోర్నాల ప్రజల కలలు సాకారం కానున్నాయి. ఆ దిశగా సంబంధిత అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.
దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒకవైపు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. మరోవైపు ఏళ్ల తరబడి ఇరుకైన ఘాట్ రోడ్డు.. వెరసి ఈ రహదారిపై ప్రయాణం ప్రతిరోజూ నరకయాతనకు గురిచేస్తుంది. మొత్తం 49 కిలోమీటర్ల దూరం ఉన్న ఘాట్ రోడ్డుపై నిత్యం దాదాపు 600 నుంచి 700 వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇవికాక కార్లు, బైక్లు వేలల్లో వస్తుంటాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఘాట్రోడ్డును జాతీయ రహదారి 765గా గుర్తించినప్పటికీ పలు కారణాల వల్ల రోడ్డు విస్తరణ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు సాగునీటి ఇక్కట్లు తీర్చాలన్న తపనతో అప్పులు తెచ్చి పనులు చేసిన సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. ఏడాది గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు.
కొనకనమిట్ల మండలంలో విద్యాశాఖపై ఓ ఉపా ధ్యాయుడు పెత్తనం చేస్తున్నారు. ఆయన చెప్తే నే పనులు జరుగుతున్నాయి. అక్కడ మండల విద్యావనరుల కేంద్రంలో ఉండాల్సిన ఉపాధ్యా యులకు సంబంధించిన రికార్డులన్నీ చాలాకాలంగా సదరు ఉపాధ్యాయుడి ఆధీనంలో పొదిలిలో ఉండటం నివ్వెరపరుస్తోంది.
నేర నియంత్రణకు పోలీసు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.