పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. ధరల లోటు భర్తీ పేరుతో లోగ్రేడ్ పంటకు కిలోకు రూ.20 వంతున ఇవ్వాలని నిర్ణయించాయి. అలాంటి పొగాకు రాష్ట్రంలో 94 మిలియన్ కిలోలు ఉన్నట్లు సమాచారం.
‘ప్లాట్లలో శ్రీగంధం చెట్లు పెంచుతాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు’ అంటూ కొనుగోలుదారులకు ఆశపెట్టారు. అక్రమ రిజిస్ర్టేషన్లు చేసి రూ.కోట్లు దండుకొన్నారు. చివరకు కొనుగోలుదారులు తాము మోసపోయామని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భారీ స్కాం వెలుగుచూసింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీసు అధికారి అవతారమెత్తాడు. తాను సైబర్ వింగ్లో డీఎస్పీ స్థాయి అధికారి నని చెప్పి అందరికీ నమ్మబలికాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు.
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం రెండో విడత చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం రూ.950కోట్లను కేటాయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి తొలి విడత పరిహారాన్ని నెల క్రితం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. వీటిలో పలు అంశాలను వైద్యారోగ్యశాఖ ప్రామాణికంగా తీసుకొని జూన్ నెలకు సంబంధించి గ్రేడింగ్లు ఇచ్చింది.
ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్లోని ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు మరో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని గుంటూరు రోడ్లో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఆర్అండ్బీ పరిధిలో ఉండగా, దానిని ప్రైవేటు స్థలంగా చూపిస్తూ ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై పురపాలక శాఖ సీరియస్ అయింది.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలోనే రూ.360కోట్ల రుణాలను అందజేయనున్నట్లు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆమె ముందుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, దళిత సంఘాల నాయకులతో చ ర్చించారు. కార్పొరేషన్ ద్వారా త్వరలో అమలు చేయబోయే పథకాలు, వాటి ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్)కు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రకారం ఆగస్టు 5 నుంచి 16 వరకు ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.
వంద శాతం రాయితీతో ఒక హెక్టారుకు 125 మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఉద్యానశాఖ అధికారి హనుమంత్ నాయక్ చెప్పారు.
కొవిడ్ కారణంగా గతంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. రోగులతో వైద్యశాలలు కిక్కిరిశాయి.. ఆక్సిజన్ సైతం అందక బతుకు జీవుడా అంటూ రోదించిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయి... అప్పట్లో ప్రజల ప్రాణాలు నిలిపేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో రూ.1.06 కోట్లతో ప్రాణవాయువు ప్లాంట్ను ఏర్పాటు చేశారు.