మండలంలోని నక్కబొక్కలపాడులో ఉన్న హనుమాన్సాయి మందిర 19వ వార్షికో త్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
చీమకుర్తి పట్టణంలో సాక్షిరామలింగేశ్వరాలయలో కార్తీక సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఎర్రగొండపాలెం మోడల్ డిగ్రీ కాలేజీలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్చార్జి గూ డూరి ఎరిక్షన్బాబు సోమవారం తెలిపారు.
మార్కాపురం శాసనసభ్యులు కం దుల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. అర్థరాత్రి నుంచి ఎమ్మె ల్యే గృహంలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, కేకులు కట్ చేయించారు.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు.
కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాయ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కోరారు. సోమవారం అమరావతిలో మంత్రి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు.
నిరుద్యోగ యువకులు వచ్చిన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని టీడీపీ నేతలు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్), కొండా కృష్ణారె డ్డి, షేక్ ఫిరోజ్ అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్లో ఆదివారం జననీ చారిటబుల్ ట్రస్టు, మ్యాన్పవర్ మేనేజ్మెంట్ సర్వీస్ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
యోగి వేమన రెడ్ల సంక్షేమ సంఘం వారు ఐక్యతగా ఉండి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు.
భవిష్యత్ తరాలకు జీవనాధారం మొక్కలని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఆదివారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా దేవరాజుగట్టులోని పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు.
సాగర్ కాలువ పరిధిలో పంటలు ఎండకుండా సాగుకు నీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.