జిల్లాలో వ్యవసాయం, పర్యాటకం, నీటివనరుల వృద్ధి, పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నా యి. వీటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల తయారీపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నాలుగు నియోజకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఇన్చార్జి ఆధ్వర్యంలో జిల్లాలో అవకాశాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలను వైసీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి కోసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పెట్టుబడులతో రండి.. పరిశ్రమలు స్థాపించండి’ అంటూ జిల్లా యంత్రాంగం పిలుపునిస్తోంది. వ్యాపారుల పెట్టుబడులు, స్థానిక వనరుల సద్వినియోగం ద్వారా పరిశ్రమల స్థాపనతో ఉపాధి మార్గాలు పెంచాలని చూస్తోంది
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
దేశంలోనే మొట్టమొదటగా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా కృషిచేస్తున్నారు.
పొగాకు మార్కెట్లో మరింత సంక్షోభం పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ దిగజారుతున్న ధరలతో తీవ్ర ఆవేదన చెందుతున్న దక్షిణాది ప్రాంత రైతులు బుధవారం నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు కేంద్రాల్లో వేలాన్ని అడ్డుకున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి వేడుకల కార్యక్రమం గురువారం ఒంగోలులో జరగనుంది. ‘రెండేళ్ల నమ్మకం- సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వేడుకలను నిర్వహిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) అంతంతమాత్రంగానే సాగుతోంది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు.
జిల్లాలో మళ్లీ ఎండ తీవ్రత అధికమైంది. రెండు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.