రాష్ట్రప్రభుత్వ టూరిజం, కల్చరల్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఉగాది పురస్కారాలకు జిల్లాకు చెందిన పలువురు ఎంపికయ్యారు. కళారత్న(హంస) పురస్కారానికి సాహిత్య విభాగంలో ఒంగోలుకు చెందిన నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఎంపికయ్యారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై ప్రభుత్వం చేపట్టిన సెక్షన్ 51 విచారణ మలుపు తిరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు స్పందించారు. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా సీఎంకు లేఖలు రాయడంతో సీఎంవోలో కదలిక వచ్చింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం జిల్లాలో ఘనంగా జరిగాయి. పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు అనేక గ్రామాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో, మరోవైపు వివిధ రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి ఆ ప్రజాప్రతినిధులంతా మాజీలు కానున్నారు. అదేరోజు నుంచి ఈ సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 165 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 28,465 మంది విద్యార్థులకుగాను 28,302 మంది హాజరయ్యారు.
రెండు విడతలుగా ఆరు రోజులపాటు జరగనున్న ‘రైతన్నా మీకోసం’ సోమవారం ప్రారంభమైంది. పూర్వపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 528 రైతు సేవా కేంద్రాలు ఉండగా అన్నింటిలోనూ వ్యవ సాయ అనుబంధ శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అను గుణంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నుల వసూళ్లకు మరోసారి పంచాయతీరాజ్ కమిషనర్ గడువు పెంచారు. రెండు జిల్లాల్లో ఇంకా రూ.20కోట్ల మేర బకాయిలు ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తున్న భక్తుల ఆనంద యాత్ర తిరుగు ప్రయాణంలో విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారును కంభం సమీపంలోని జంగంగుంట్ల వద్ద మినీ లారీ ఢీకొనడంతో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పర్చూరు నుంచి చిలకలూరిపేట వేరుశనగ విత్తనాల బస్తాల లోడుతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బుడ్డపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.