పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈసారి కూడా ఒక రోజు ముందుగానే చేశారు. సాధారణం గా ప్రతినెలా 1వతేదీన వీటిని అందజేస్తారు. అయితే ఈసారి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముం దుగానే ఫించన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్య, వైద్యంతోపాటు వనం కూడా నేడు ప్రతిఒక్కరికీ అవసరంగా మారిందని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. పర్యావ రణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తు గందరగో ళంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ తమవంతుగా ఒక వనం పెంచేం దుకు సిద్ధపడాలని సూచించారు.
నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు విముక్తి కల్పించకపోవడంతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో మండలంలోని తాళ్లూరు, బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, రామభద్రాపురం, సోమవరప్పాడు, బెల్లంకొండవారిపాలెం, శివరాంపురంలో గ్రామకంఠంకు చెందిన పలు సర్వే నంబర్లలోని గృహాలను దేవుని ఆస్తి అన్నట్లుగా దేవదాయశాఖ అధికారులు 22(ఏ) నిషేధిత జాబితాలోకి చేర్చ డంతో సమస్య జఠిలమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అసభ్యపదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను కందుకూరులో శనివారం రాత్రి దహనం చేశారు.
గడచిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
భూముల విలువ ఆది వారం నుంచి పెరగనుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసి పోయాయి. శనివారం ఒక్కరోజే 551 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగగా రూ.2.47 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
ఎరువుల విక్ర యాల్లో అక్రమాలను నిగ్గుతేలుస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘అలా నీరుగార్చారు’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని పలువురు హోల్సేల్ డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీచేశామని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారానిక ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు.
భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జేసీ పీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కనిగిరి డివిజన్ స్థాయి తహసీల్దార్లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆర్టీసి డిపోలో వసతుల కల్పనే లక్ష్యం అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. శనివారం గిద్దలూరు ఆర్టీసీ డిపో ఆవరణలో రూ.53లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.