జిల్లాలో 1.96 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసిన అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం విదితమే.
తల్లికి వందనం పథకంలో అర్హులై సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈనెల 7వతేదీ వరకు పొడిగించింది.
ఒంగోలు మునిసిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్ రాజాబాబు ఆదేశించారు
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లితండ్రులు విడిపోవడానికి కారకుడని ఓ వృద్ధుడిని యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉలవపాడు మండలం చాగల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది.
జిల్లాలో ఓట్ల నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు ఎ.సూర్యకుమారి సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరగనున్న మునిసిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో అధిష్ఠానాల నుంచి స్పష్టత కూడా రావడంతో ఆ వైపు దృష్టిసారిం చాయి.
తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు మార్కెట్తో భారీగా నష్టపో నున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లోగ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.20 బోనస్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పలువురు రైతు నాయ కులు తెలిపారు.
భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చేనెల 1న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనుండగా ఆ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు టీడీపీ తరఫున సీఎం చంద్ర బాబునాయుడు ఈ కార్యక్రమంపై దృష్టిసారించారు. ఆ సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు.
పులులను రక్షిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ జిల్లాలోని పలుచోట్ల బుధవారం ర్యాలీలు నిర్వహించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మార్కాపురం, దోర్నాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో వీటిని చేపట్టారు.
పారదర్శకంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాయాలు కార్డుదా రులకు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించినా జిల్లాలో కొందరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 25,984 మంది ఇంకా పెండింగ్లో ఉండిపోయారు.