ప్రసిద్ధ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారం భమవుతున్నాయి. ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహనాధికారి అనిల్కుమార్ తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలల్లో విద్యా నైపుణ్యాలను మెరుగుపరచి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. దివ్యాంగశక్తి పథకం కింద బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు.
జిల్లా సహకార శాఖలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలను అటు రాష్ట్ర, ఇటు జిల్లా ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. రోజువారీ ఇతర శాఖల్లో ఉన్నట్లు కీలక ప్రజాప్రతినిధుల జోక్యం పెద్దగా అందులో లేకపోవడం, అంతకు మించి బాధ్యతగల పాలకపక్ష పెద్దలు దృష్టిపెట్టకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.
ఐదేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాల ఆధీనంలో సాగిన పట్టణ స్థానిక సంస్థల పాలన బుధ వారం నుంచి ప్రత్యేక అధికారుల చేతుల్లోకి రానుంది. వాటి పాలక మండళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈలోపు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనా వ్యవహారాలకు అటంకం లేకుండా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.
జిల్లాలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. బుధవారం నుంచి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.
రంజాన్ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు భారీగా ముస్లిం లు హాజరయ్యారు.. స్థానిక గుంటూరు రోడ్డులోని పీఏజీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ కారుతో ఆటోను ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక సబ్డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం వివరాలను వెల్లడించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు నిఘాపెట్టారు. టీ20 వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలో దర్శి కేంద్రంగా బెట్టింగ్లు వేయించి అమాయకులను మోసం చేసిన ముఠాలో కొందరిని ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే.