• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

ఎండ మండే

ఎండ మండే

జిల్లాపై సూర్యప్రతాపం కొనసాగుతోంది. ఎండ మండిపోతోంది. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల నుంచి సుర్రుమంటున్న సూర్యుడు సోమవారం మరింత రెచ్చిపోయాడు.

9న జాతీయ లోక్‌ అదాలత్‌

9న జాతీయ లోక్‌ అదాలత్‌

ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చేనెల 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధి కార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

పూరిమెట్ల మాజీ సర్పంచ్‌ నిధులు స్వాహా

పూరిమెట్ల మాజీ సర్పంచ్‌ నిధులు స్వాహా

ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల పంచాయతీ మాజీ సర్పంచ్‌ ఓగులూరి రామాంజి 15వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సిబ్బంది సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించగా విషయం బయటపడింది.

రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల దృష్టి

రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల దృష్టి

రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్‌ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అద్దంకి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగాయి.

ఒంగోలు జాతి గిత్తలను ప్రోత్సహించేందుకు పోటీలు దోహదం

ఒంగోలు జాతి గిత్తలను ప్రోత్సహించేందుకు పోటీలు దోహదం

ఒంగోలు జాతి గిత్తల యజమానులను ప్రోత్సహించేందుకు ఎడ్ల బలప్రదర్శన పోటీలు దోహదపడతాయని గన్నవరం, ఒంగోలు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, దామచర్ల జనార్దన్‌ చెప్పారు.

గతి తప్పిన చీమకుర్తి మున్సిపల్‌ పాలన

గతి తప్పిన చీమకుర్తి మున్సిపల్‌ పాలన

ప్రత్యేక అధికారుల ఇలాఖాలో చీమకుర్తి మున్సిపల్‌ పాలన గతి తప్పింది. ఆలనాపాలనా చూడాల్సిన ప్రత్యేక అధికారి మున్సిపల్‌ కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

లాక్‌డౌన్‌ యోచనలో గ్రానైట్‌ పరిశ్రమ

లాక్‌డౌన్‌ యోచనలో గ్రానైట్‌ పరిశ్రమ

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ పరిశ్రమపై డీజిల్‌ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. క్వారీల్లో ఆదివారం ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఇదేపరిస్థితి కొనసాగితే లాక్‌డౌన్‌కు వెళ్లాలని యజమానులు యోచిస్తున్నారు.

నో స్టాక్‌

నో స్టాక్‌

ఉమ్మడి జిల్లాలో డీజిల్‌కు కొరత ఏర్పడింది. యుద్ధప్రభావం కారణంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో ఆయిల్‌ కంపెనీలు డీజిల్‌పై పలురకాల ఆంక్షలు విధించినట్లు సమాచారం. నిన్నమొన్నటివరకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసిన కంపెనీలు ఇప్పుడు తగ్గించినట్లు తెలిసింది.

మొదలైన తాగునీటి ఇక్కట్లు

మొదలైన తాగునీటి ఇక్కట్లు

జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. వేసవి తీవ్రతతో అక్కడక్కడా బోర్లు మొరాయిస్తున్నాయి. గిద్దలూరులో మొత్తం 177 బోర్లు ఉండగా అందులో 9 పనిచేయడం లేదు.

పన్నుభారం ‘సగం’పోయింది!

పన్నుభారం ‘సగం’పోయింది!

నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఖాళీ స్థలాల పన్ను తగ్గిస్తూ ప్రజా ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలావీఎల్‌టీ (వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌)లో 50శాతం రాయితీ కల్పిస్తూమునిసి పల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి