కోల్ సొసైటీపై సెక్షన్ 52 విచారణలో మరో అడుగు ముందుకు పడింది. విచారణాధికారి కోరిన రికార్డులను పూర్తిస్థాయిలో కాకపోయినా పాక్షికంగా ఆ సంస్థ ప్రస్తుత బిజినెస్ మేనేజర్ అందజేశారు. మిగిలిన వాటిని ఈనెల 4న అందజేస్తామంటూ లిఖితపూర్వకంగా విచారణాధికారికి నివేదించారు.
జిల్లాలోని టైప్ 3, 4 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో బోధనేతర పోస్టుల భర్తీలో ప్రతిష్టంభన నెలకొంది. నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆ తర్వాత ప్రక్రియను జాప్యం చేస్తున్నారు.
తాగునీటి నిర్వహణలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సి వారు ఆ విషయాన్ని గాలికొదిలేశారు. నగరంలోని శివారు కాలనీల్లోనేటికీ పైపులైన్లు లేవు.
అది దట్టమైన అటవీ ప్రాంతం. కనీసం వెళ్లేందుకు అవసరమైన రహదారి కూడా లేదు. జీపులు, కమాండర్లలో అక్కడకు చేరాలి. అలాంటి నల్లమలలో కనీస సౌకర్యాలు కూడా నోచుకోని గిరిజన గూడేల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి చేశారు.
ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు కప్పదాటు ధోరణి తగదని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్లో సోమవారం ప్రజాసమస్యల పరి ష్కారవేదిక (ప్రజాదర్బార్) నిర్వహించారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్మాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 73 మంది మగ ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు నియామక పత్రాలను అందజేశారు.
ఏమాత్రం ఆనవాళ్లు కనిపించకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఓ పథకం ప్రకారం ముందుగా బైక్ను దొంగిలించారు.. ఆ తర్వాత ఆ బైక్ మీద వచ్చి ఓ మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కెళ్లారు. బైక్ను మార్గమధ్యలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది.
రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు.. ప్రజలకు గుక్కెడు నీటిని అందించలేకపోయారు. దీంతో నేటికీ నిరుపయోగంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆ ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మవరం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పునర్నిర్మాణానికి రూ.5.70 కోట్లు నిధులు మంజూరు చేయించారు.
సింగరాయ కొండ మండలంలో ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగో లుగా అసైన్డ్, ప్రభుత్వ, పోరంబోకు, తీరప్రాంత భూములను సైతం వైసీపీ నాయకులు కొల్లగొట్టారు. ఖాళీస్థలం కనిపిస్తే కబ్జా చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ భూములకు సైతం నకిలీ పట్టాలు సృష్టించి హస్తగతం చేసుకోవడంలో ఆరితేరిన ముఠా కన్ను సుమారు రూ.5కోట్ల విలువ చేసే భూమిపై పడింది.