తెలుగు దేశం పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మెల్యే డా క్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పీసీపల్లి మండలం లోని పీసిపల్లి సర్పంచ్ మరియమ్మ వైసీపీని వీడి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు.
పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తద్వార గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు సూచించారు
ఒంగోలు నగరం త్రోవగుంట గ్రామంలోని శ్రీగంగా పార్వతీసమేత శ్రీమూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి మాస శివరాత్రి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు ఆమంచి ఉదయభాస్కర్ వైభవంగా నిర్వహించారు
మొంథా తుఫాన్ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి.
పది ఎకరాల తన భూమిని ఆన్లైన్ చేయాలని కోరుతూ ఐదేళ్లుగా ముగ్గురు ఆర్డీవోలు, తొమ్మిది మంది తహసీల్దార్లకు 100 అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసంలో జేసీని మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డెమాని శింగయ్య వేడుకున్నారు.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకువచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో 614 ఎంవోయూలు చేసుకున్నాయని వెల్లడించారు.
ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ టంగుటూరి రామాంజి చెక్ పవర్ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
చీరాల మున్సిపల్ పరిధిలోని దండుబాట రోడ్డులో వ్యర్ధ జలాలు, మురుగు నిల్వలతో ప్రజలు విలవిల్లాడు తున్నారు.