అద్దంకి బ్రాంచ్ కాలువ (ఏబీసీ)కి ఎగువ నుంచి మంగళవారం పరిమితికి మించి నీటిని విడుదల చేయడంతో అధికారులు, రైతులు ఉలిక్కిపడ్డారు. వల్లాపల్లి-కొమ్మినేనివారిపాలెం మధ్య లాకుల సమీపంలో కట్ట అంచులు తగిలేలా నీరురావడం చూసి ఆందోళనకు గురయ్యారు.
ఏళ్లతరబడి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఖాతాదారులు, స్థానికులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఆపై చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట భారీ మొత్తంలో నగదును తీసుకున్నాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆస్తులను అమ్మేసి సొమ్ముచేసుకున్నాడు.
గ్రామ పంచాయతీల్లో విచ్చలవిడిగా నిధులు వినియోగించకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఉన్న నిధులను వివిధ పనులకు చెల్లింపులు చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు పెరిగాయి.
వాగు అక్రమణలను తొలగించి వరద ముంపు నుంచి పంట పొలాలను కాపాడాలని రైతులు, రైతుసంఘ నేతలు డిమాండ్ చేశారు.
యువకుడి హత్యకేసులో ఐదుగురు యువకులను చీరాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
సమస్యలను పరిష్కరించాక పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం సోమవరప్పాడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మేదరమెట్ల సచివాలయంలో ఆమె పరిశీలించారు.
బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ఫీల్డ్ నిర్మాణంలో ఉన్నతాధికారులు అవగాహన లేమి రైతులకు శాపంగా మారనుంది. భవిష్యత్లో తలెత్తే సమస్యను గుర్తించిన రైతులు ఇప్పటికే పలుమార్లు హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు దృష్టికి తీసుకుపోయినా ‘మా దారి మాదే’ అన్నట్లు వ్యవహరిస్తుండటం వారికి ఆగ్రహం తెప్పించింది.
గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల వసూలు ముందుకు సాగడం లేదు. ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం వెనుక సంబంధిత పంచాయతీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రకాశిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావ వేడుకలు సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. ముందుగా జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు.
సాగర్ కాలువల్లో నీటి మట్టం పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మేజర్లకు, మైనర్లకు నీరందక ఇబ్బందిపడుతున్నారు. పంట దశలో ఉన్న వరి పైరుకు పుష్కలంగా నీరందించాల్సిన సమయంలో ఇబ్బంది ఎదురవ్వడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.