ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేసి నోబిడ్లు అధికంగా వేస్తున్న పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారుల ధిక్కార ధోరణికి నిరసనగా ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.
సంపూర్ణ ఆరోగ్యానికి అనుదినం యోగాసాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి చెప్పారు.
రైతు పథకాల అమలులో నకిలీల తొలగింపు, అనర్హుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇవ్వనుంది.
ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు శనివారం విడుదలయ్యాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 1,88,056 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.126.06 కోట్లు జమ అయ్యాయి.
పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిత్యం పలు కేంద్రాల్లో వేలం ఆగిపోవడం.. ఒకవేళ జరిగినా పెద్దసంఖ్యలో బేళ్లు నోబిడ్ అవుతుండటంతో తొలుత వాటి తగ్గింపు, తర్వా త వేలం కొనసాగడం కోసం చర్యలు అత్యవస రంగా భావించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యా ప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుతో అవసరమైన చర్యలు తీసుకుంది.
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగిస్తోంది. తొలివిడత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తోంది.
ఒంగోలు లో ఆదివారం జరిగే నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పరీక్షలు జరిగే ఒంగోలులోని ఆరు కేంద్రాలను శనివారం ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి ఆయన పరిశీలించారు.
జిల్లాలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర (సాసా) కార్యక్రమం అంతంతమాత్రంగా జరిగింది. రాష్ట్రప్రభుత్వం పరిశుభ్రత, పర్యావరణం, కాలుష్య నివారణ అంశాలను ప్రధానంగా భావించి అందుకోసం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రను చేపట్టింది.
మినిమం టైం స్కేలు (ఎంటీఎస్) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డీఎస్సీ 2008, 1998 టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించనున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) ప్రకారం వీరిని సర్దుబాటు చేయనున్నారు.