రాష్ట్రంలో ఉపాధ్యాయుల పునర్విభజన (హేతుబద్ధీకరణ), బదిలీలకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. వెంటనే ఈ ప్రక్రియ ను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది.
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి గ్రూప్ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లను మార్పు చేశారు. కొత్తవారిని నియమించారు. ఇందులో కూడా పాత తప్పులే పునరావృతమయ్యాయి. ఫలితంగా బఫర్ జాబితాల్లోంచి వందలాది మంది రెగ్యులర్ వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాల్సి వచ్చింది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం పరిధిలోకి చేరింది. జిల్లా మార్పు సమయంలో రెవెన్యూపరంగా అద్దంకి నియోజకవర్గంలోని భూములను ప్రకాశంలోకి మార్చారు.
క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రధారుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ల్లో అరెస్టయిన నలుగురు నిందితులను కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి 649 హెక్టార్లలో రెండు రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే వెంటనే పరిష్కరించడమే తన ప్రధాన అజెండా అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో జననీ చారిటబుల్ ట్రస్ట్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి శనివారం విశేష స్పందన లభించింది.
ఒంగోలు నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రజా ప్రభుత్వంశుభవార్త తెలియజేసింది.
దర్శి నియోజకవర్గంలోని పలు మంచినీటి పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ మరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారం కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా వైసీపీ సానుభూతిపరులకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు జడ్పీకి, ఇటు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారాన్ని అడ్డగోలుగా మార్చేందుకు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పినట్లు సమాచారం.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రొయ్య రైతులు వణికిపోతున్నారు. ఆక్వా రంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారం రోజులుగా ధరలు దిగజారిపోతున్నాయి.