దేశంలోనే మొట్టమొదటగా రెనవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యా క్చరింగ్ జోన్ (ఆర్ఈఎంజడ్) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీంతో అద్దంకి నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. దీనిపై విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించటంతో పరిశ్రమల ఏర్పాటు లో కీలక భూమిక అయిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా డబుల్ ఎంట్రీలు (ఒకే వ్యక్తికి రెండు ఓట్ల)పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు ‘సర్’ జరిగిన ప్రాంతాల్లో ఆ జిల్లా పరిధిలోనే డబుల్ ఎంట్రీలను పరిశీలించగా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం పంపనుంది.
దక్షిణాది పొగాకు మార్కెట్లో మళ్లీ నోబిడ్లు భారీగా పెరిగాయి. బుధవారం ఈ ప్రాంతంలోని రెండు రీజియన్లలో కలిపి సగటున సుమారు 33శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. వాటిలో ఎస్బీఎస్ రీజియన్లో 38.95శాతం, ఎస్ఎల్ఎస్ రీజియ న్లో 27.03శాతం ఉన్నాయి.
ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(REMZ) ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పారదర్శకంగా రూ.31.57 కోట్ల పరిహారం అందించామని చెప్పారు.
రెండేళ్ల కూటమి పాలన విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ కేడర్ కదిలింది. నియోజకవర్గ కీలక నేతలు పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ వివిధ ప్రాంతాల్లోని పార్టీ కేడర్ మాత్రం జోరుగా కొనసాగిస్తోంది.
గిద్దలూరు అటవీ డివిజన్ రాచర్ల బీట్ పరిధిలో వెలుగుచూసిన పులి మరణానికి కారణం వేటగాళ్లేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. నల్లమలలో వేటగాళ్ల చర్యలు కొనసాగుతున్నాయని దీనితోపాటు మరికొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి.
నగరం చుట్టుపక్కల సాగునీటి కాలువలు, పోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎన్నెస్పీ కాలువల విస్తరణ కోసమని కొంత భూమిని గతంలో కేటాయించగా అందులో ఇప్పుడు మట్టి తవ్వకాలు చేస్తుండటంతో కరకట్టలు బలహీనపడుతున్నాయి.
విద్యార్థులకు ఇచ్చే రాగిజావలో బల్లిపడింది. నలుగురికి జావ ఇచ్చిన వెంటనే గుర్తించిన ఉపాధ్యాయురాలు దాన్ని పారబోయించారు. విద్యార్థులను కొండపిలోని సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10.30 ప్రాంతంలో కె. ఉప్పలపాడు గ్రామ పంచాయతీలోని దేవిరెడ్డిపాలెం ఎంపీ స్కూల్లో చోటుచేసుకుంది.
దక్షిణాది పొగాకు మార్కె ట్లో మంగళవారం నోబిడ్లు కాస్తంత తగ్గాయి. అదేసమయంలో రోజువారీ కొనుగోలు పరిమాణంతోపాటు సగటు ధర స్వల్పంగా పెరిగింది. ఈ ప్రాంతంలోని వేలం కేంద్రాలలో సోమవారం 0.51 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.187 ధర లభించింది.
పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యపై రావూరి దిలీప్కుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అడ్మిషన్ స్థాయిలోనే తోసిపుచ్చుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేసి అసలు విచారణకు అర్హమైంది కాదని వ్యాఖ్యానించారు.