జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలను స్థాపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాలులో సోమవారం రాత్రి ఎలైట్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
గిద్దలూరు మండలం కేఎ్సపల్లె గ్రామంలో ఈనెల 27వ తేదీ జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్రాజు, ఎమ్మెల్యే మత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 99 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు తేల్చింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన 47 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ పోస్టు లు ఉన్నట్లు గుర్తించింది.
వ్యవసాయ శాఖ అధికారు లు, సిబ్బంది రైతు బాట పట్టారు. మరోసారి ‘రైతన్నా మీకోసం’ నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సోమవారం జిల్లావ్యా ప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 27వరకు కొనసాగ నుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) ఒకటో తరగతిలో విద్యార్థులు రికార్డు స్థాయిలో చేరారు. అడ్మిషన్లకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంతమాగులూరు మండల పరిధిలోని వెల్లలచెరువు- కామేపల్లి గ్రామాల మధ్య వీరహనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్సకు జీజీహెచ్ వైద్యులు ఉచితంగా అందించి నయం చేశారని జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్కుమార్ చెప్పారు.
సాంఘిక సంక్షేమ, దివ్యాంగ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి,ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవతో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం(పీఎండీవీకే) ఏర్పాటు కానుంది.
మద్యం సేవిద్దామని ఇంటి నుంచి తీసుకెళ్లి ఓ యువకుడిని హత్య చేశారు. ఈ సంఘటన సంతనూతలపాడు మండలం మంగమూరులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
శింగరకొండను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయటంతో పాటు పక్కనే ఉన్న భవనాసి చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించారు.