రామాయపట్నం పోర్టుకు సంబంధించి మరో అడుగు పడింది. పోర్టుకు అనుబంధంగా రూ.1,615 కోట్ల వ్యయ అంచనాతో కార్గో రైలు టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భవిష్యత్తులో దక్షిణాదిలో పోర్టు నుంచి సరుకు రవాణాలో అత్యంత కీలకం కానుందన్న అంచనాలను బలపరుస్తోంది.
గుంటూరు నుంచి కనిగిరి వరకూ ప్రత్యేక ప్యాసింజర్ రైలు నడపాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
మార్కాపురం జిల్లాలో అకాల వర్షం ఉద్యాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి వెన్నువిరిచింది. గాలివా నకు అరటి చెట్లు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే అరటి తోటలకు రూ. కోటికిపైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై ముందుకు సాగుతుందని ఉమ్మడి జిల్లా టీడీపీ కీలక నేతలు ఆకాంక్షించారు. ఇటీ వల ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకారం బుధవారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కొత్త కమిటీలలోని సభ్యులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.
ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మే ఒకటో తేదీన పింఛన్ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతు వులు, ఇతర కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారికి సొమ్మును ఇంటి వద్దనే ఇస్తున్న విషయం విదితమే. ఏప్రిల్కు సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. బుధ వారం ‘కార్పొరేషన్ ఖాళీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.
జిల్లాలో నెలకొన్న ఆయిల్ సంక్షోభం నుంచి ప్రజానీకానికి ఊరట లభించింది. మూడు, నాలుగు రోజులు అస్తవ్యస్తంగా సాగిన ఆయిల్ పంపిణీ వ్యవస్థ బుధవారం నాటికి కుదుటపడింది. అత్యధిక ఆయిల్ బంకుల్లో అవసరానికి సరిపడా నిల్వలు చేయడంతో వారం క్రితం నాడు ఉన్న పరిస్థితికి చేరాయి.
గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్నరీతిలో కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటివరకు అంతర్గత పారిశుధ్య నిర్వహణను ఎక్కు వగా పట్టించుకోగా ఇప్పుడు ప్రతి బుధవారం మండల కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల కనెక్టవిటీ ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది.
ఒంగోలు నగరపాలక సంస్థ అంతా ఖాళీ అయింది. మార్చి వరకు పాలకవర్గ సభ్యులు, పూర్తిస్థాయి అధికారులతో కళకళలాడిన కార్పొరేషన్ కార్యాలయం ఇప్పుడు ఇన్చార్జుల పాలనలో నడుస్తోంది. గత నెలలో పాలకవర్గ పదవీకాలం ముగిసింది.
జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నిప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.