ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి పదే పదే అవే వినతులు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో వాటిపై అధికారులు దృష్టిసారించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అన్నారు.
వాన కురిస్తే పల్లెటూళ్లలోని అంతర్గత రోడ్లపై ప్రశాంతంగా నడిచి తిరగాలంటే బురద భయపెడుతుంటుంది. రొచ్చులో నడవలేక ప్రజలు అల్లాడిపోతుంటారు.
కడలి తల్లినే నమ్ముకుని వేట సాగించడమే జీవనాధారం. బతుకుదెరువు కోసం రోజులు తరబడి కుటుంబాలను విడిచి కడలితోనే సావాసం వారి దినచర్యలో భాగం.
జిల్లా పరిషత్ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ రెండు పూర్తిస్ధాయి జిల్లాలతోపాటు కొంతభాగం బాపట్లలోకి వెళ్లనుంది.
ఉమ్మడి జిల్లాలో పోలీసులు స్పీడు పెంచారు. ఒకవైపు పెచ్చరిల్లుతున్న అసాంఘిక కార్యకలాపాల కట్టడి, మరోవైపు నేరాల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్న మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా దాడులు ముమ్మరం చేశారు. ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు ఆదేశాలతో రెండు జిల్లాల్లోని క్షేత్రస్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది స్పీడు పెంచారు. సాంకేతికతను కూడా వినియోగించుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. దీంతో నిర్జన ప్రదేశాలు, పొలాలు, ఇతర రహస్య స్థావరాలపై నిర్వహిస్తున్న కార్యకలాపాలు సైతం వెలుగు చూస్తున్నాయి. నెలన్నరగా రెండు జిల్లాల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులు, ఆ సందర్భంగా జరిగిన అరెస్టులు, నగదు స్వాదీనం వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
వెలిగొండ ద్వారా వచ్చే జూలైకి నీటి విడుదల సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినట్లు నీటిని విడుదల చేయాలంటే ఫీడర్ కాలువ నిర్మాణాలు పూర్తికావాలి. దీంతోపాటు ముంపు గ్రామాల ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రకటించిన నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది.
జిల్లాలో రెవెన్యూ అధికా రుల తీరు మారడం లేదు. ‘మేమింతే..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన పలువురిపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని కూడా వదలలేదు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పునర్విభజన (హేతుబద్ధీకరణ), బదిలీలకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. వెంటనే ఈ ప్రక్రియ ను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది.
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి గ్రూప్ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లను మార్పు చేశారు. కొత్తవారిని నియమించారు. ఇందులో కూడా పాత తప్పులే పునరావృతమయ్యాయి. ఫలితంగా బఫర్ జాబితాల్లోంచి వందలాది మంది రెగ్యులర్ వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాల్సి వచ్చింది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం పరిధిలోకి చేరింది. జిల్లా మార్పు సమయంలో రెవెన్యూపరంగా అద్దంకి నియోజకవర్గంలోని భూములను ప్రకాశంలోకి మార్చారు.