సహకార శాఖలో అనిశ్చితి నెలకొంది. ఏడాదిలోపే ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి అయిన డీసీవో పోస్టులో ఏకంగా నలుగురు అధికారులు మారడం అందుకు నిదర్శనం. పలు సహకార సంస్థలు వివాదాలలో చిక్కుకొని కీలక విచారణలు సాగుతున్న వేళ వాటన్నింటినీ సక్రమంగా సాగేలా చూడాల్సిన కీలకమైన డీసీవో పోస్టు అందుకు విరుద్ధంగా సాగుతోంది.
కోల్సొసైటీపై విచారణకు బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సహకారశాఖ ఒంగోలు అసిస్టెంట్ రిజిస్ర్టార్ సురేంద్ర బాబు బుధవారం రికార్డుల స్వాధీనం కోసం సంస్థ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనకు రికార్డులు అప్పగించాల్సిన బిజినెస్ మేనేజర్ అందుబాటులో లేరు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విదార్థులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గట్టి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎస్సీఈఆర్టీ ద్వారా 100 రోజుల కార్యాచరణ ప్రణాళి కను ప్రకటించి పాఠశాలల్లో అమలు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇంటి పన్నులను ఈనెల 15వతేదీ నాటికి నూరుశాతం వసూలు చేయాలని పంచాయతీరాజ్ ఓఎస్డీ ఆనంద్ ఆదేశించారు. ఒంగోలులోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం ఇంటి పన్నులు, చెత్త సేకరణపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలెం వెంకటరమణ (45) బ్రెయిన్ స్ర్టోక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. అసోం రాష్ట్రం దిబ్రూగడ్లో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ(ఏపీఎ్సఎ్ససీఏ) గవర్నింగ్ బోర్డు డైరెక్టర్గా మాలెంపాటి సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోనికుండా ఉన్న పర్చూరు మండలం దేవరపల్లి అర్అండ్బీ రోడ్డుకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో రహదారి అభివృద్ధికి రూ.1.76 కోట్లు నిధులు మంజూరయ్యాయి.
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు చీరాల పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రేమ విషయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
‘విచారణపై స్టే వచ్చింది. మా న్యాయవాది ద్వారా ఆ సమాచారం అందింది. తీసుకురా వాలని బిజినెస్ మేనేజర్ను ఆదేశించాం. రెండు రోజులపాటు అతను అందుబాటులో ఉండడు. ఈదృష్ట్యా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా విచారణాధికారిని ఆదేశించండి’ అంటూ కోల్ సొసైటీ అధ్యక్షురాలు సహకారశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
పనులు నిలిపివేసి ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు, పంట పొలాల్లో మోటార్ల కేబుల్ వైర్లను చోరీలు చేస్తున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను బల్లికురవ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో సంతమాగులూరు సీఐ కాకుమాను వెంకట్రావు, ఎస్ఐ యామినేని నాగరాజు వెల్లడించారు.