సేవలను సరళతరం చేయాల్సిన ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం రైతుల విషయంలో మరింత గందరగోళం సృష్టి స్తోంది. వారికి నష్టం కలిగిస్తోంది.
జిల్లా అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో టంగుటూరు మండలం మర్లపాడు సమీపంలో రూ.1,230 కోట్ల పెట్టుబడితో ఇనుప శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
జిల్లాకు తలమానికంగా, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఆయువుపట్టుగా భావిస్తున్న రామాయపట్నం పోర్టు తీరప్రాంత పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణ యం తీసుకుంది. మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమా వేశం పోర్టుపై పలు కీలక తీర్మానాలు చేసింది.
పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణపై బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ధరలు సరిలేక రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేపట్టిన నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం కావడం, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి సమీక్ష చేసి రైతుల తరఫున గట్టిగా మాట్లాడటంతో బోర్డు అధికారులు కదిలారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రామాణికంగా పాఠశాలల్లో మిగులు టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
కందుకూరు మండలం మహదేవపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏడు లీటర్ల పెట్రోలుకు రూ.12లక్షల నిధులు డ్రా చేయడంపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ మండిపడ్డారు.
ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 2 కిలోల 350 గ్రాముల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసి రాలేదు. ఉలవపాడు స్పెషల్ రకం కాయలకు ధరలు లేక అందరూ దిగాలు పడ్డారు. కొందరు వచ్చిన కాడికి అమ్ముకొని నష్టాలపాలయ్యారు.