రబీ సీజన్లో సాగుచేసిన వరి పంట దిగుబడులు అధికంగా వస్తున్నాయి. మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభిస్తోంది. లాభాలు కనిపిస్తుండటంతో మాగాణి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాగర్ ఆయకట్టు కింద రబీలో సాగు చేసిన వరి కోతలు కోసి ముమ్మరంగా కల్లాలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇంటి పన్నులు, ఐవీఆర్ఎస్ కాల్స్ను పర్యవేక్షించేందుకు మూడు కమిటీలను నియమించారు. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్త ర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
‘గుండె ధైర్యానికితోడు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితితినైనా ఎదుర్కోవచ్చు.. అందుకు నాడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యే ఏలూరి చూపిన తెగువే నిదర్శనం.. అదేనాకు స్ఫూర్తినింపింది.. మీకూ స్ఫూర్తి కావాలి’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లో కేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు.
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 14, 15వ తేదీల్లో సింగరాయకొండ మండలం పాకలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ లోగోను శుక్రవారం ఆయన రాయల్ రీసార్ట్లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, కలెక్టర్ పి. రాజాబాబులతో కలిసి ఆవిష్కరించారు.
శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా ఉంది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ పథకం ఏర్పాటుచేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమెల్యే కొండయ్య చెప్పారు.
చీరాల పట్టణం, పేరాల ప్రధాన రహదారులు అడుగడుగున ఆక్రమణలకు గురవుతున్నాయి.
అనుమతి లేకుండా తెల్లరాయిని తీస్తున్న క్వారీపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు.
ఆర్టీసీ బస్టాండ్లోనిమరుగుదొడ్లకు అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ను గురువా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులకు విలువ లేకుండా పోయింది. ఈ వ్యవసాయ ఉత్పత్తులను తనఖా ఉంచుకుని గతంలో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చేవారు. వివిధ కారణాలతో వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు.