ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలను పెంచాయి.. ఈ ఏడాది మార్చి నెలలో పనిదినాలు ప్రారంభం నుంచి శ్రామికుల ముఖహాజరు విధానం తప్పనిసరి చేస్తూ అమల్లోకి తీసుకొచ్చింది.
జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరాలో అంతరాయం ప్రజలకు తలనొప్పిగా మారింది. ఆ ప్రభావం పలు వ్యాపార సంస్థలు, వీధి దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్లు, హోటళ్లపైనా చూపుతోంది. దీంతో కొందరు వ్యాపారులు తాత్కాలికంగా హోటళ్లు, దుకాణాలను మూసివేశారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీల్లో అవినీతి పెరుగుతోంది. మొక్కల మాటున పెద్దఎత్తున నిధుల దోపిడీ జరుగుతోంది. గత వైసీపీ హయాంలో ఆపార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీ మొత్తంలో బొక్కేశారు.
ఉమ్మడి జిల్లాలో పంటలు చేతికందే దశలో అకాల వర్షం నష్టపరిచింది. 1,292 మంది రైతులకు చెందిన 1,182 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
క్రికెట్ బెట్టింగ్ల మూలాలను ఛేదిం చేందుకు పోలీసుల ప్రత్యేక బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. అనేక జిల్లాలకు చెందిన వ్యక్తులు బెట్టింగ్లలో కీలక పాత్ర పోషిస్తు న్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ సర్వే రెండు జిల్లాల్లో వేగవంతంగా సాగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక రాబడిపై అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరణతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రోత్సాహం లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే.
కలెక్టర్ రాజాబాబు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) సమర్థవంతంగా వినియోగంపై సోమ, మంగళవారాల్లో జాతీయస్థాయి సమ్మిట్ను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో మైనింగ్ అధికంగా ఉండే జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర సంబంధిత శాఖ కీలక అధికారులను ఆహ్వానించింది.
రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. సోమవారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ప్ర జాదర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇన్చార్జి ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు.