విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కడ పనిచేసినా ఆయన వక్రబుద్ధి మారడంలేదు. 2006లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన అతను ఇప్పటికే అసభ్యప్రవర్తనతో రెండుసార్లు, గృహ హింస కేసులో ఒకసారి సస్పెండ్ అయ్యారు.
నిరుద్యోగ యువతీయువకులకు జాబ్ మేళాతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.
మండలంలోని గానుగపెంటలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. గ్రామంలో ఉన్న డీప్ బోర్లు ఇంకి పోవడంతోపాటు సాగర్ జలాలు 4 రోజులకు ఒకసారి వస్తుండడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎక్కువగా పశు పోషణపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నీటి సమస్య తలెత్తడంతో పశువులకు కూడా పొలాల్లోనే నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకుందని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు అం డగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి మండలం పునుగో డు గ్రామానికి చెందిన తోకల చిననరసయ్య గత మా ర్చిలో ప్రమాదవశాత్తు కరెంట్ ట్రాన్స్ఫార్మర్పై పడటం తో షాక్కు గురై మృతి చెందారు.
వన సంరక్షణతోనే భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక కంభం రోడ్డులోని కనిగిరి నగరవనంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
సాగర్ నీటి పంపిణీలో వివక్ష కొనసాగుతోంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎగువ ప్రాంతంలోని కాలువలకు అధిక నీరు విడుదల చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్ కాలువకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు అంటున్నారు.
జిల్లావ్యాప్తంగా బుధవారం అన్నదాతల్లో సంబరం కనిపించింది. రెండో విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల ద్వారా నగదు సాయం అందజేత కార్యక్రమం కోలాహలంగా సాగింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)ల వద్ద ప్రత్యక్షంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్ 51 విచారణ మూడో విడత బుధవారం సాగింది. విచారణాధికారైన సహకారశాఖ అడిషనల్ కమిషనర్ గౌరీశంకర్ ఉదయం బ్యాంకుకు వచ్చి రుణ మంజూరులపై దృష్టి సారించారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. అడ్డగోలు దోపిడీ, అక్రమ వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. బోగస్ గ్రూపుల పేరుతో ఆర్పీలు దోచుకున్న సొమ్ముకు లెక్కాపత్రం లేకపోయినా కనీస చర్యలు కరువయ్యాయి. తాము మోసపోయామని బాధితులు బోరు మంటూ ఆ శాఖ అధికారికి విన్నవించినా విచారణ పేరుతో జాప్యం చేయడం షరామామూలైంది.
మార్కాపురం సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న సహదిత్ వెంకట్ త్రివినాగ్ను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న బదిలీ చేసింది. ఆయన 23వతేదీ వరకు మార్కాపురంలో విధుల్లో ఉన్నారు. తర్వాత బదిలీ అయిన స్థానానికి వెళ్లిపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు వెలిగొండ ప్రాజెక్టు కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.