ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఏర్పాటు కానుంది. త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నారు. అందు కోసం కేటాయించిన స్థలంలో శనివారం జంగిల్ క్లియరెన్స్ పనులు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో ప్రారంభమయ్యాయి.
సమగ్ర ప్రణాళిక, నిరంతర సాధనతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులే అందుకు నిదర్శనమన్నారు.
సూరీడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్కాపురం జిల్లాపై నిప్పు లు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి వడగాడ్పులు తోడయ్యాయి.
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అధికారిక పాలనా వ్యవహారాలు ఇంకా కుదుట పడలేదు. ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగుల కొరతే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
జిల్లావ్యాప్తంగా శుక్రవారం సామాజిక పింఛన్ల పంపిణీ సందడిగా సాగింది. పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కీలక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారపార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులతోపాటు అధికారులు పాల్గొంటున్నారు.
సాగులో ఉపకరించే వ్యవ సాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. గతానికి భిన్నంగా ఈసారి పూర్తి పారదర్శకంగా సాగేలా ప్రభుత్వం నిర్ణయిం చింది.
జిల్లాలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న బి.చినఓబులేశును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవోగా బదిలీ చేసింది.
ఇళ్ల మీద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలపాటు కరెంటు సరఫరాకు అవసరమయ్యే విద్యుత్ను సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసే చర్యలను వేగవంతం చేసిం ది.
చాకలికుంటలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులలో కదలిక వచ్చింది. శుక్రవారం ‘చాకలికుంట గుల్ల’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో మైనింగ్ శాఖ ఆర్ఐ రాజానాయుడు కొంతమంది సిబ్బందితో కలిసి అక్రమంగా తవ్వకాలు చేసిన కొప్పోలులోని చాకలికుంటను పరిశీలించారు.
జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసే కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం ఆ దిశగా సాగుతుందా అన్న ప్రశ్న నెలకొంది. అందుకు ఇంతకు ముందు సమావేశాలు మొక్కుబడిగా సాగడమే కారణం.