తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు కాస్తంత వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో సైతం ఊపందుకుంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఇంచుమించు సగం లక్ష్యం పూర్తిచేసినట్లు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
వైసీపీలో విభేదాలు, వివాదాలు ముదిరిపోయాయి. ఎన్నడూ లేని వి ధంగా ఆ పార్టీ నాయకులు రోడ్డుకెక్కుతున్నారు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారన్న కార ణంతో ఇద్దరు మహిళలపై వేటు వేయగా అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది.
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజె క్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. వీరికి కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది.
బియ్యం ధరల నియంత్రణపై ప్రజాప్రభుత్వం దృష్టి సారించింది. కొంతకాలంగా బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండ టంతో అందుకు గల కారణాలను తెలుసుకు నేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న రైస్మిల్లులను తనిఖీలు చేసి అక్కడ ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరా లను వెంటనే నివేదించాలని ఆదేశించింది.
సీఎం చంద్రబాబుకు అన్నం మహిత అరుదైన కానుకను బహూకరించారు. 40 రోజుల పాటు శ్రమించి 70 పెన్సిల్ లిడ్లపై సూక్ష్మ అక్షరాలతో ఆయన జీవిత చరిత్రను చెక్కారు.
చీరాలలో ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనతో ఫొటో దిగాలన్న ఆమె కోరికను సీఎం స్వయంగా నెరవేర్చారు.
తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే శనివారం వస్తే హైదరాబాద్ నుంచి విపరీతంగా పర్యాటకులు చీరాల, సూర్యలంక బాట పడుతున్నారన్నారు. మరో గోవాగా ఇక్కడి తీరాన్ని మార్చబోతున్నామని సీఎం చెప్పారు. చీరాల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్ని నేత న్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు.
పొగాకు మార్కెట్ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎలాగైనా సరే గాడిలో పెడదామని అటు ప్రభుత్వం, ఇటు బోర్డు తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. అంతా వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది.
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు శుభవార్త. వారికి చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి రెండో విడత మరో రూ.300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయ నుంది. ఈమేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
పాడి పరిశ్రమపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. పాల దిగుబడి భారీగా తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు ప్రారంభంలో పాల దిగుబడి సుమారు 2 లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 1.20 లక్షల లీటర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది.