మండలంలోని జేపీచెరువు సమీప నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం అభివృద్ధికి అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయి. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా అధికారులు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మెరిశారు. 94.72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు.
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామ పొలాల్లో ఒక అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. కొద్దిరోజుల క్రితం నేలకొరిగిన ఒక రావి చెట్టు, తిరిగి తనంతట తానుగా యథాస్థానానికి చేరుకోవడం చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు.
జిల్లాలో ఆదివారం రాత్రి అకాల వర్షం, ఆపై భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ భారీగా దెబ్బతింది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపోయాయి. కరెంటు తీగలు తెగిపోయాయి.
మార్కాపురం జిల్లాలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతలు భూ బకాసురులుగా మారి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. వాటిని ఆన్లైన్ చేయిం చుకొని కొందరు అధికారుల ఉద్యోగాలకు కూడా ఎసరు తెచ్చారు.
తెలుగుదేశం పార్టీఒంగోలు పార్లమెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి ఈనెల 6వ తేదీన భూమిపూజ నిర్వహిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే, ఆపార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సోమవారం నుంచి రెమెడియల్ క్లాసులు ప్రారంభించారు. ఈనెల 25 నుంచి మొదలయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు వారిని సంసిద్ధులను చేయనున్నారు.
దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిరస్కరణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వారం నుంచి వీటిశాతం అధికంగా ఉంటోంది. సోమవారం ఏకంగా 42.17శాతం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
దక్షిణాది పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా పయనిస్తోంది. రైతులు ఆశించిన విధంగా ధరలు పెరగకపోగా కొనుగోళ్లు మందగిస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. అజెండాలో 10 అంశాలను పొందు పర్చినా కేవలం ఆరింటికే పరిమితమైంది.