సింగరాయకొండ, మండలంలో పాకల బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 14, 15 తేదీల్లో అబ్చురపరిచేలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం పాకల బీచ్లో కలెక్టర్ రాజాబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీని ఆవిష్కరించారు.
అనాదిగా చీకట్లో మగ్గుతున్న గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గిరిజన తాండాలో సోలార్ లైట్లను శుక్రవారం పొద్దుపోయాక లబ్ధిదారులతో కలసి మంత్రి ప్రారంభించారు.
దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు తొలి అడుగు పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్ పథకం అమలుకు టెండర్లు ఖరారయ్యాయి. గతంలో అనేకసార్లు టెండర్లు పిలిచినప్పటికీ అనివార్య కారణాలతో ఖరారు కాకుండా రద్దయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. అందులో భాగంగా అమృత్ పథకం-2 అమలుకు శ్రీకారం పలికింది. పదిరోజుల క్రితం టెండర్లు ఖరారయ్యాయి.
ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్సొసైటీపై సహకారశాఖ అధికారులు చేపట్టిన విచారణ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి(డీసీవో) గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేయగా శనివారం ఆ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరాయి.
వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మి సొంతిల్లు వస్తుందని ఆశపడి మోసపోయిన పేదలు నేడు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూకబ్జాలు చేయడం, వాటిని అమాయకులకు అంటగట్టడం యథేచ్ఛగా జరిగిపోయాయి. తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు అంటూ ఎరవేసి మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ. 3లక్షలు వసూలు చేసి, ఆపై మాయమయ్యారు. సిట్ అరెస్టులతో కొందరు జైలుపాలు కాగా, కొందరు తప్పించుకుతిరుగుతున్నారు. తీరా అసలు యజమానులు సీన్లోకి రావడంతో అక్రమాల బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఒంగోలుకు ఉత్తరం వైపున కార్మికనగర్ పేరుతో ప్రైవేటు భూముల్లో వెలసిన ఇళ్లను హక్కుదారులు తొలగించడం ఇప్పడు వివాదంగా మారింది.
ఉపాధి హామీ మెటీరియల్ కోటా నిధుల సద్వినియోగంపై డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనుల విషయంలో ఇటీవల కేంద్రం పెట్టిన ఆంక్షలను అధిగమించి అందుబాటులో ఉన్న నిధులు మురిగిపోకుండా చేసేలా చర్యలు చేపట్టారు.
గనుల శాఖలో సర్వేయర్గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ కోట్లు కూడబెట్టాడు. అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో ఒంగోలు మైనింగ్ కార్యాల యంలో ఉన్న అబ్దుల్ ఆసిఫ్ను అదుపులోకి తీసుకొన్నారు.
వినియోగదారులకు లోవోల్జేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇప్పటికే పలు సంస్కరణలు చేశామని చెప్పారు.
రానున్న పొగాకు సీజన్లో ధరలు ప్రతికూలంగా ఉంటాయన్న సంకేతాలు ఇటు రైతులు, అటు బోర్డు అధికారుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. సిగరెట్ల విక్రయాలపై జీఎస్టీ 40శాతానికి పెంపు, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధింపు తీవ్ర ప్రభావం చూపనుంది.
పొగాకు బోర్డు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని కర్ణాటకకు, అక్కడపనిచేస్తున్న వారిని ఇక్కడకు స్థానచలనం కల్పించారు. అలాగే ఆంధ్ర లో కూడా దక్షిణాది ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఉత్తరాది రీజియన్కు, కొందరిని గుంటూరులోని హెడ్ ఆఫీస్కు బదిలీ చేశారు.