పొగాకు మార్కెట్ ఆరంభమే రైతులను నిరాశపరిచింది. గరిష్ఠ ధరలు భారీగా తగ్గాయి. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా కాకపోయినా కనీసం గత ఏడాది వేలం ప్రారంభం రోజున ఇచ్చిన ధర కూడా దక్కకపోవడం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
రాష్ట్రం లోని దివ్యాంగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. సామాజిక భద్రత పింఛన్లు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందడానికి తప్పనిసరి అయినసదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుకింగ్ను పునఃప్రారంభించింది.
రబీలో సాగుచేసిన వరి పంట దిగుబ డులు ఇళ్లకు చేరుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
గ్యాస్ సమస్యను అధిగమించేందుకు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కరెంటు పొయ్యి (ఇండక్షన్ స్టవ్)లను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఈసీపీ కింద రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా దీన్ని అమలు చేస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటి పన్నుల వసూలుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూరుశాతం రాబట్టాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వచ్చేనెల 15వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీశైలం ఆనకట్ట వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎ్ఫ(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ పిల్లి వీరాస్వామీ(52) తేనెటీగల దాడిలో మృతి చెందారు.
గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగిస్తేనే తాగు, సాగునీరు అందుతుందని నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ చెప్పారు.
ఒంగోలు కార్పొరేషన్ జనాభాకు అనుగుణంగా, నగర పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డులు, డివిజన్లను పునర్విభజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అద్దంకి మండల పరిధిలోని ధేనువకొండ పునరావాసకాలనీకి చెందిన పాలపర్తి సుధాకర్ డెంగ్యూతో ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.