• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు

ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేఎ్‌సపల్లి పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు కె.ఎ్‌స.పల్లెకు వచ్చి సాయంత్రం 5.15 గంటల వరకు గడపనున్న నేపథ్యంలో విస్తృతంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిరీక్షణకు తెర

నిరీక్షణకు తెర

వారంతా వెలిగొండ నిర్వాసితులు. లక్షలాది మంది ప్రజల క్షేమం కోసం ఎంతోకాలంగా నివాసముంటున్న ఇళ్లు, భూములు, చివరకు గ్రామాలనే వదిలేసుకున్న త్యాగధనులు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం తమకు ప్రకటించిన పరిహారం కోసం ఎదురు చూశారు. వారి నిరీక్షణకు ప్రజాప్రభుత్వం తెరదించింది.

27న వెలిగొండకు సీఎం చంద్రబాబు

27న వెలిగొండకు సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 27న దోర్నాల మండలం గంటవాని పల్లెకు వస్తున్నారు. అక్కడ వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ పనుల పురోగతిని పరిశీలించను న్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెక్కులను అందజేయనున్నారు.

సత్వర వైద్యసేవలే లక్ష్యం

సత్వర వైద్యసేవలే లక్ష్యం

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త విధానానికి సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లి (కేఎస్‌పల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంజీవిని డిజిటల్‌ సర్వ్‌ను ఈనెల 27న ప్రారంభిం చనున్నారు

కుదుటపడని మార్కెట్‌

కుదుటపడని మార్కెట్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వారం గడుస్తున్నా పొగాకు వ్యాపారుల్లో స్పందన లేదు. బోర్డు యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తున్నప్పటికీ దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడ లేదు. గతంతో పోల్చితే అన్ని కేంద్రాల్లో వేలం సాఫీగా సాగడంతోపాటు నోబిడ్‌లు తగ్గినప్పటికీ రైతులు ఆశించిన లేదా సీఎం ఆదేశించిన విధంగా ధరలు పెరగలేదు.

వైసీపీ అసత్యాలను తిప్పికొట్టండి

వైసీపీ అసత్యాలను తిప్పికొట్టండి

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డంతోపాటు వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. తెలు గుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ విస్తృతస్థాయి సమావేశం బుధవారం ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ చీప్‌ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ప్రమాదం

పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ప్రమాదం

కుటుంబంలోని యువతి పెళ్లిచూపుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని వెంగళాయపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్టు ఆటో డ్రైవర్‌ చెబుతున్నారు.

పనిసర్దుబాటుకు షెడ్యూల్‌ విడుదల

పనిసర్దుబాటుకు షెడ్యూల్‌ విడుదల

ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మునిసిపల్‌ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈనెల 20వతేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు టీచర్లను గుర్తించాలి.

ప్రైవేటును వీడి ప్రభుత్వ బడికి..

ప్రైవేటును వీడి ప్రభుత్వ బడికి..

మండలం లోని వెంగళాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో బుధవారం ఒక్కరోజే 35 మంది విద్యా ర్థులు ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. పెదయిర్లపాడు, పీసీపల్లి, అన్నపురెడ్డిపల్లి తదితర గ్రామాల నుంచివిద్యార్థులు వెంగళా యపల్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యాబోధనకు ఆకర్షితులై చేరారని మండల విద్యాధికారులు ఆర్‌.శ్రీనివాసులు, జి.సంజీవ్‌ తెలిపారు.

డీపీవోగా అనుపమ బాధ్యతల స్వీకరణ

డీపీవోగా అనుపమ బాధ్యతల స్వీకరణ

జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎం.అనుపమ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని డ్వామాలో డీవీవోగా పనిచేస్తున్న అనుపమను ఈనెల 16న ఇక్కడ డీపీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.



తాజా వార్తలు

మరిన్ని చదవండి