స్టైఫండ్ను పెంచా లని డిమాండ్ చేస్తూ పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సమ్మెకు దిగా రు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం విధులను బహిష్కరించి ఒంగోలులోని జీజీహెచ్లో నిరసన చేపట్టారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజాప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జిల్లాకు ఏడు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102) వాహనాలను కేటాయించింది. అవి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన టీచర్లు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీరేణుక మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది.
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సింగరాయకొండ మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్స్పాండర్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడారు
కనిగిరిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
వయస్సు పెరిగే కొద్ది ప్రెస్టేషన్ పెరుగుతున్నట్టుంది.. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని జనసేన పార్టీ నాయకుడు బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కూటమిలో భాగస్వామ్యం ఉన్నందున తాను ఏమి మాట్లాడకుండా హైదరాబాద్లో ఉన్నానని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీలో వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కరువు, వర్షాభావ సమయంలో ముసి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజల నీటి ఇక్కట్లను తీర్చేందుకు ఉద్దేశించిన సాగర్ జలాలను ముసికి మళ్లించే పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి చేసిన కృషి ఫలించింది.