తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఘటన బీమిలీ పట్టణంలో చోటుచేసుకుంది. సరగడ అప్పలరెడ్డి (42) అనే వ్యక్తి బీచ్లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటమునిగారు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు.. ఆయనను పట్టుకుని ఒడ్డుకు చేర్చి.. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
లారీని తుపాన్ వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతిచెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పని చేసుకుంటున్న ఓ గ్రామస్థుడిని విచారణ పేరుతో బలవంతంగ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.
నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.
తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.
Jagan Tour: నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పర్యటన వేళ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగరంలో ఎటు చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో హైటెన్షన్ వాతవరణం ఏర్పడింది.
Anil Kumar: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మరి ఈసారైనా ఆయన విచారణకు హాజరవుతారా? లేదా ? చూడాలి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ నెల 31వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్చార్జి ఎస్పీ దామోదర్ మాట్లాడారు.