మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు రాష్ట్ర మహిళల తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.
ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రి అనగాని ఆరోపించారు. గత ప్రభుత్వం తొందరపాటు తనంలో విభజన చేపట్టిందని విమర్శించారు.
ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మేరకు ప్రతి గ్రామంలో ఫేకల్ స్లజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 77 FSTP ప్లాంట్ల నిర్మాణానికి రూ.115.5 కోట్ల మంజూరు చేస్తూ.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది
స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని తెలిపారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత,రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు.. సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు.. సరిహద్దుల మార్పులపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి కానుంది.