Nellore Police High Alert: నెల్లూరు జిల్లా కోర్టులో కొన్నేళ్ల క్రితం బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు కుక్కర్లో బాంబు పెట్టి పేల్చారు. అదే తరహాలో కేరళ, తమిళనాడు, చిత్తూరులో కూడా సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిపై ఎన్ఐఏ విచారణ జరిపింది.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
Minister Narayana: ఏపీవ్యాప్తంగా స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు.
Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Dowry Harassment: నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను చూస్తే ఆడపిల్లలు పెళ్లి అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందేమో. ఆ మహిళపట్ల అత్తింటి వారు ప్రవర్తించిన తీరు చూస్తే కన్నీరుపెట్టకుండా ఉండలేరు.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.