గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్ఎంపీ, పీఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా పేర్కొన్నారు.
మండలంలోని కల్లపరి దుర్గమ్మదేవి ఆలయంలో గత నెలలో హుండీ కానుకలు చోరీ చేసిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వ్యవసాయ మార్కెట్ యార్డు ప్లాట్ ఫారంపై సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో 10బోరాల పత్తి కాలిపోయింది.
మండలంలోని దైవందిన్నె గ్రామ పరిధిలో తెలంగాణకు చెందిన సీడ్ ఆర్గ్గనైజర్ ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలను సాగుచేసి రైతులు నష్టపోయిన పంటను ఎమ్మిగనూరు వ్యవసాయ అధికారులు పరిశీలించారు.
కర్నూలు జిల్లాలో కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు
కొద్ది రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్థానిక సంత మార్కెట్లో వినియోగదారులు అధిక సంఖ్యలో కూరగాయలను కొనుగోలు చేస్తూ కనిపించారు.
మండలంలోని వర్కూరు న్యూఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజర య్యారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక అడిష నల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అధికారులను ఆదేశించారు.
తుంగభద్ర నదిలో ఇసుక లోడింగ్ టెండర్లకు రాజకీయ గ్రహణం వీడింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో ఓ వర్గం టెండర్ల నుంచి తప్పుకుంది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.