నంద్యాల జిల్లా బనగానపల్లెలో రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషనకు నిధులు విడుదల చేయాలని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి కోరారు.
‘సర్’ ప్రక్రియలో భాగం గా 11, 12 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన డేను నిర్వహిస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
ఫారెస్టు సబ్ డివిజనులోని చెలిమ రేంజ్ పెద్దకంబలూరు సెక్షన్ పరిధిలో వెదురు అక్రమ రవాణాకు తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మండలం తిమ్మనాయినిపేట చెరువును నీటితో నింపాలని మండల రైతులు కోరుతున్నారు. మండలానికి 1 టీఎంసీ నీఇని నింపుకునే అవకాశం ఉంది.
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం 5వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కోడుమూరు పట్టణానికి తాగునీటి గండం ముంచుకు వస్తోంది. హంద్రీ నదిలో నీరు ఇంకిపోతోంది. హంద్రీ నదిలో నీరు ఉంటే కూడా 5 రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నది ఎండిపోతే 10రోజులకోసారి కూడా నీటిని విడుదల చేయడం కష్టతరంగా మారుతోంది. ప్రజలకు హంద్రీనదినే తాగునీటికి ప్రధాన ఆధారం. యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఇసుక దోపిడీని అరికట్టి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.