వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరంలో పాటుగా ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.
శ్రీశైల శిఖరానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
మండలంలోని జుమాలదిన్నె గ్రామంలో శనివారం కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటి ల్లింది. ఈదురుగాలుల ధాటికి గ్రామంలో సుమారు 50కి పైగా విద్యుత్ స్తంభాలు, 6 భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. వీటితో పాటు 33కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ కిట్ కూడా దెబ్బతిం దని మండల విద్యుత్ శాఖ ఏఈ వీరేష్ తెలిపారు.
తుంగాతీరాన కొలువై ఉన్న ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది.
మండంలోని మీర్జాపురం గగ్రామమానికి చెందిన వైసీపీ నాయకులు దాదాపు 100 కుటుంబాల వారు టీడీపీలో చేరారు
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
మండలంలోని ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిశారు.
పాఠశాలలకు సెలవులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండడం లేదు, దీన్ని గమనించిన ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.