ఆళ్లగడ్డ పట్టణంలోని యాబై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయ్యాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోఆరు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ వైద్య సదుపాయాలు సక్రమంగా లేక తన తల్లితండ్రులు భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిని కాపాడుకోలేక పోయామన్నారు
పట్టణ పరిసరాల్లో భూ ఆక్రమణదారులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు... రికార్డులు మార్చేయడం, రాత్రికిరాత్రే వెంచర్లు వేసేయడం పరిపాటిగా మారింది. తాజాగా శుక్రవారంపేట పర్వతాపురం గ్రామ పరిధిలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ రస్తా పరంబోకు భూమిపై వైసీపీ నాయకుల కన్ను పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో 2024 - 25 సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి రూ.9కోట్లతో జరిగిన పనుల్లో రూ.23,645 అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చడంతో మండలంలో తనిఖీల బృందంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హత్యకు గురైన ఎమ్మార్పీఎ్సఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో సోషల్ ఫారెస్టు నర్సరీల ద్వారా సామాజిక అడవులు పెంచాలి. ఆర్అండ్బి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలి. అధికారులు వ్యవహారం వల్ల ఈ లక్ష్యం నెరవేరేనా? అనే సందేహం కలుగుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పనులు అస్థవ్యస్తంగా మారాయి. పాఠశాలల రూపురేఖలను మారుస్తామంటూ ఆర్భాటం చేసి అనంతరం వదిలేయడంతో అటు పూర్తికాక, ఇటు ఉపయోగించుకోలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన డిమాండ్ చేశారు.
నగరంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ముగిశాయి. వివిధ దేవాల యాల్లో తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వ హించారు.
హరహర మహాదేవ
గ్రామాల్లో పారిశు ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ అన్నారు.