దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని హోటల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునెప్ప, సీనియర్ నాయకుడు మనోహర్ మాణిక్యంలు డిమాండ్ చేశారు.
నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబు లేసు అన్నారు.
మంత్రాలయం పట్టణం రాఘవేంద్రపురం కాలనీలోని వెంకటేష్ శెట్టి ఇంట్లో తలుపులు పగలకొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. నదితీరంలో బొమ్మల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ శెట్టి అతని భార్యతో కలసి బుధవారం రాత్రి బెంగళూరు వెళ్లారు.
పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకున్న యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, ఇనపు రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత తెలిపారు. గురువారం నంద్యాల ఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆయకట్టు సాగుపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలతో జిల్లా ఇన్చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగు, తాగునీరు విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
పుర పోరుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగరపాలక మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేసింది.
రోగులపై బాధ్యతను విస్మరించం
కర్నూలులో హైకోర్టు బెంచ్ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.