విద్యార్థులు మాదక ద్రవ్యాల మత్తు వదలాలని నంద్యాల అడిషనల్ ఏఎస్పీ ఎం. జావళి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ప్రభుత్వ సెలవుతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి పోయాయి.
రెండున్నరేళ్ల పాటు కష్టపడి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్లను నరికేయడంతో రూ.10లక్షల నష్టం వాట్టిల్లిందని రైతు ఆవేదన చెందాడు. ఈ ఘటన గురువారం జరిగింది. మండలంలోని బొందిమడుగులకు చెందిన రైతు నవీన్కుమార్ రెడ్డి తన పొలంలోని 260 మామిడి చెట్లు, 120 టెంకాయ చెట్లును నరికేశారని తుగ్గులి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
స్కూల్లో సీటు ఇవ్వండి సార్.. చదువుకుంటా అని ఓ బాలిక గురువారం కోసిగి కస్తూర్బా బాలికల విద్యాలయం ముందు ఆదోళనకు దిగింది. కౌతాళం మండలం కరిణి గ్రామానికి చెందిన మహాదేవి, గోవిందు దంపతులు బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు.
కోవెలకుంట్ల పట్టణాభివృద్ధే లక్ష్యమని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు వీధుల్లో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పరిశీలించారు.
మండలంలోని చనుగొండ్ల గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా, దాదాపు 2వేల మంది నివస్తున్నారు. రెండు నెలలుగా సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామలోని మంచినీటి బావిలో నీరు అడుగంటడంతో తాగునీటి కొరత తీవ్రంగా మారిందని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మండలంలోని కోటకొండ రెవెన్యూ కె.కొత్తూరు గ్రామంలో 571/1ఎ పోరంబోకు భూమి మొత్తం 1.30 సెంట్లు ఉండగా, ఇందులో 10 సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఒ వ్యక్తికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి.
యువత దేశ భవిష్యత్తుకు పునాదులు అని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సెట్కూరు సీఈవో వేణుగోపాల్ సూచించారు.
పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో గురువారం నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్ వెలువడి ఉద్యోగాల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి పెన్షన్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.