హైదరాబాద్-బెంగళూరు 44వ నెంబర్ జాతీయ రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మండలంలోని ప్యాపిలి, వెంగళాంపల్లి, పోతుదొడ్డి, ఏనుగమర్రి గ్రామాల వీదుగా దాదాపు 20కి.మీ. మేర జాతీయ రహదారి ఉంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, ఇతర రాష్ట్రాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
కొడుకుపై పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి డిమాండ్ చేశారు.
నగరంలో హనుమజ్జయంతి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రభుత్వ బడి నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనా పాలన, బడి నిర్మాణం... ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరిందని, డబ్బులు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు.
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయి. ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.200 దాకా అదనంగా పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం వైసీపీ నాయకులు కూటమి నేతలతో కలిసి పని చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
జిల్లాలో జలధార - జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భజలాలను పెంచడం, చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు అందించడం తమ లక్ష్యమని కలెక్టర్ డా.ఏ. సిరి అన్నారు.
మామిడి, అరటి పం డ్లను మాగపెట్టడానికి కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉప యోగించరాదని, సహజ పద్ధతి, చీకటి గదిలో గాలి ప్రవేశం తక్కువగా ఉండేలా నిల్వచేయాలని నంద్యాల జిల్లా పుడ్ సేఫ్టీ అధికారులు వెంకట రాముడు, కాశింవలి పండ్ల వ్యాపారులకు సూచించారు.