ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయా ధికారి జి.కబర్ధి తెలియజేశారు.
రాష్ట్రంతో పాటు బనగానపల్లె నియోజకవర్గంలోను అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆత్మవిశ్వాసం కోల్పోయి పిచ్చిపట్టినట్లు మాట్లాడు తున్నారని రోడ్లుభవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు.
ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ కాంతులు అందించిన శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులు నాలుగు దశాబ్దాలుగా అంధకారంలోనే మగ్గిపోతున్నారు.
చిన్నచిన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించకుండా లోక్ అదాలత్ను ఆశ్రయిస్తే సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గంలో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి శిరీష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు, ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం పేర్కొన్నారు.
చర్చిల్లో ప్రార్థనలు ముగిం చుకొని స్వగ్రామానికి వెళ్తూ తల్లీకూతురు అనంతలోకాలకు చేరారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
‘హలో సర్.. బీఎల్వోనూ మాట్లాడుతున్నాను. సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్ కోసం మీ ఇంటికొచ్చాను. ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇచ్చి, సామాజిక భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజి బాబు, శ్రామిక మహిళా కన్వీనర్ పి. నిర్మల డిమాండ్ చేశారు.
జిల్లాలోని సహకార సంఘాల పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.