రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ నాయకులు పోతిరెడ్డి పాడు వద్ద దీక్షలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు.
మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది.
క్యాన్సర్ నియంత్రణకు అవగాహనే ప్రధాన ఆయుధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
నగర శివారులోని గార్గేయపురం డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను మార్చి నెల ఆఖరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఆధునిక యుగంలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో అంతులేని ఆలస్యం ఆన్నదాత ఆకలి కేకలకు సంకేతంగా మారింది.
ఈనెల 6వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శరవేగంగా సాగుతున్నాయి.
సైబర్ క్రైమ్లో మరో కొత్తకోణం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో మహిళలకు కామెంట్లు చేసే వ్యక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసే అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు ఇరువురిని కోవెలకుంట్ల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
మండల పరిధిలోని నాగలూ టి, పైపాలెం గ్రామల పరిధిలో మైనింగ్ ప్రదేశాన్ని మెస్సర్సు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పర్యావరణ అనుమతులపై బుధవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో నాగజ్యోతి, పర్యావరణ పరిరక్షణ ఈఈ కిశోర్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
హౌసింగ్ బిల్లులు సంవత్సరమైనా మంజూరు చేయలేదని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన చెంచుకాలనీ మహిళలు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాల యం వద్ద ఆందోళన చేశారు.
గతంలో వైసీపీ నాయకులకు భూకబ్జాలే ఆభరణాలుగా మారాయని ఆళ్లగడ్డ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.