: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు
: ‘ఏబీఎన-ఆంధ్రజ్యోతి’, ఏడీ-6 అడ్వర్టైజ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఎడ్యుకేషన ఎక్స్పో ‘విద్యాజ్యోతి‘ ఆదివారం మౌర్యఇన హోటల్లోని ఆర్య కన్వెన్షన హాలులో ఘనంగా ముగిసింది. మెగా ఎడ్యుకేషన ఎక్స్పో కార్యక్రమానికి కర్నూలు నగరంతో పాటు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వందలాదిగా తరలిరావడంతో అపూర్వ స్పందన లభించింది.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన కేక్ కట్ చేసి, అందరికీ పంచి పెట్టి.. సంబరాలు జరుపుకున్నారు
ఎండలు మండుతుండటంతో తాగునీటి పథకాలకు కూడా నీటి సమస్య మొదలయింది. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల చేయాలని ఎల్లెల్సీ అధికారులు డ్యామ్ అధికారు లకు ఇండెంట్ పె ట్టారు. ఏప్రిల్ 1వ తేదీన తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల జరుగుతున్నట్లు ఎల్లెల్సీ అధికారులు తెలుపుతున్నారు.
యేసు మార్గం అనుసరణీయమని పాస్టర్లు అన్నారు. ఆదివారం పెద్దబోదనం, మద్దూరు, ముత్యాలపాడు, తోడెండ్లపల్లె, పెద్దవంగలి గ్రామాల చర్చిలలో గుడ్ఫ్రైడే పండుగకు ముందుగా వచ్చే మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు నిర్వహించారు. ఆర్సీఎం పాస్టర్ ఫెర్నాండెస్, సీఎ్సఐ పాస్టర్లు సౌందర్యరాజు, రవింద్రనాథ్, కిషోర్, విద్యాకర్, మార్తోమా ఏలియన్, నందం ఐజాక్, ఆనంద్కుమార్ల ఆధ్వర్యంలో మట్టలతో గుడి ప్రదక్షిణలు చేశారు.
మండలంలోని మాధవరం, చెట్నహళ్లి, సూగూరు, రచ్చమర్రి, రాంపురం, తుంగభద్ర, వగరూరు, తిమ్మా పురం, మాలపల్లి, మంత్రాలయం గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని కైస్త్రవులు జరుపుకున్నారు.
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
పట్టణంలోని జవ్వాజి సుంకన్న గౌడ్ సేవా సమితికి దాతలు సూదిరెడ్డి శ్రీధర్రెడ్డి, సూదిరెడ్డి రమేష్రెడ్డి, శ్రీకాంత్, ఆవుల శివశంకర్ కలిసి ఫ్రీజర్ బాక్స్ను విరాళంగా అందజేశారు.
విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఎంతో కీలకమని, రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థమంతమైన కోఆర్డినేషన్తో ప్రాణనష్టం తగ్గించవచ్చని ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ పేర్కొన్నారు.